Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

కేంద్రమా? ‘స్థానిక’ ఆమోదమా!?|EDITORIAL

స్థానిక ఎన్నికల నిర్వహణకు HIGH COURT| హైకోర్టు లైన్‌ క్లీయర్‌ చేయడంతో పాటు, డెడ్‌లైన్‌ కూడా విధించింది. మరోవైపు 42శాతం BC| బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని BRS| బీఆర్‌ఎస్‌, BJP| బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. కుల గణన చేసి చరిత్ర సృష్టించామని, మోడీకి సవాల్‌ విసిరామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల అమలు అంత సులువు కాదు. ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు, రెండోవైపు పార్లమెంటు ఆమోదం తప్పనిసరైన పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు దీనికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఎన్నికలను THREE MONTHS| 3 నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్డు గడువు విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై STATE GOVERNMENT| రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెరిగింది. అంతటా ఉత్కంఠ పెరిగింది.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు CONGRESS| కాంగ్రెస్‌ ప్రభుత్వం, EDUCATION| విద్య, JOBS| ఉద్యోగాల్లో, LOCAL BODY| స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఉభయ సభల్లో తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం కోసం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదింప చేయాలని ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. కిషన్‌రెడ్డి ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. అయితే బీసీ కుల గణన అంతా తప్పుల తడకగా ఉందని బీజేపీ వాదిస్తోంది. బీజేపీ ప్రభత్వం కూడా దేశ వ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణనకు పూనుకుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేదా పదేపదే ప్రకటస్తున్న మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు గతంలో 7.5శాతమే ఉండగా, ప్రస్తుతం 10శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మిగతా రిజర్వేషన్లను కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 70 శాతం చేరే అవకాశం ఉన్నది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా, కేంద్రాన్ని కాదని బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసినా, అవి అమలు అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్‌ చేస్తే మొత్తం ఎన్నికల పక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. కేంద్రం ఆమోదం లేకుండా 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. అది కాకుంటే స్థానికంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా సాధ్యం కాదు. అందువల్ల పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన చేయడం మినహా కాంగ్రెస్ కు మరో మార్గం కనిపించడంలేదు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా తమిళనాడుకు కల్పించినట్లే తమకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు, రాజకీయ కారణాలు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అమోదించింది. కానీ ఈ నిర్ణయం రాష్ట్ర పరిధిలో అమలు చేయగలిగింది కాకపోవడంతో గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, ఆచితూచి అడుగేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపైనా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. అయితే రాజ్యాంగ పరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాతే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి కూడా న్యాయ సలహాకు పంపవచ్చు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు స్థానికంగానే అమలు సాధ్యమా? అన్న విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల వచ్చే న్యాయపరమైన చిక్కులపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ మూడు నెలల్లో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. అందువల్ల పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గం. పైగా ప్రతిపక్షాలపై కూడా ఆవిధంగా ఒత్తిడి పెంచవచ్చు. హైకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై సీఎస్‌ రామ కృష్ణారావు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే, తమిళనాడు తరహాలో సుప్రీంకోర్టు మెట్లెక్కాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. తెలంగాణలో కులగణన, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులపై కేంద్రం పెద్దగా స్పందించడం లేదు. ఈదశలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News