Monday, August 3, 2026
29.5 C
Hyderabad

పవన్ హామీ నెరవేరేనా!|EDITORIAL

ప్రకృతి మనకు అందించిన గొప్ప వరం. మన చుట్టూ ఉన్న సహజవనరులు. చెట్టూ, చేమా, అడవులు, సముద్రాలు, నదులు, సరస్సులు వంటి జలవనరులు, మంచినీరు, ఆహారం, జీవనాధారం మాత్రమే కాదు, అవన్నీ ఎన్నో జీవుల జీవాధారం కూడా. మనిషి నిర్లక్ష్యం వల్ల ఈ జీవ నవనరులు మరణశాసనం రాస్తున్నాయి. ప్రాణి జీవాధారమైన గాలి, నీరు, ఆహారం కాలుష్యాల వల్ల మనిషిదే కాదు మొత్తం ప్రాణుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. నీటి కాలుష్యం వల్ల అందులో ఉన్న చేపలు, ఇతర జలజీవులు అనేకమంది అజ్ఞానం, నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడుతున్నాయి.

ఇక పరిశ్రమల కాలుష్యం నదులను, చెరువులను, చివరకు సముద్రాన్ని కూడా కలుషితం చేస్తోంది. ఒకప్పుడు పటాన్‌ చెరువు, ఎల్‌బినగర్‌ సిరిస్‌ కంపెనీల కాలుష్యంపై ఏళ్లుగా పోరాటాలు జరిగాయి. హుస్సేన్‌ సాగర్‌ కాలుష్య కాసారంగా మిగలిపోయింది. కొబ్బరి నీళ్లలా హుస్సేన్‌ సాగర్‌ నీళ్లను చేస్తానన్న కేసీఆర్‌ మాటలు నోరు దాటినా, సాగర్ ను తాకలేదు. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించినా అదంతా మనకు ఉట్టిగానే తోస్తోంది. ఇప్పుడు ఏపీలో ఉప్పాడ కాలుష్యంపై మత్స్యకారులు పోరాటం చేస్తున్నారు. డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ గట్టిగానే స్పందించారు. అయితే ఆయన పట్టుదల ఎంతవరకు కార్యరూపం దాలుస్తందన్న తేలాల్సి ఉంది.

ఉప్పాడలో మాత్రమే కాదు, విశాఖలో సముద్రజలాల కాలుష్యం ఇంతకుమించి ఉంది. కాకినాడలో పారిశ్రామికంతోపాటు, మైనింగ్‌ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై అధికారులతో పవన్‌ కళ్యాణ్‌ చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో ‘మాట-మంతి’లో మత్స్యకారులు సమస్యలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు. పొల్యూషన్‌ ఆడిట్‌కి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతోపాటు గోదావరి జిల్లాల్లో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై వివరాలు తెలుసుకున్నారు. ఇక ఎలాంటి అడుగులు వేస్తారన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచి ఉంది.

నిజానికి ఉప్పాడ తీరంలో ఉంటున్న జాలరులు సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరి ఉపాధిని ఇబ్బడి ముబ్బడిగా వెలసిన ఫార్మా కంపెనీలు గండి కొడుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతుండడంతో చేపలు, జాలరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాకినాడ జిల్లా కెఎస్‌ఇజడ్‌ పరిధిలో లైఫిజ్‌, అరబిందో ఫార్మా లాంటి కంపెనీలు వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు యు.కొత్తపల్లి మండలంలో కోనపాపపేట, తొండంగి మండలం పెరుమల్లపురం మధ్యలో మూడు కిలోమీటర్ల పొడవునా భారీ పైపు లైన్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఫార్మా వ్యర్థాలు, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండానే సముద్రంలోకి నేరుగా వదిలేస్తున్నారు. తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న హేచరీల ద్వారా రసాయనిక జలాలు, ఇతర వ్యర్థాలు సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీనివల్ల చేపలు దూరంగా వెళ్లిపోయాయి. కొన్ని చేపలు చనిపోతున్నాయి. గతంతో పోలిస్తే, ప్రస్తుతం చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. జాలర్లకు, చేపల పెంపకందారులకు నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.
ఈ కాలుష్యంపై పోరాటం గత ప్రభుత్వ హయాం నుంచీ జరుగుతోంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మారిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఆశించారు. వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదలాలని కోరుతున్నారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి తొండంగి మండలం అద్దారిపేట వరకు 32 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ రెండు మండలాల్లో 18 గ్రామాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్లే చేపలు చనిపోతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో చిన్నబోటుపై వేటకు వెళ్తే రోజుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల విలువైన చేపలు దొరికేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఒక్కసారి వేటకు వెళ్తే చిన్నబోటుకు రూ.2 వేలు, పెద్ద బోటుకు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకూ ఆయిల్‌కు ఖర్చవుతుందని తెలిపారు. పెద్ద బోట్లలో 12 మంది వరకూ వేటకు వెళ్తారని, 15 రోజుల వరకూ సముద్రం లోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఆయిల్‌, ఐస్‌, ఇతర నిర్వహణకు మొత్తంగా రూ.1.50 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. ఖర్చులుపోనూ గతంలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయం సమకూరేదని, ప్రస్తుతం చేపలు దొరక్కపోవడంతో ఖర్చులు కూడా రావట్లేదని ఉప్పాడ మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.

మత్స్యకారులు గతేడాది ఏప్రిల్‌లో బీచ్‌ రోడ్డుని పూర్తిగా నిర్బంధించి పది రోజులపాటు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. కాలుష్యాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఆయన డిప్యూటీ సిఎం అయినప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. దీంతో, మత్స్యకారులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. వేల సంఖ్యలో ఉప్పాడ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ స్పందించి సమస్య పరిష్కారానికి వంద రోజుల సమయం కావాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణకు దిగారు. మరి పవన్ కళ్యాణ్ హామీ ఎంతవరకు అమలవుతుందో, మత్స్యకారులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News