Sunday, April 12, 2026
36.2 C
Hyderabad

కాలానుగుణ ప్రగతి పరుగులు సాధ్యమేనా!?|EDITORIAL

కాలం గిర్రున తిరుగుతోంది. క్యాలెండర్లు గిరగిరా మారుతున్నాయి. కానీ ప్రజల జీవితాల్లో మాత్రం ఆ కాలానుగుణ మార్పు కనిపించడం లేదు. ఏళ్ళకు ఏళ్ళు గడుస్తున్నా పరిపాలన స్వరూపం, ప్రజల జీవన ప్రమాణాలు, దేశ అభివృద్ధిపై ప్రశ్నలే మిగులుతున్నాయి. 2026లోకి అడుగిడిన ఈ సమయంలో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ పాలన ప్రజల జీవన ప్రమాణాల ఉన్నతికి ఏమేరకు దోహదపడిందనేది నిజాయితీగా నిర్ధారించుకోవాల్సిన సందర్భమిది.

రానురాను జీవనం మరింత కఠినమవుతోంది. ధరలు, నిరుద్యోగం పెరుగుదల, ఉపాధిలేమి, ఆర్థిక అస్థిరత సామాన్యుడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సరైన విధాన నిర్ణయాల లోపం, ప్రజా ప్రయోజనాలపై రాజకీయ లాభాలే ఆధిక్యతను ప్రదర్శించడం, వల్ల దేశం నానాటికీ దిగజారుతోంది. అభివృద్ధి అధికారిక ప్రకటనల్లో మాత్రమే వినిపిస్తోంది.

విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు దాదాపు లేనట్లే. ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలు నిర్వీర్యమవుతుండగా, ప్రైవేట్ వ్యాపారం మూడు సంస్థలు, ఆరు బ్రాంచీలుగా విరాజిల్లుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు వసతుల కొరతతో అల్లాడుతుంటే, కార్పొరేట్ సంస్థలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇందుకు పాలకుల లోపభూయిష్ట విధానాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయాలను స్వల్ప, దీర్ఘకాలిక అభివృద్ధికి బదులు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ పథకాల పేరిట దుబారా చేస్తున్నాయి. ఫలితంగా దేశం అప్పుల్లో కూరుకుపోతోంది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని అభివృద్ధికి మించిన సంక్షేమం ఎప్పటికీ అనర్థదాయకమే.

దేశం సహా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరగడం లేదు. యువత ఉద్యోగాల కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు భూముల అప్పగింత నిరంతరంగా సాగుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు లభించక, వ్యవసాయం లాభసాటిగా మారకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రై‘వేటు’ అత్యంత దారుణంగా మారింది. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో ప్రైవేటీకరణ ఆయా రంగాలను నిర్వీర్యం చేస్తున్నాయి. రక్షణ రంగంలోనూ ఈ తంతు దేశ, ప్రజల భవిష్యత్తు భద్రతపై అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దేశ సంపదలో అధిక భాగం కేవలం కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, అధిక సంఖ్యాకులైన కోట్లాది మంది కూడు, గూడు, గుడ్డ విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలకే నిత్యం పోరాడుతున్నారు. ఈ అసమానతలను తగ్గించాల్సిన పాలకులు, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించడం ప్రజల్లో అసంతృప్తిని, అసహనాన్ని పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా స్పష్టత లేకుండా కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలాయి. ఈ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి పాలకులు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

దళితులు, ఆదివాసులు, మహిళలపై జరుగుతున్న దాడులకు ముగింపు పలికి, సమానత్వం కాగితాలకే పరిమితం కాకుండా అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. జల్, జంగల్, జమీన్‌పై కార్పొరేట్ ఆక్రమణలు ఆగాలి. పర్యావరణ విధ్వంసం కేవలం ప్రకృతి సమస్య కాదు. అది జీవన, సామాజిక న్యాయ సమస్య. అయితే, న్యాయవ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం సన్నగిల్లుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికైనా ఉచిత పథకాల దుబారాను తగ్గించి, నిజమైన అభివృద్ధికి నిధులు వెచ్చించాలి. కేవలం అవసరమైన పేదలకు మాత్రమే సంక్షేమం అందిస్తూ, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరి, దేశం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయగలదు.

Latest News

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

11-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ నవమి రాత్రి 08.34 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 10.08 వరకు ఉపరి శ్రవణ యోగం సిద్ద మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి సాధ్య కరణం తైతుల ఉదయం 07.59...

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News