Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా!?|EDITORIAL

2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగి, ఏపీ- తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాలు కూడా భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. 2014-15లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లుగా కాగ్‌ తేల్చింది. ఒకవైపు ఆదాయ మార్గాలు పెరుగుతున్నా, అంతకంతకూ పెరుగుతున్న ఉద్యోగులు, పాలకుల జీత భత్యాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రాలకు పెను భారంగా మారుతున్నాయి. విధానాల లోపాలు, ఆదాయ సముపార్జనలో వ్యూహాత్మక తప్పిదాలు, అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులు, అమలుకు అలవికాని ఉచిత సంక్షేమ పథకాలు, అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి దాపురించడానికి కారణం పాలకుల, అధికారుల అసమర్థతే. ఈ పరిస్థితిలో రాష్ట్రాలు అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా? వ్యూహాత్మక పరిష్కారాలు ఏంటి?

ప్రస్తుతం ప్రభుత్వమే బడ్జెట్ లో చెప్పిన విధంగా తెలంగాణ అప్పు భారం రూ.6.85 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 26.2%. సమానం. అప్పుల్లో ఎక్కువగా మంచినీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, వడ్డీ భారాలు, జీత భత్యాలు, పెన్షన్లు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ఖర్చులే ఎక్కువ. బడ్జెట్ లో సగం జీత భత్యాలకుపోను, రూ.56వేల కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయి. 2024 25 లో తెలంగాణ ఆదాయాల్లో 78% స్వంత వనరుల నుంచి వస్తోంది, మిగతా 22% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికికు పన్నుల వాటాగా 12%, గ్రాంట్ల రూపంలో 10% నిధులు వస్తున్నాయి.
ఏపీ లో అప్పులు రూ.4.86 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 34.7% కు సమానం. ఇందులో ఉచిత, సంక్షేమ పథకాలకు 55వేల కోట్లు ఖర్చవుతున్నాయి. దీనికి గత ప్రభుత్వాల అధిక ఖర్చులు, ప్రాజెక్టుల మేనేజ్‌మెంట్ లోపాలు, ఆదాయ వృద్ధి తక్కువ ఉండటం, కేంద్ర సాయం గ్రాంట్లు తక్కువగా అందడం కారణాలు. 2023 24 లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ఆదాయాల్లో 57% స్వంత వనరుల నుంచి, మిగతా 43% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికి పన్నుల వాటాగా 20%, గ్రాంట్ల రూపంలో 23% నిధులు వస్తున్నాయి.

తాజాగా తెలంగాణ 16వ ఫైనాన్స్ కమిషన్ ముందు అప్పులను పునర్వ్యవస్థీకరించాలని, వడ్డీ తగ్గింపు, చెల్లింపు ప్రీమియం తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. కొన్ని అప్పులను కమర్షియల్ కాని బ్యాంకులకు బదలాయించాలని కూడా కోరింది.

అలాగే, ప్రస్తుత రాష్ట్రాల ఆదాయంలో కేంద్రం వాటా 41% ఉన్నా, తెలంగాణ ఆ పన్నుల వాటాను 50%కి పెంచాలని కోరుతోంది. ఇందువల్ల రాష్ట్రాలకు స్వతంత్ర వ్యయం నిలుపుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. కేంద్ర పథకాలను రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అమలు చేసే స్వేచ్ఛని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, సహాయ నిధులు అనుకున్న స్థాయిలో రాష్ట్రాలకు చేరడం లేదు.
అయితే, ఇవన్నీ కలిసి రాష్ట్రాలకు పెను సవాళ్ళను విసురుతున్నాయి. అప్పుల పెరుగుదల సంక్షేమ పథకాలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టుల్లో ఖర్చు పెరిగిపోవటం, వాటిని బడ్జెట్ లో స్పష్టంగా తెలపడకపోవటం. ఆదాయ వృద్ధి తక్కువగా ఉండటం, ఉత్పాదకత, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి ఆలస్యం కావటం. పన్నుల వసూలు, ప్రభుత్వ ఆస్తులను వదిలేయడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లోపాలు ఉండటం వంటి సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి.

మరి వీటి పరిష్కార మార్గాలు ఏమిటి? అంటే రాష్ట్రాలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. దినసరి వేతనాలు, సామాజిక రంగ పంపిణీ పథకాలను సమీక్షించాలి. కొన్ని ఉచిత పథకాలు ప్రభుత్వానికి పెను భారాన్ని కలిగిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెంచుకోవాలి. పన్నుల వసూలును సరళం చేయాలి. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం కాకుండా, వాటిని, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించాలి. ఆయా పథకాలను పున: పరిశీలించాలి. ప్రతి పథకం లాభ నష్టాలను బేరీజు వేయాలి. నష్టం చేసే పథకాలకు తిలోదకాలివ్వాలి. ప్రభుత్వ పథకాలు, ఆదాయ వ్యయాల్లో పారదర్శకతను పాటించాలి. ప్రతి పథకానికి ఆడిట్ ఉండాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సహాయం సహా, ఆర్థిక సంక్షేమ నివేదికలు రూపొందిస్తూ దశల వారీగా అప్పులను తగ్గించుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలి. కేంద్ర గ్రాంట్లు, ప్యాకేజీలు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం చూపేవిగా ఉండాలి. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే, కేంద్ర సహాయం, ప్యాకేజీలు పెరిగి, పన్నులు తగ్గి పురోగతికి ఆస్కారం ఏర్పడుతుంది.

అప్పులు అధికమైతే, అది రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను దెబ్బతీస్తాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు పార్టీలిచ్చే వాగ్దానాలు ప్రశ్నార్థకమవుతాయి. కేంద్రం ఇచ్చే సహాయం తాత్కాలికమే. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు స్వీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News