Friday, April 3, 2026
32.2 C
Hyderabad

అ‘శాశ్వత’ పనులేనా!?|MEDARAM

కుంభమేళాకు ‘టెంట్ సిటీ!’
మేడారానికి ‘ఆటవిక ట్రీటీ’?
జాతీయ గుర్తింపే లేదాయె?
కాంట్రాక్టర్లకు భోజ్యంగి తాత్కాలిక పనులు
గద్దెల చుట్టూ భూ సేకరణ ఎప్పుడు?
శాశ్వత పనులకు మోక్షం ఎప్పుడు?
మరో కుంభమేళా మేడారంకు నేడు సీఎం|CM
ఏర్పాట్లను పరిశీలించనున్న ముఖ్యమంత్రి|REVANTH REDDY

వరంగల్, సెప్టెంబర్ 22 (అడుగు ప్రత్యేక ప్రతినిధి): మేడారం స‌మ్మక్క‌-సార‌ల‌మ్మ వ‌న దేవ‌త‌ల జ‌న జాత‌ర. ఆదివాసీలు అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో జ‌రుపుకునే అడ‌వి పండుగ‌. వాళ్ళ ఆత్మగౌర‌వ పండుగ‌. కాల‌క్రమేణా స‌క‌ల జ‌నుల పండుగ‌గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం జాత‌ర‌. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. అందుకే దీన్ని తెలంగాణ కుంభ‌మేళా అంటారు. కేవ‌లం నాలుగు రోజుల్లోనే దేశం న‌లుమూల‌ల నుంచి కోట్లాది మంది హాజ‌ర‌య్యే, అభ‌యార‌ణ్యంలో జ‌రిగే అద్భుత జ‌న జాత‌ర‌. అయితే, ఏడాదికేడాది పెరుగుతున్న భ‌క్తుల తాకిడి త‌ట్టుకోలేక‌, రెండేళ్ళకోసారి నిర్వహిస్తున్న‌ మేడారం స‌మ్మక్క‌-సార‌ల‌మ్మ‌ జాతరని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి నిర్వహిస్తున్నది. ఎన్ని డిమాండ్లు వచ్చినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం నేటికీ జాతీయ పండుగగా ప్రకటించలేదు. 836 ఏళ్ళుగా జ‌రుగుతున్నా, నేటికీ ఆద‌ర‌ణ త‌గ్గక‌పోగా, నానాటికీ జ‌న సంద‌ర్శన‌ పెరుగుతున్న ఏకైక జాత‌ర‌ మేడారం స‌మ్మక్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌. మేడారం, పూర్వపు వ‌రంగ‌ల్ జిల్లా, నేటి ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామంలో జరుగుతున్నది.

అడ‌వి బిడ్డల అస్తిత్వ ఆత్మగౌర‌వ‌మే స‌మ్మక్క‌. ఆమె కుటుంబమే సారలమ్మ, పగిడిద్ద రాజు, జంపన్న తదితరులు. కాకతీయుల కాలంలో ప్రతాప‌రుద్రుడి కాలంలో క్రీ.శ.-1158 నుండి 1195ల మధ్య రాజుకు కప్పం కట్టే విషయంలో వచ్చిన యుద్ధం, ఆ యుద్ధంలో సమ్మక సహా, ఆమె సైన్యం, కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోగా, ఆమె చిలుకల గుట్టలో అంతర్థానం అవడం జరిగిపోయాయి. ఆ గుర్తుగానే ఆమెను ప్రతి ఏటా మేడారం గద్దెల మీదకు తెచ్చి కొలిచే జాతర, కాస్తా, రెండేండ్ల కోసారి జరిగే మహా జాతరగా, వన జాతరగా, రెండో కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది.

1940కి ముందు బ‌య్యక్కపేట‌లో జ‌రిగేద‌ని, అక్కడి వ‌డ్డె (పూజారు)లు వృద్ధాప్యంతో పూజ‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లోనే మేడారంకు జాత‌ర మారింద‌ని కూడా మ‌రో చ‌రిత్ర ప్రాచుర్యంలో ఉంది. 1940 నుంచి చిలకలగుట్టపైనే ఆదివాసీలు మాత్రమే జాతరను జరిపేవారు. 1946నుంచి జాతరను మేడారంలో నిర్వహించడం మొదలైంది. ఆ తర్వాత 1962లో సార‌ల‌మ్మను కీకారణ్యంలోని మేడారం గద్దెలపై ప్రతిష్ఠించారు. 1968లో జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 1998లో ఈ జాతరను అప్పటి ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. వైభవోపేతంగా నిర్వ‌హిస్తోంది. అయితే, 1998లో రాష్ట్ర పండుగగా ప్రకటించినా, కేంద్రం జాతీయ పండుగగా ప్రకటించకపోయినా, నానాటికీ మేడారానికి జనాదరణ పెరుగుతూనే ఉంది. కానీ, ఏర్పాట్లు మాత్రం శాశ్వత ప్రాతిపదినక కాకుండా, కేవలం తాత్కాలిక ప్రాతిపదికనే జరుగుతున్నాయి. కుంభమేళాకు టెంట్ సిటీని వేసి మరీ కోట్ల కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తున్నది. కానీ, మేడారం జాతరను మాత్రం గిరిజనులను లాగే నిర్లక్ష్యం చేస్తూ నామమాత్రం నిధులతో, తాత్కాలిక పనులతో కమిషన్లకు అలవాటు పడి కాంట్రాక్టర్లను మాత్రమే బతికిస్తున్నాయి.

శాశ్వత ప్రాతిప‌దికన అభివృద్ధి ప‌నులేవి?
ఉమ్మడి రాష్ట్రంలో అర‌కొర నిధుల‌తో నిర్వహించే జాత‌రకు తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత 2016లో తొలిసారిగా స్వరాష్ట్రంలో జరిగిన జాత‌ర‌కు రూ.136 కోట్లు మంజూరయ్యాయి. 2018 లో రూ. 80 కోట్లు కేటాయించ‌గా 2020లో కేవలం రూ. 75 కోట్లు కేటాయించారు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి రూ.150 కోట్లు కేటాయించారు. 2018 జాత‌ర‌కు కోటి 30ల‌క్షల మంది భ‌క్తుల రాగా, గత ఏడాది కోటిన్నర దాటారు. ఈ సంఖ్య ఈ ఏడాది 2 కోట్లు కూడా దాటే అవకాశం ఉందని అంచ‌నా.

మ‌రోవైపు భ‌క్తుల కోసం మేడారం జాత‌ర‌లో 24 గంట‌ల‌పాటు విద్యుత్, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి వ‌స‌తి, స్నానఘట్టాలు, ర‌వాణా స‌దుపాయాలను ప్రభుత్వం భారీ ఎత్తున క‌ల్పిస్తున్నది. కానీ, కేవలం ఆ నాలుగైదు రోజుల కోసమే కావడంతో అవన్నీ తాత్కాలికంగానే జరుగుతున్నాయి. ఇందుకు ముందుగా మేడారం గద్దె చుట్టూ ఉన్న స్థలాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఆ స్థలాల్లోనే శాశ్వత పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఆ అడవంతా జనమయమైపోడంతో ఆ జన తాకిడిలో పనులన్నీ కొట్టుకుపోతున్నాయి. మరో రెండేండ్లు వస్తే తప్ప, ఆ జాతరను అటు ప్రభుత్వం, ఇటు వడ్డెలు, జనం కూడా పట్టించుకోవడంలేదు. మేడారం పనులను పరిశీలించడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శశ్వత పనుల విషయమై స్పష్టమైన ఆదేశాలిస్తారన్న ఆశతో అటు భక్తులు, వడ్డెలు, ఆదివాసీ గిరిజనులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.మరి సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి?

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News