Friday, April 10, 2026
36.2 C
Hyderabad

ఓటర్ల జాబితా సవ‘రణ’లు!|EDITORIAL

భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?

దేశంలో ఉద్యోగ, ఉపాధి వలసలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఓట్లు ఒకచోట, వారొక చోట ఉండటమో, లేదా రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటమో చేస్తున్నారు. ఓటే లేకుండా పోవడమో జరుగుతోంది. చిరునామా మార్చులు, మరణించినవారి పేరు తొలగించకపోవడం లాంటి కారణాల వల్ల జాబితా మార్పులు అవసరం అవుతాయి. భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్లు ‘ఒకసారి తయారైన ఓటర్ల జాబితాను ఎప్పటికి అలాగే కొనసాగించలేం. అందుకే సవరణ అవసరం’. భద్రతా ప్రమాణాల రీత్యా, రిప్రజెంటేసన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 16 ప్రకారం ‘కేవలం భారత పౌరులు, 18 ఏళ్ళు నిండిన వారు ఓటర్లుగా నమోదు కావచ్చు’.

అయితే, సాంకేతికత, సమాచారం, డిజిటలైజేషన్ పెరిగిన ఈ తరుణంలో ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులను అత్యంత భద్రతగా ఇవ్వాల్సి ఉంది. కానీ, నకిలీ గుర్తింపు కార్డులున్నట్లుగా గుర్తించారు. ఓటర్ల రిజిస్ట్రేషన్, జాబితా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలంటే, సవరణలు తప్పనిసరి.
అయితే వసరణల్లో లోపాలే సవరణ ఎందుకు? అన్న ప్రశ్నలను సంధిస్తున్నాయి. హడావుడిగా ఎన్నికలకు ముందే ఈ సవరణలు చేపట్టడం వల్ల అనుమానాలు కలుగుతున్నయి. నిర్ణీత పద్ధతులు, సమయాల్లో నిరంతరంగా జరగాల్సిన సవరణపై సుప్రీం కోర్టు కూడా ఈసీని మందలించింది. ఇందుకు తగ్గట్లుగానే, వసరణల్లో లోపాలు, నిర్లక్ష్యాలు, ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. డాక్యుమెంటేషన్ పద్ధతి వల్ల నిరక్షరాస్యులైన ఓటర్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పరిమిత వనరులతో తక్కువ సమయంలో చేపట్టే సవరణలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ అత్యున్నత న్యాస్థానం చెబుతున్నట్లు.. ఇలాంటి అనుమానాలకు తావులేకుండా ఓటర్ల జాబితా సవరణలు నిరంతరంగా పారదర్శకంగా జరగాలి. సవరణ సులభంగా ఉండి, నిజమైన ఓటు పోకుండా ఉండాలి. ఆధార్ లింకింగ్, డేటాబేస్ పూర్తి చేయడం, ఇంటర్నెట్/మొబైల్ ద్వారా తనిఖీలు చేయడం వంటి మార్గాలు ఉండాలి. అయితే ఇది ప్రజల గోప్యత, డేటా భద్రత హక్కులకు హాని కలగకుండా ఉండాలి. ‘అధికారికంగా ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాద’ని ఈసీ తెలిపింది. సవరణ ఎన్నికల ముంగిట కాకుండా, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండాలి.

అయితే, బిహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ వివాదస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ సవరణలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈసీని నిందించింది. దొంగ ఓట్లను చేర్చారని అనుమానించింది. పెద్ద దుమారమే లేచింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఓటర్ల సవరింపులో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలన్నీ సవరణను వ్యతిరేకిస్తున్నాయి. ‘స్థానిక సంస్థలకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎస్‌ఐఆర్‌ చేపట్టవద్దని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమిళ సీఎం అఖిలపక్షానికి పిలునిచ్చారు.

ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చడం తప్పే. అయితే, ఓటర్ల జాబితా ఆధునీకరణ పక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా, రాజకీయ పక్షపాత రహితంగా, అనుమానాలకు తావివ్వని విధంగా చేపట్టాల్సిందే. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికలు భారత రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు మూలస్తంభం. వాటిని నిర్వహించే ఎన్నికల కమిషన్‌ను బలోపేతం చేస్తూ పోవాల్సిందే. శేషన్‌ లాంటి వారు ఎన్నికల కమిషనర్‌గా ఉన్నత ప్రమాణాలను పాటించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను చేపట్టే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేసింది. సీజేఐని తొలగించి, ఆ స్థానంలో సీనియర్‌ కేబినెట్‌ మంత్రిని సభ్యుడిగా చేర్చింది. దీన్ని వ్యతిరేకించిన సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెడుతూ పార్లమెంటులో చట్టం చేసింది. ఈ ప్రక్రియే అనేక అనుమానాలకు మూలంగా మారింది.

అయితే, బీహార్‌ ఎస్‌ఐఆర్‌ పక్రియపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనే లేదు. తాజాగా దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టడం వల్ల కొందరికి అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రం ఈ రకమైన అనుమానాలను నివృతి చేయాలి. ప్రతిపక్షాలు కూడా అనుమానాలుంటే వాటిని నిరూపించాలి. అంతేకానీ, వ్యవస్థనే తప్పుపడితే, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. పైగా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడ్డం కూడా మానుకోవాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News