Saturday, May 2, 2026
39.2 C
Hyderabad

మసూద్ అజార్ ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్!

అతను ఒక మామూలు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కొడుకు. 8వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికి, జామియా ఉలూమ్ ఇస్లామిక్ పాఠశాలలో చేరాడు, అలీమ్‌గా పట్టభద్రుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. ఈ అలీమే ఆతర్వాత అంతర్జాతీయ ఉగ్రవాది అయ్యాడంటే నమ్మడం కష్టమే. పాకిస్తాన్ తమ దేశ అధ్యక్షుడికంటే, ప్రధాని కంటే కూడా, అత్యంత సైనిక భద్రత కల్పించి రక్షిస్తున్నది కూడా ఇతడినే. అయితే భారత్ లో ఇప్పటి దాకా జరిగిన అన్నిదాడులకు ప్రధాన సూత్రధారి కూడా ఇతడే. అతడే ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్.

హైదరాబాద్, మే 8 (అడుగు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి):
పాకిస్తాన్ లోని పంజాబ్‌లో గల బహవల్‌పూర్‌లో జూలై 10, 1968న పుట్టిన మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్. మన దేశంలోనే (1994 ఫిబ్రవరిలో)అరెస్టై, జైలులో ఉండి, విమానం హైజాక్ ద్వారా (1999, డిసెంబర్ లో ) విడుదలై, మన పార్లమెంట్ మీదే (డిసెంబర్ 13, 2001న) దాడి చేయించిన కరడుగట్టిన టెర్రరిస్టు నాయకుడు కూడా ఇతడే. 2008 ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి, ఇలా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (2000) వ్యవస్థాపకుడు. అది అతని కుటుంబ సంస్థ.

అయితే, భారతదేశం ఫిబ్రవరిలో అనంతనాగ్ సమీపంలోని ఖనాబాల్ నుండి అతన్ని అరెస్టు చేసింది. 1999 విమానం హైజాక్ నేపథ్యంలో జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా పాకిస్తాన్ కి వెళ్ళిపోయాడు. తమ దేశంలో అతడిపై ఎలాంటి అభియోగాలు లేనందున పాక్ కనీసం అతడిని అరెస్టు కూడా చేయలేదు. డిసెంబర్ 29, 2001న భారత పార్లమెంటుపై డాడి తర్వాత ఏడాదిపాటు గృహ నిర్బంధం చేసి, 2002 డిసెంబర్ 14న ఆ నిర్బంధాన్ని ముగించారు.

విడుదలైన కొద్దికాలానికే, అజార్ కరాచీలో 10వేల మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ” భారతదేశాన్ని నాశనం చేసే వరకు ముస్లింలు శాంతితో విశ్రాంతి తీసుకోకూడదని మీకు చెప్పడం నా విధి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ” అని ప్రకటించాడు, కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

2008 ముంబై దాడుల తర్వాత అతను పాకిస్తాన్ పంజాబ్ లోని తన స్వస్థలం భవల్‌పూర్‌లో ఉంటున్నాడు. 2014 జనవరి 26న, రెండేళ్ళ ఏకాంతవాసం తర్వాత అజార్ తిరిగి కనిపించాడు. 2019 పుల్వామా దాడికి పాల్పడింది తమ సంస్థేనని పాక్ పకడ్బందీ ఆర్మీ రక్షణలోని బంకర్ నుండి ప్రకటించాడు. దీంతో అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

ఇక అప్పటి నుంచి కనిపించడం మానేసిన మసూద్ అజార్, 2025 మే 7న, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా , బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ శిబిరంతో సహా, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు నిర్వహించింది . మసూద్ అజార్ తన సోదరి, మేనల్లుడు, మేనకోడళ్ళు, ఇతర దగ్గరి బంధువులతో సహా 14 మందిని కోల్పోయి, చావు మిగిల్చిన విషాదాన్ని అనుభవిస్తున్నాడా? లేక చావు దెబ్బ తిన్నాడా? సమీప కాలంలోనే బండారం అంతా బట్ట బయలవుతుంది.

Latest News

శెదలు పట్టకుండ శేసే శిట్కా!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు...

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు....

02-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 10.45 వరకు ఉపరి విదియ నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి అనూరాధ యోగం వ్యతీపాత రాత్రి 08.24 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ...

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News