Wednesday, July 29, 2026
23.6 C
Hyderabad

ఓటర్ల జాబితాసవ ‘రణం’?!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే ప్రాణం. రాజ్యంగం ఆత్మ. ఓటు హక్కు ప్రజాస్వామిక రాజ్యాంగాలకు మూలం. అయితే, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్) కార్యక్రమం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడితే అది రాజ్యాంగానికే విఘాతం. అదే సమయంలో బోగస్ ఓట్లు కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి ముప్పే. అందువల్ల సవరణ కార్యక్రమం నిష్పాక్షికంగా, సాక్ష్యాధారాలతో, పారదర్శకంగా సాగాలి. ఎవరైనా తమ ఓటు కోల్పోయినట్లయితే వారికి తక్షణ ఉపశమనం కల్పించే వ్యవస్థ ఉండాలి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. విశ్వాసం బలపడాలంటే పారదర్శకత ఒక్కటే మార్గం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే ప్రాణం. రాజ్యంగం ఆత్మ. ఓటు హక్కు ప్రజాస్వామిక రాజ్యాంగాలకు మూలం. అయితే, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్) కార్యక్రమం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ ప్రక్రియపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరం లేదని సాధారణంగా ఎవరూ చెప్పలేరు. కాలక్రమంలో మరణించినవారి పేర్లు, వలస వెళ్లినవారి వివరాలు, లేదా నకిలీ నమోదు, రెండు, మూడు చోట్ల ఓట్లు వంటి అంశాలు జాబితాలో ఉంటున్నాయి. అందుకే ఎన్నికల కమిషన్ నిర్దిష్ట వ్యవధిలో సమీక్ష చేపట్టింది. ఈ ప్రక్రియలో పారదర్శకత, సమగ్రత, పౌరుల హక్కుల పరిరక్షణ అత్యంత కీలకం.

పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’పై అభ్యంతరాలు న్యాయస్థానాల మెట్లెక్కాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే స్వయంగా సుప్రీంకోర్టులో నల్లకోటు వేసుకుని మరీ వాదించారు. జ్యుడిషియల్ పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగాలని సుప్రీం ఆదేశించింది. ఒకవైపు ప్రక్రియను అడ్డుకోరాదని సూచిస్తూనే, మరోవైపు న్యాయపరమైన పర్యవేక్షణ అవసరాన్ని గుర్తు చేసింది.

వీటికతీతంగా, రాజకీయ పార్టీల్లో మాటల యుద్ధం ముదురుతోంది. మమత, సర్ ను ఉద్దేశపూర్వక చర్యగా విమర్శిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఎన్నికల కమిషన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ నినాదంతో ప్రచారం చేపట్టారు. అధికార బీజేపీ ప్రతిపక్షాల చర్యలను ఖండిస్తూనే, సర్ ను ఓట్ల ప్రక్షాళనగా సమర్థిస్తోంది.

ఒకవేళ నిజంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడితే అది రాజ్యాంగానికే విఘాతం. అదే సమయంలో బోగస్ ఓట్లు కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి ముప్పే. అందువల్ల సవరణ కార్యక్రమం నిష్పాక్షికంగా, సాక్ష్యాధారాలతో, పారదర్శకంగా సాగాలి. ఎవరైనా తమ ఓటు కోల్పోయినట్లయితే వారికి తక్షణ ఉపశమనం కల్పించే వ్యవస్థ ఉండాలి.

బెంగాల్ తరహాలోనే, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ అవకతవకల అనుమానాలు వ్యక్తమైనప్పటికీ నిరూపితం కాలేదని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. అలాగని విపక్షాల అనుమానాలు పూర్తిగా నిరాధారమని కూడా కొట్టిపారేయలేం. అనుమానం వ్యక్తం చేయడం తప్పు కాదు. కానీ దాన్ని సాక్ష్యాధారాలతో, బాధ్యతాయుతంగా నిరూపించగలగాలి. రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

దేశ సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల అక్రమ వలసలపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో నిజమైన భారత పౌరులు ఇబ్బంది పడకూడదు. పత్రాల ధృవీకరణ ప్రక్రియలో మానవ హక్కులు, సహజ న్యాయం, పరిపాలనా పారదర్శకత తప్పనిసరి. అధికారులపై ఒత్తిళ్లు, విధి నిర్వహణలో లోపాలు వంటి ఆరోపణలు వస్తే అవి సీరియస్‌గా పరిశీలించాలి.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కూడా ఇలాగే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాలక్రమేణా సాంకేతిక సమీక్షలు, న్యాయపరమైన పరిశీలనలు ఆ వ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తున్నాయి. అదే విధంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. విశ్వాసం బలపడాలంటే పారదర్శకత ఒక్కటే మార్గం.

రాజకీయ పార్టీలు తమ తాత్కాలిక ప్రయోజనాల కంటే దేశ ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని ప్రాధాన్యంగా చూడాలి. ప్రతి ఎన్నిక ముందు ఏవేవో వివాదాలు రేకెత్తడం ఆరోగ్యకరమైన ధోరణి కాదు. ఒకవేళ లోపాలు ఉన్నాయనుకుంటే చట్టపరమైన మార్గాల్లో పోరాడాలి. మొత్తం వ్యవస్థను అవమానించడం సమస్యకు పరిష్కారం కాదు.

సర్ పై జరుగుతున్న వివాదం ఒక అవకాశంగా మారాలి. ప్రక్రియ బలోపేతానికి. ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, ప్రజలకు అవగాహన కల్పించి, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను వేగవంతం చేయాలి. రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విశ్వాసాన్ని కాపాడటం అందరి బాధ్యత.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News