Friday, April 17, 2026
37.2 C
Hyderabad

ఎల్ఐసీపై మోదీ-అదానీ ప్రై‘వేటు’!?|EDITORIAL

1956 సెప్టెంబర్ 1న 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థగా ఏర్పడిన ఎల్ఐసి, లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం.
భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

భారత ప్రజల స్వేదంతో నిర్మితమైన భారతీయ జీబిత బీమా సంస్థ అదానీ పరమవుతోందా? అదానీ ఆర్థిక పరిపుష్టికి ఎల్ఐసీని తాకట్టు పెడుతున్నారా? బీజేపీ మోదీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మోదీలో ‘ఆదా’ –సగం- గా పేరుబడిన గౌతం అదానీ గ్రూపునకు అప్పనంగా ఎల్ఐసీని అప్పగిస్తున్నారా? ఎక్కడో అమెరికాలో ఉన్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెలువరించే వరకు, బయటకు తెలియకుండా గుట్టు గా గుటకాయ స్వాహా చేస్తున్నారా?

1956సెప్టెంబర్ 1న దేశంలోని 245 బీమా సంస్థలతో కలిపి భారతీయ జీవిత బీమా సంస్థను ఏర్పాటు చేశారు. బీమాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యం. ‘యోగక్షేమం వహామ్యహ’ -మీ సంక్షేమం మా బాధ్యత-నినాదం. హౌసింగ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ లి., కార్డ్స్ సర్వీసెస్ లి., మ్యూచువల్ ఫండ్ లి., పెంషన్ ఫండ్ లి., ఐడిబిఐ బ్యాంకుగా లక్షా 14వేల మంది ఉద్యోగులతో, 38 కోట్ల పాలసీదారులతో విస్తరించింది. ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.32 లక్షల కోట్లు. నికర ఆదాయం రూ.2,700 కోట్లు. రెవిన్యూ రూ.5 లక్షల 60వేల కోట్లు. భారత దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ. 2024లో బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం, ఎల్‌ఐసీ ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌లలో మూడవది. ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకారం 2022 నాటికి నాలుగవది. ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు ఓ ప్రైవేట్ వ్యక్తి పరం కాబోతోందా?

అదానీతో ప్రధాని మోదీ బంధం బలమైంది. అదానీ కంపెనీపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఏ చర్యా తీసుకోలేదు. కనీసం ఖండించలేదు. అదానీ వ్యవహారంపై గతంలో పార్లమెంట్‌ స్తంభించింది. ఆర్థిక అవతవకలు, అమెరికా సంస్థ ఆరోపణలు అలా ఉండగానే తాజగా ఆ కంపెనీకి ఎల్‌ఐసి మొత్తాన్ని ధార పోశారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసిని అదానీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం బలి పెట్టడంపై వస్తున్న విమర్శలను సైతం పట్టించుకోవడం లేదు. కోట్లాదిమంది పాలసీదారుల, ఉద్యోగుల, అధికారుల ప్రయోజనాలను అదానీకి బలివ్వడం అసమంజసం.

గతంలోనే ఎల్‌ఐసిని ప్రైవేటీకరించాలని చూసినప్పుడు, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎల్‌ఐసి మొత్తాలను అదానికి అప్పుగా బదిలీ చేయడంపై దేశంలో మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లెఫ్ట్‌ నేతలు కూనంనేని సాంబశివరావు, బివి రాఘవులు, మరికొందరు వ్యతిరేకతను చాటారు.

అమెరికా నుండి వెలువడే ’వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో ఎల్ఐసీపై ప్రత్యేక కథనం వచ్చింది. అంతర్జాతీయంగా విత్త సంస్థలు అదానీకి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 3.9 మిలియన్‌ డాలర్లు అంటే 33 వేల కోట్ల రూపాయలను అదానీ గ్రూపునకు మళ్లించడానికి సిద్ధమైందననే ఆ వార్త సారాంశం. ఇందులో భాగంగానే అదానీ పోర్ట్స్‌ అనుబంధ సంస్థ రుణాల రీఫైనాన్స్‌ కోసం జారీ చేసిన 585 బిలియన్‌ డాలర్ల దాదాపు రూ.5,000 కోట్ల బాండ్లను ఎల్‌ఐసి కొనుగోలు చేసింది. అదానీపై ‘లంచం, మోసం ఆరోపణలపై అమెరికా కోర్టుల్లో కేసులు నమోదైన నేపథ్యంలో అమెరికా, యూరోపియన్‌ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడాతున్న తరుణంలో భారత ప్రభుత్వం అదానీ కోసం ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రణాళికను రూపొందించిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్‌ఎస్‌), ఎల్‌ఐసి నుండి పొందిన అంతర్గత పత్రాలు సహా అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధుల మళ్లింపునకు ఏ విధంగా పాల్పడిందో గుర్తించామని ఆ పత్రిక పేర్కొంది.

రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో అదానీ పోర్ట్సు విడుదల చేసిన మొత్తం బాండ్లను 2025 మే 30న ఒక్క ఎల్‌ఐసి కొనేసింది. అదానీ గ్రూపునకు విశ్వసనీయత కల్పించడమన్నది అసలు కుట్ర. అందుకే అంతకు ముందు ససేమిరా అన్న అమెరికా ఏథెన్‌ ఇన్సూరెన్స్‌ అదానీలో జూన్‌లో 750 మిలియన్‌ డాలర్లు అంటే రూ.6,650 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

ఆదానీ ఆర్థిక అక్రమాలు, అవినీతిపై 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వరుస రిపోర్టులను విడుదల చేసింది. అదానీ కృత్రిమంగా తన కంపెనీల షేర్లను పెంచుకుంటున్నారని, డొల్ల కంపెనీలతో పన్నులు ఎగ్గొడుతున్నారని విశ్లేషించింది. అదానీ కంపెనీలు ప్రమాదకర అప్పుల్లో కూరుకుపోయాయని కూడా వెల్లడించింది. ఇప్పుడు వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ ప్రభుత్వ వర్గాలు, ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

అయితే అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని ఎల్‌ఐసి పేర్కొంది. బోర్డు ఆమోదించిన విధి విధానాల మేరకే తాము పెట్టుబడులు పెడతామని, వాటిపై తమదే తుది నిర్ణయమని బుకాయించింది. ఇంతకీ ఎల్‌ఐసిలో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు తెలపడం ప్రభుత్వ బాధ్యత. వెంటనే పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి. ఇంతపెద్ద మొత్తంలో వ్యవహారం గుంభనంగా సాగడాన్ని అడ్డుకోవాలి. ఎల్‌ఐసిని ప్రైవేట్‌ పరం చేస్తున్నారా? అయితే, ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెంచాలి. పాలకుల కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలపై నిలదీయాలి. విపక్ష కాంగ్రెస్‌ గట్టిగా నిలబడాలి. ఎల్‌ఐసిని రక్షించే పోరాటానికి దిగాలి. అందుకు దేశంలోని ప్రజలు కూడా అవగాహనతో అడుగులు వేయాలి.

Latest News

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

శింతపండు పురుగుపట్టది! నల్లబడది!!|ADUGU TRENDS

ఇగో గీ శింతపండు లేకపోతే ఎవ్వలికీ ఎల్లది. పప్పుశారు, సేప పులుసు, అంటుపులుసు, ఒట్టి సేపల పులుసు, దప్పడం, అన్ని తొక్కుల్ల ఏసుడే కాదు, ఆఖరికి శింతపండు తొక్కు కూడ శేసుకొని తింటం....

చట్టసభలు అ (కొ) 0దరి కోసమేనా!?|EDITORIAL

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల...

17-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య సాయంత్రం 05.25 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం రేవతి మధ్యాహ్నం 11.55 వరకు ఉపరి అశ్విని యోగం వైధృతి ఉదయం 07.10 వరకు ఉపరి విష్కమ్భ కరణం చతుస్పాద ఉదయం 06.15...

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News