Friday, March 13, 2026
35.8 C
Hyderabad

BC|బీసీలకు DASARA|దసరా బోనాంజా!

42% RISERVATIONS|రిజర్వేషన్లకు జీవో!!
TELANGANA GOVERNMENT|తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం|HISTORICAL DECISION
CONGRESS|కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కు మోక్షం!
కమిటీ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం|GOVERNMENT
రానున్న LOCAL BODY ELECTIONS|స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు
జీవో నెం.9 జారీ.. త్వరలో నోటిఫికేషన్!?
కుల సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు
PRESIDENT|రాష్ట్రపతి, GOVERNOR|గవర్నర్ల వద్ద పెండింగ్ లో బిల్లులు
అయినా, జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్!
42%లో బీసీ మహిళలకు సగం సబ్ కోటా
మొదటి దశలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ|ZPTC|MPP|MPTC
రెండో దశలో సర్పంచ్ పదవులకు ఎన్నికలు
నేడు సీఎస్, డీజీపీలతో ఎన్నికల సంఘం భేటీ

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకుంది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. కేబినెట్ ఆమోదించినప్పటికీ, శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ, బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద పెండింగ్ లో ఉన్నప్పటికీ, వాటన్నింటినీ అదిగమించి జీవోను జారీ చేసింది. కుల సర్వే ఆధారంగా, ప్రత్యేక కమిటీ సిఫారసులకనుగుణంగా ప్రభుత్వం ఈ స్థానిక ఎన్నికల్లోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి పూనుకుంది. అందులో సగం బీసీ మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈసీతో సీఎస్, డీజీపీలు సమావేశం కానున్నాయి. త్వరలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదన్న సుప్రీం కటాఫ్, కోర్టు కేసులు రిజర్వేషన్లకు కానున్నాయా?అన్న అనుమానాలు మాత్రం తొలిగిపోలేదు.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (అడుగు న్యూస్):
బీసీలు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న 42శాతం రిజర్వేషన్లకు జీవో 9 జారీ అయింది. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు మోక్షం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు దసరా బోనాంజను ప్రకటించింది. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగులో ఉన్నప్పటికీ వాటికతీతంగా జీవోనిచ్చింది. చారిత్రాత్మకం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఈసీతో సీఎస్, డీజీపీలు సమావేశం కానున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కార్, సర్వం సన్నద్ధం చేసింది. ఇక షెడ్యూల్ విడుదలే తరువాయిగా మిగిలింది.
తెలంగాణలో పల్లె, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా 42% రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి. ఆర్టికల్స్‌ 40, 243%ణ, 243ు%తో పాటు డైరెక్టివ్‌ ప్రిన్సిపిల్స్‌ ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. ఇప్పటికే కేబినెట్ లో, అసెంబ్లీలో ఈ బిల్లు ఏక్రగీవ ఆమోదం పొందింది. చట్టం ప్రకారం అమలులోకి రాబోయే ఈ రిజర్వేషన్లతో తెలంగాణ దేశంలోనే తొలిసారి బీసీలకు పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్‌ కల్పించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ నిర్ణయంతో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల ప్రాధాన్యం మరింత బలపడనుంది. అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఈ మేరకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్చి 18, 2025న %దీజ% కోటాను 42%కు పెంచే బిల్లులు ఆమోదించారు. ఆగస్టు 31న మరో రెండు బిల్లులు ఆమోదించి, %ూజ, ూు, దీజ%లకు 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లులు గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ అవి పెండింగ్‌ లోనే ఉన్నాయి. డెడికేటెడ్‌ %దీజ% కమిషన్‌ నివేదిక, కుల సర్వే ఆధారంగా 42% %దీజ% కోటా నిర్ణయించారు. ఈ కోటాలో మహిళలకు 50% సబ్‌-కోటా కూడా ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్‌ మ్యాట్రిక్స్‌ను సీల్డ్‌ కవర్లలో పంచాయతీ రాజ్‌ శాఖకు సమర్పించారు. ఈ మ్యాట్రిక్స్‌ ప్రకారం, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు , జిల్లా పరిషత్తులలో కోటాలు నిర్ణయిస్తారు.
కాగా, జీవో విడుదలైనందున వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ రాజ్‌ విభాగం కు సిఫార్సు చేస్తుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తుంది. ఎన్నికలు దశలవారీగా జరుగుతాయి. మొదటి దశలో 31 జిల్లా పరిషత్తులు చైర్మన్‌లు, 566 జెడ్పీటీసీలు లు, 566 ఎంపీపీ ప్రెసిడెంట్లు, 5,773 ఎంపిటీసీల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశలో 13వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి.

అయితే ఈ జీవో చెల్లుబాటుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్‌ 24న తెలంగాణ హైకోర్టు, 42% బీసీ కోటాపై పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘జీవో జారీ కాలేదు, తొందరపడి పిటిషన్‌ వేశారు’’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పుడు జీవో జారీ అయినందుకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే ఆటంకాలను ప్రభుత్వం ఎలా అదిగమిస్తుంది? కోర్టుల్లో వేసే దావాలకు ఏ విధంగా స్పందిస్తుంది? ఏ రకమైన వ్యూహాలున్నాయి? లేక మేమైతే జీవో ఇచ్చాం? అడ్డకున్నది మాత్రం మేం కాదన్న రీతిలో వ్యవహరిస్తుందా? అలాగైతే ఫైనల్ గా రిజర్వేషన్లు అమలవుతాయా? అన్న అనుమానాలు బీసీల్లో వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం మరికొద్ది రోజుల్లోనే రావచ్చు.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News