తీవ్ర గాయాలతో YASHODA|యశోద దవాఖానకి తరలింపు
BRS|బిఆర్ఎస్ నేత, JANGAON|జనగామ MLA|ఎమ్మెల్యే PALLA RAJESHWAR REDDY|పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర గాయాలతో HOSPITAL|దవాఖానలో చేరారు. మంగళవారం ఉదయం ఎర్రవెల్లి గ్రామంలోని EX CM|మాజీ సిఎం కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద ఆయన కాలు జారి కిందపడిన ఘటనలో తొడ భాగానికి తీవ్రంగా గాయం అయ్యింది. ఈ ఘటనతో వెంటనే అతన్ని HYDERABAD|హైదరాబాద్లోని YASHODA|యశోద హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అత్యవసర పరీక్షలు చేస్తూ చికిత్స అందిస్తున్నారు. తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఆపరేషన్ జరగనున్నట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యంపై సమాచారం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలు సమావేశాలు, పార్టీలోని కీలక నేతల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.

