Sunday, April 12, 2026
36.2 C
Hyderabad

వ్యవసాయం సంస్కరణలు – దీర్ఘకాలిక, తక్షణ చర్యలు!|EDITORIAL

మన దేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. జనాభాలో అరవై శాతానికి మించిన ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, ఏనాడూ వ్యవసాయం అంత లాభసాటిగా లేదు. పాతకాలపు పద్ధతులు, నీటి కొరత, మార్కెటింగ్ లోపాలు, దళారుల హస్తలాఘవం, పెట్టుబడుల కొరత, మద్దతు ధర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం, విధానాలే లేకపోవడం వంటి అనేక సమస్యలు వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చి 80 కావస్తునా, వ్యవసాయ రంగం వికాసానికి స్వల్ప, దీర్ఘ కాలిక పరిష్కారాలను ఇంకా వెతకాల్సి రావడం సిగ్గుచేటు. వ్యవసాయ రంగంలో తాత్కాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవి రైతులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయి. వర్షాభావం, వడగళ్ల వాన, తుపానుల కారణంగా పంట నష్టపోతే రైతులకు తక్షణంగా పరిహారం అందించాలి. పంటల బీమా పథకాలను వర్తింప చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు లేదా కరువు, ధరలు పడిపోవడం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులను విముక్తి చేయడానికి రుణభారంలో నుంచి సబ్సిడీని అందించాలి. రైతులకు కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. అవసరమైతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి. విత్తనాలు, ఎరువులు, మందులకు సబ్సిడీలను పెంచాలి. పంట కోత సమయంలో ధరలు పడిపోకుండా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయగల సామర్థ్యం కలిగిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్ లు ఉండాలి. రైతు బజార్లు, డైరెక్ట్ మార్కెటింగ్ యూనిట్లు పెంచాలి.
అలాగే, వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక దృక్కోణం కూడా అవసరం. వ్యవసాయంలో నీటి వాడకం అత్యధికంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులపై దృష్టి పెట్టాలి. సాగునీటి ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించాలి. భూముల రికార్డుల ఆధునీకరణ, భూముల డిజిటలైజేషన్ ద్వారా రైతుల భూములకు భద్రతను పెంచాలి. చిన్న రైతులు భూమి హక్కులను పొందడానికి సులువువైన పద్ధతులు ఉండేలా చూడాలి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. అగ్రి-యూనివర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా తాజా పరిశోధనల్ని రైతులకు చేరవేయాలి. రోడ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగులు వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడం వల్ల రైతులకు నిల్వ, రవాణా సౌలభ్యం కలుగుతుంది. దీని ద్వారా ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. చిన్న రైతులు కలిసి ఎఫ్ పీఓలను స్థాపించి తమ ఉత్పత్తిని కూడగట్టగలగాలి. దీనివల్ల వారికే ఎక్కువ లాభాలు లభిస్తాయి, మధ్యవర్తుల, దళారుల దోపిడీ తగ్గుతుంది. అధిక దిగుబడులు ఉన్న పంటల కోసం విదేశీ మార్కెట్లను సిద్ధం చేయాలి. ప్రభుత్వం సరైన విధానాలతో ఎగుమతులకు మద్దతివ్వాలి. ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఆధారంగా వాతావరణ సమాచారం, మార్కెట్ ధ‌రలు, సలహాలు రైతులకు చేరేలా చేయాలి. కృత్రిమ మేధ వంటి పరిజ్ఞానం వ్యవసాయంలో ప్రవేశించాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ విధానాలు రూపొందించాలి. వ్యవసాయ మార్కెట్ చట్టాల సరళీకరణ చేయాలి. ‘ఈ-నామ్’ వంటి డిజిటల్ మార్కెట్ ప్లాట్‌ఫాంను విస్తరించాలి. రైతులకు క్రెడిట్ రేటింగ్ సిస్టం రూపొందించి, మంచి రైతులకు తక్కువ వడ్డీకి రుణాలుపడాలి.
అయితే, వీటన్నింటినీ అమలు చేయడంలో కొన్ని సవాళ్ళు, ప్రతి బంధకాలు కూడా ఎదురవుతున్నాయి. రాజకీయాలకు లోనైన రుణ మాఫీలు, సబ్సిడీలు వ్యవస్థను కల్లోలపరుస్తున్నాయి. వ్యవసాయంలో లాభాలు లేకుండా పోవడంతో యువత వ్యవసాయరంగం వైపు రావడం లేదు. వాతావరణ మార్పులు, కలుషిత భూగర్భ జలాలు వంటి సమస్యలు విపరీత ప్రభావం చూపుతున్నాయి.
వ్యవసాయం రంగం అభివృద్ధి చెందాలంటే తక్షణ చర్యలు మాత్రమే సరిపోవు. ముందు చూపుతో దీర్ఘకాలిక సంస్కరణలు, శాశ్వత పరిష్కారాలు వెతకాలి. రైతులను ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే విధానాలు సమర్థవంతంగా అమలవ్వాలి. స్వాతంత్ర్యం పొందిన నాటి నుండి ఇప్పటి వరకు వ్యవసాయ రంగం ఎన్నో విప్లవాత్మక మార్పులకు లోనైంది. ఇకపై సాంకేతికత, మౌలిక వసతులు, మార్కెట్ లింకేజ్ వంటి సంస్కరణలు అనే నాలుగు స్తంభాలపై అభివృద్ధి నిర్మించాల్సిన అవసరం ఉంది. ‘అభివృద్ధి చెందే దేశానికి శక్తివంతమైన వ్యవసాయ రంగం అవసరం’ అనే నినాదం నిజం కావాలంటే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక దృక్కోణంతో వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నది.

Latest News

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

11-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ నవమి రాత్రి 08.34 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 10.08 వరకు ఉపరి శ్రవణ యోగం సిద్ద మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి సాధ్య కరణం తైతుల ఉదయం 07.59...

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News