Thursday, July 30, 2026
22.6 C
Hyderabad

కేంద్రమా? ‘స్థానిక’ ఆమోదమా!?|EDITORIAL

స్థానిక ఎన్నికల నిర్వహణకు HIGH COURT| హైకోర్టు లైన్‌ క్లీయర్‌ చేయడంతో పాటు, డెడ్‌లైన్‌ కూడా విధించింది. మరోవైపు 42శాతం BC| బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని BRS| బీఆర్‌ఎస్‌, BJP| బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. కుల గణన చేసి చరిత్ర సృష్టించామని, మోడీకి సవాల్‌ విసిరామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల అమలు అంత సులువు కాదు. ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు, రెండోవైపు పార్లమెంటు ఆమోదం తప్పనిసరైన పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు దీనికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఎన్నికలను THREE MONTHS| 3 నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్డు గడువు విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై STATE GOVERNMENT| రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెరిగింది. అంతటా ఉత్కంఠ పెరిగింది.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు CONGRESS| కాంగ్రెస్‌ ప్రభుత్వం, EDUCATION| విద్య, JOBS| ఉద్యోగాల్లో, LOCAL BODY| స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఉభయ సభల్లో తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం కోసం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదింప చేయాలని ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. కిషన్‌రెడ్డి ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. అయితే బీసీ కుల గణన అంతా తప్పుల తడకగా ఉందని బీజేపీ వాదిస్తోంది. బీజేపీ ప్రభత్వం కూడా దేశ వ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణనకు పూనుకుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేదా పదేపదే ప్రకటస్తున్న మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు గతంలో 7.5శాతమే ఉండగా, ప్రస్తుతం 10శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మిగతా రిజర్వేషన్లను కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 70 శాతం చేరే అవకాశం ఉన్నది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా, కేంద్రాన్ని కాదని బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసినా, అవి అమలు అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్‌ చేస్తే మొత్తం ఎన్నికల పక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కేంద్రం ఆమోదం లేకుండా 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. అది కాకుంటే స్థానికంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా సాధ్యం కాదు. అందువల్ల పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన చేయడం మినహా కాంగ్రెస్ కు మరో మార్గం కనిపించడంలేదు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా తమిళనాడుకు కల్పించినట్లే తమకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు, రాజకీయ కారణాలు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అమోదించింది. కానీ ఈ నిర్ణయం రాష్ట్ర పరిధిలో అమలు చేయగలిగింది కాకపోవడంతో గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, ఆచితూచి అడుగేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపైనా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. అయితే రాజ్యాంగ పరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాతే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి కూడా న్యాయ సలహాకు పంపవచ్చు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు స్థానికంగానే అమలు సాధ్యమా? అన్న విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల వచ్చే న్యాయపరమైన చిక్కులపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ మూడు నెలల్లో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. అందువల్ల పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గం. పైగా ప్రతిపక్షాలపై కూడా ఆవిధంగా ఒత్తిడి పెంచవచ్చు. హైకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై సీఎస్‌ రామ కృష్ణారావు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే, తమిళనాడు తరహాలో సుప్రీంకోర్టు మెట్లెక్కాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. తెలంగాణలో కులగణన, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులపై కేంద్రం పెద్దగా స్పందించడం లేదు. ఈదశలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News