తెలుగు సాహిత్య దిగ్గజం. సాహితీ హిమవత్ శిఖరం డాక్టర్ లింగంపల్లి రామచంద్ర. కవి, రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పరిశోధకుడే కాకుండా అలుపెరుగని సాహితీ వేత్త. అతి సామాన్యుడు, సౌజన్యమూర్తి. లింగంపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావులు ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారాలు అందుకున్నారు. అంతేగాక, సోమనాథ కళాపీఠం నుంచి వి. చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని లింగపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య అందుకున్నారు. అలాగే పొట్లపల్లి శ్రీనివాసరావు కాళోజికి, సోమనాథ కళాపీఠానికి, వరంగల్లోని సాహిత్య ప్రముఖులకు సన్నిహితుడుగా ఉన్నారు. ప్రముఖ రచయిత పాలడుగు రత్నాకర్ రావు రాసిన ప్రత్యేక వ్యాసం. అడుగు ఎడిటోరియల్
సాహితీ హిమవత్ శిఖరం
అతను
ఏ వేదికమీద కూర్చున్నా
మెడనిండా పూదండలు
భుజాలు వంగేంత
శాలువాల బరువు
రెండు చేతులు వడసిపట్టుకునే
అక్షర ఫలకాలు లెక్కకందనివి
అందుకున్న పురస్కారాలు
కోకొల్లలు
ఇవ్వన్ని సొంతం చేసుకున్నది
ఎవ్వరనుకున్నారు సామాన్యుడిలో
అతి సామాన్యుడు, సౌజన్యమూర్తి.
అని అంటే నమ్ముతారా ఎవ్వరైనా?
పేర్వారం జగన్నాధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార గ్రహిత డా౹౹ లింగంపల్లి రామచంద్ర గారని అంటే నమ్మాలి.
కవి, రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పరిశోధకుడే కాకుండా అలుపెరుగని సాహితీ వేత్త.
ఇల్లే
కార్యశాలగా
చేసుకున్న
అతని ఇంట్లోనే ఇవ్వన్ని
సాదృశ్యాలు
చూపరులకు అమృత
కలశాలు
సాహిత్యాభిలాశకులకు
కనులవిందులు
అతని బాధ్యతలనే కాదు
బరువులను పంచుకుని
వెన్నంటి నిలచే అర్ధాంగి
మేమున్నాము నాన్న..
అంటున్న
ఉతకఱ్ఱలు వారి కూతుళ్లు
అవును ఇప్పుడతను
వృద్దుడు,
సాహిత్యంలో మాత్రం
నిత్యయవ్వనుడు
అతనేనండి లింగంపల్లి!
నాడు బళ్లో పాఠాలు చెప్పినంత
అలవోకగా సాహిత్య మధురిమల్ని
పంచుతున్నాడు ఈనాడు
సాహిత్యలోకానికి
జనగామ సాహిత్యరంగంలో
ఈ తరానికి ఆద్యుడు
రామచంద్రం గారే
జిల్లా సమీప
కుగ్రామం ఆతని జన్మస్థలం
వాల్మీకిమహర్షి నడచిన
పాదముద్రలు
కనిపించాయని చెప్పుకుంటారు అక్కడి పూర్వీకులు
ఆయన పెరుగుతున్న
పాదులో సాహిత్యపు నీళ్లు
ఒలికినట్లున్నవి
జాలువారుతున్న ఆ తడిలో
నేటికింకా తడిచి ముద్దవుతున్నాడు
ఈ సాహిత్యకారుడు
పల్లె నేపద్యం గల పల్లె
జీవితమాతనిది నేటికి
ఆయన సుదూరగతంలో
ఉమ్మడి వరంగల్ జిల్లా నాటి సాహితీ
దిగ్గజాలందరు తన గురు సమానులనే
చెప్పుకుంటాడు ఈయన సవినయంగా
తాను సాహితీ మెట్లుఎక్కించిన
వారి లెక్క చెప్పమంటే మాత్రం మరచిపోయానంటాడు వినమ్రంగా ఎంతో మంది ఔత్సాహికులకు మార్గదర్శి అయ్యుండి కూడ
నేటి సాహితీ లోకంలో సుస్థిర స్థానం ఆతనిది, ఎనలేని విలువలు నిలిపిన మానవతావాది, సాహితీసంచారి
గురుతుల్యులు పేర్వారం గారని సగర్వంగా చాటుకొనే
ఈ సాహితీకారునికి..
పేర్వారం గారి
వారసులు అందించిన స్మారక
పురస్కార ప్రదానోత్సవం
నాటి సాహితీ దిగ్గజాల సరసన
ఒదిగిన మణికిరీటం ఈతను
అవునండీ అతనే, అతనే లింగంపల్లి రామచంద్ర గారు
నా అభినందనాక్షరాలు కూడ నేడు వారికే, వారికే మరి!


