Friday, April 17, 2026
39.2 C
Hyderabad

నక్సలిజం అంతంతో శాంతి స్థాపన సాధ్యమేనా?|EDITORIAL

మావోయిస్టులు అంతమైతే హింస లేకుండా పోతుందా? నక్సలైట్లను నిర్మూలిస్తే శాంతి సమకూరి, అభివృద్ధి జరిగి తీరుతుందా? అసలు నక్సలిజమే దేశంలోని అంతర్గత అన్ని సమస్యలకు కారణమా? అదే నిజమైతే ఆరు దశాబ్దాలుగా ఆ ఉద్యమం మనగలగడానికి కారణాలేంటి? అసలు ప్రభుత్వాలు సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తున్నాయా? అదే జరిగితే ప్రభుత్వాలే చెబుతున్నట్లు దేశంలో ‘లెఫ్ట్ టెర్రరిజం’ వేళ్ళూనుకుని, ఎందుకు కొనసాగుతున్నట్లు? సమస్యలున్నంత కాలం వాటి పరిష్కారానికి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు వంటి శాంతియుత పద్ధతులేగాక, ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు కూడా ఉంటాయి. నిర్బంధాలను బట్టి వాటి తీవ్రతలుంటాయి. అసలు సమస్యలను పరిష్కరించకుండా, నక్సలిజాన్ని రూపుమాపితే, రేపు మరో రూపంలోనో, మరో తీరులోనో మళ్ళీ ఇలాంటి పోరాటాలే జరగవన్న గ్యారెంటీ ఏమీ లేదు కదా? 

ప్రస్తుతానికి నక్సల్స్ నిర్మూలన శాశ్వత పరిష్కారంగా కనిపించవచ్చు. ఈ ఏరివేత వెనుక అదానీ, అంబానీ వంటి ఘనుల కన్ను, అడవుల్లోని విలువైన గనుల మీద ఉన్నది నిజమైతే గనుక, ఇలాంటి, ఇంతకుమించిన ఉద్యమాలు మళ్ళీ పుట్టకమానవు. ఇలాంటివేవీ లేవన్న నమ్మకాన్ని ప్రభుత్వాలు గిరిజనులకు కలిగించాలి. ఇవన్నీ జరిగితేనే శాశ్వత శాంతి స్థాపన సాధ్యం. లేకపోతే నక్సలిజం అనే గాయం ఏదో ఓ రూపంలో మళ్లీ మళ్లీ రెచ్చుతూనే ఉంటుంది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

మావోయిస్టులు అంతమైతే హింస లేకుండా పోతుందా? నక్సలైట్లను నిర్మూలిస్తే శాంతి సమకూరి, అభివృద్ధి జరిగి తీరుతుందా? అసలు నక్సలిజమే దేశంలోని అంతర్గత అన్ని సమస్యలకు కారణమా? అదే నిజమైతే ఆరు దశాబ్దాలుగా ఆ ఉద్యమం మనగలగడానికి కారణాలేంటి? అసలు ప్రభుత్వాలు సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తున్నాయా? అదే జరిగితే ప్రభుత్వాలే చెబుతున్నట్లు దేశంలో ‘లెఫ్ట్ టెర్రరిజం’ వేళ్ళూనుకుని, ఎందుకు కొనసాగుతున్నట్లు? సమస్యలున్నంత కాలం వాటి పరిష్కారానికి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు వంటి శాంతియుత పద్ధతులేగాక, ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు కూడా ఉంటాయి. నిర్బంధాలను బట్టి వాటి తీవ్రతలుంటాయి. అసలు సమస్యలను పరిష్కరించకుండా, నక్సలిజాన్ని రూపుమాపితే, రేపు మరో రూపంలోనో, మరో తీరులోనో మళ్ళీ ఇలాంటి పోరాటాలే జరగవన్న గ్యారెంటీ ఏమీ లేదు కదా?

భారతదేశంలో నక్సలైట్ సమస్య పశ్చిమ బెంగాల్ లో పుట్టి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అంతర్గత భద్రతకు సవాల్ గా నిలిచింది. ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి, భద్రత, అభివృద్ధి లక్ష్యాలను సాధించడం ఇప్పటికీ పూర్తిగా సాధ్యపడలేదు. ‘కగార్’ వంటి ఆపరేషన్లతో మావోయిస్టులను అంతం చేయడం ప్రభుత్వాలకి పెద్ద పనేం కాదు. కానీ, కేవలం మావోయిస్టులను, మావోయిజాన్ని నిర్మూలిస్తే సరిపోతుందా? గిరిజనుల అసలు సమస్యలు, వారి జీవన ప్రమాణాలు, వారి అభివృద్ధిలో సమూల మార్పు రాకపోతే, మావోజానికి మరో రూపం, మరో తరం మళ్లీ పుడితే? నక్సల్స్ ఆయుధాలు పట్టడం తప్పే. అయితే, ఇప్పుడు పరిష్కారం కాని ఓ జాతి, పీడితుల సమస్యల కోసం కొట్లాడుతున్న వాళ్ళని, మన ప్రభుత్వాలు తుదకంటా కొట్టేస్తున్నాయి. కానీ ఆ సమస్యలను కాదు కదా? అప్పుడు మళ్ళీ ఇదే ‘క(0)గార్’ ఆపరేషన్లతో సరిపెడతారా? అంటే హింస-ప్రతిహింసలకు అంతం లేదా? ఇక ఉండదా!?

నక్సలిజం పుట్టుకకు ప్రధాన కారణాలు ఆర్థిక అసమానతలు. అటవీ ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనం. భూమి సమస్యలు. పరిపాలనా నిర్లక్ష్యం. గిరిజనుల అణచివేత. హక్కుల కాలరాత. పోలీసు, అటవీ అధికారుల నిర్బంధాలు, అన్యాయాలు వంటివెన్నో ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సమస్యలు ఉన్నంత కాలం, ఒక సమస్యను బలంగా అణచివేసినా, మరో రూపంలో అది తిరిగి తలెత్తుతుంది. నక్సలిజాన్ని, నక్సల్స్ ను అంతమొందించిన తర్వాత ఆ ప్రదేశాల్లో అభివృద్ధి జరిగి తీరాలి. గిరిజనుల జీవనోపాధులు పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి. వారి ప్రాథమిక హక్కులు, అవకాశాలు, భవిష్యత్తుపై భద్రత కల్పించాలి.

గిరిజనుల అభివృద్ధి అంటే రోడ్లు, విద్యుత్, పాఠశాలలు కట్టడం మాత్రమే కాదు. గిరిజనుల సంస్కృతిని కాపాడుతూ, వారి జీవన విధానాన్ని గౌరవిస్తూ, వారి విధానాలలో వారికి నిర్ణాయక భాగస్వామ్యం కల్పించాలి. రోడ్లు వేసినా, పాఠశాలలు కట్టినా, అవి వారికి అందుబాటులోకే రావడంలేదు. టీచర్లు రాకపోవడం, ఆరోగ్య సిబ్బంది వెళ్లకపోవడం, అటవీ హక్కుల చట్టం అమలు కాకపోవడం, గిరిజనులకు నిజమైన భూమి హక్కులు రాకపోవడం పెద్ద సమస్యలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో నక్సల్స్ ను నిర్మూలించే ఆపరేషన్లు విజయవంతమైనా, గిరిజనుల మౌలిక సమస్యలు పరిష్కరించకపోతే శాశ్వత శాంతి సాధ్యం కాదు.

శాంతి స్థాపనకు ముందుగా గిరిజన హక్కుల అమలు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములపై గిరిజనుల హక్కులను గుర్తించి, పట్టాలివ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూమికి వారు యజమానులు కాకపోతే, వారు చేసే సాగు, జీవనోపాధి స్థిరంగా ఉండదు. వారికి అవసరమైన, వారి భాషలోనే నాణ్యమైన విద్యనందించాలి. లోతట్టు అటవీ ప్రాంతాల్లో మల్టీగ్రేడ్ టీచింగ్ ప్రణాళిక, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు ఉత్తమ పరిష్కారాలు. గిరిజనులు మలేరియా, క్షయ, రక్తహీనత, పోషకాహార లోపం వంటి అనేక వ్యాధుల బారినపడుతున్నారు. వారి కోసం ప్రత్యేక మొబైల్ వైద్య బృందాలు, హెల్త్ యూనిట్లు అవసరం. ఇక ఉపాధి సృష్టి. గిరిజనుల సహజ వనరుల ఆధారిత జీవనాన్ని బలపరచడానికి అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, కో-ఆపరేటివ్ మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతర చొరబాట్లను, దోపిడీని అరికట్టాలి. విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలి.

150 కోట్ల జనాభా గల సువిశాల దేశంలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే నక్సల్స్ ను అంతం చేయడం సైన్యం, ఇంటలిజెన్స్, పోలీసు వ్యవస్థలు బలంగా ఉన్న ప్రభుత్వాలకు పెద్ద లెక్కకాదు. అంతకంటే ప్రజల నమ్మకం గెలుచుకోవడమే నిజమైన విజయం. అభివృద్ధిని చూడని గ్రామాలకు, అడవుల్లో ఒంటరిగా జీవించే గిరిజనులకు, నక్సల్స్ చూపే, దారులే ‘పరిష్కారం’గా కనిపిస్తాయి. ప్రభుత్వాలు పోలీసు కఠిన ఆపరేషన్లు ఎన్ని చేసినా, సమాజంలో అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇవ్వకపోతే, అది అందని సమాజంలో అసహనం పెల్లుబికుతుంది. ఎక్కడో పుట్టిన పుండుపై నిర్లక్ష్యం వహిస్తే, అది మొత్తం సమాజ శరీరాన్నే అంతం చేస్తుంది.

ప్రస్తుతానికి నక్సల్స్ నిర్మూలన శాశ్వత పరిష్కారంగా కనిపించవచ్చు. ఈ ఏరివేత వెనుక అదానీ, అంబానీ వంటి ఘనుల కన్ను, అడవుల్లోని విలువైన గనుల మీద ఉన్నది నిజమైతే గనుక, ఇలాంటి, ఇంతకుమించిన ఉద్యమాలు మళ్ళీ పుట్టకమానవు. ఇలాంటివేవీ లేవన్న నమ్మకాన్ని ప్రభుత్వాలు గిరిజనులకు కలిగించాలి. ఇవన్నీ జరిగితేనే శాశ్వత శాంతి స్థాపన సాధ్యం. లేకపోతే నక్సలిజం అనే గాయం ఏదో ఓ రూపంలో మళ్లీ మళ్లీ రెచ్చుతూనే ఉంటుంది.

Latest News

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

శింతపండు పురుగుపట్టది! నల్లబడది!!|ADUGU TRENDS

ఇగో గీ శింతపండు లేకపోతే ఎవ్వలికీ ఎల్లది. పప్పుశారు, సేప పులుసు, అంటుపులుసు, ఒట్టి సేపల పులుసు, దప్పడం, అన్ని తొక్కుల్ల ఏసుడే కాదు, ఆఖరికి శింతపండు తొక్కు కూడ శేసుకొని తింటం....

చట్టసభలు అ (కొ) 0దరి కోసమేనా!?|EDITORIAL

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల...

17-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య సాయంత్రం 05.25 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం రేవతి మధ్యాహ్నం 11.55 వరకు ఉపరి అశ్విని యోగం వైధృతి ఉదయం 07.10 వరకు ఉపరి విష్కమ్భ కరణం చతుస్పాద ఉదయం 06.15...

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News