Wednesday, July 29, 2026
23.1 C
Hyderabad

సాహితీ హిమవత్ శిఖరం|ARTICLE|ESSAY

తెలుగు సాహిత్య దిగ్గజం. సాహితీ హిమవత్ శిఖరం డాక్టర్ లింగంపల్లి రామచంద్ర. కవి, రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పరిశోధకుడే కాకుండా అలుపెరుగని సాహితీ వేత్త. అతి సామాన్యుడు, సౌజన్యమూర్తి. లింగంపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావులు ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారాలు అందుకున్నారు. అంతేగాక, సోమనాథ కళాపీఠం నుంచి వి. చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని లింగపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య అందుకున్నారు. అలాగే పొట్లపల్లి శ్రీనివాసరావు కాళోజికి, సోమనాథ కళాపీఠానికి, వరంగల్‌లోని సాహిత్య ప్రముఖులకు సన్నిహితుడుగా ఉన్నారు. ప్రముఖ రచయిత పాలడుగు రత్నాకర్ రావు రాసిన ప్రత్యేక వ్యాసం. అడుగు ఎడిటోరియల్ 

సాహితీ హిమవత్ శిఖరం

అతను

ఏ వేదికమీద కూర్చున్నా
మెడనిండా పూదండలు

భుజాలు వంగేంత
శాలువాల బరువు

రెండు చేతులు వడసిపట్టుకునే
అక్షర ఫలకాలు లెక్కకందనివి

అందుకున్న పురస్కారాలు
కోకొల్లలు

ఇవ్వన్ని సొంతం చేసుకున్నది
ఎవ్వరనుకున్నారు సామాన్యుడిలో
అతి సామాన్యుడు, సౌజన్యమూర్తి.

అని అంటే నమ్ముతారా ఎవ్వరైనా?

పేర్వారం జగన్నాధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార గ్రహిత డా౹౹ లింగంపల్లి రామచంద్ర గారని అంటే నమ్మాలి.

కవి, రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పరిశోధకుడే కాకుండా అలుపెరుగని సాహితీ వేత్త.

ఇల్లే
కార్యశాలగా
చేసుకున్న
అతని ఇంట్లోనే ఇవ్వన్ని
సాదృశ్యాలు

చూపరులకు అమృత
కలశాలు
సాహిత్యాభిలాశకులకు
కనులవిందులు

అతని బాధ్యతలనే కాదు
బరువులను పంచుకుని
వెన్నంటి నిలచే అర్ధాంగి

మేమున్నాము నాన్న..
అంటున్న
ఉతకఱ్ఱలు వారి కూతుళ్లు

అవును ఇప్పుడతను
వృద్దుడు,
సాహిత్యంలో మాత్రం
నిత్యయవ్వనుడు

అతనేనండి లింగంపల్లి!

నాడు బళ్లో పాఠాలు చెప్పినంత
అలవోకగా సాహిత్య మధురిమల్ని
పంచుతున్నాడు ఈనాడు
సాహిత్యలోకానికి

జనగామ సాహిత్యరంగంలో
ఈ తరానికి ఆద్యుడు
రామచంద్రం గారే

జిల్లా సమీప
కుగ్రామం ఆతని జన్మస్థలం
వాల్మీకిమహర్షి నడచిన
పాదముద్రలు
కనిపించాయని చెప్పుకుంటారు అక్కడి పూర్వీకులు

ఆయన పెరుగుతున్న
పాదులో సాహిత్యపు నీళ్లు
ఒలికినట్లున్నవి

జాలువారుతున్న ఆ తడిలో
నేటికింకా తడిచి ముద్దవుతున్నాడు
ఈ సాహిత్యకారుడు

పల్లె నేపద్యం గల పల్లె
జీవితమాతనిది నేటికి

ఆయన సుదూరగతంలో
ఉమ్మడి వరంగల్ జిల్లా నాటి సాహితీ
దిగ్గజాలందరు తన గురు సమానులనే
చెప్పుకుంటాడు ఈయన సవినయంగా

తాను సాహితీ మెట్లుఎక్కించిన
వారి లెక్క చెప్పమంటే మాత్రం మరచిపోయానంటాడు వినమ్రంగా ఎంతో మంది ఔత్సాహికులకు మార్గదర్శి అయ్యుండి కూడ

నేటి సాహితీ లోకంలో సుస్థిర స్థానం ఆతనిది, ఎనలేని విలువలు నిలిపిన మానవతావాది, సాహితీసంచారి

గురుతుల్యులు పేర్వారం గారని సగర్వంగా చాటుకొనే
ఈ సాహితీకారునికి..

పేర్వారం గారి
వారసులు అందించిన స్మారక
పురస్కార ప్రదానోత్సవం

నాటి సాహితీ దిగ్గజాల సరసన
ఒదిగిన మణికిరీటం ఈతను

అవునండీ అతనే, అతనే లింగంపల్లి రామచంద్ర గారు

నా అభినందనాక్షరాలు కూడ నేడు వారికే, వారికే మరి!

 పాలడుగు రత్నాకర్ రావు
(డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, పెద్ది వెంకటయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావులు ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారాలు అందుకున్న సందర్భంగా)

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News