Tuesday, June 9, 2026
26.6 C
Hyderabad

ప్రజల పక్షపాతి ప్రభంజన్!|PRABHANJAN YADAV

ప్రభంజన్ కుమార్ యాదవ్ ప్రతిభ గల జర్నలిస్టు, కవి, రచయిత, వరంగల్ జిల్లా వాసి. కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. భాషా శాస్త్రం, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ & జర్నలిజం (ఎం.సి.జె.) చదివిండు. రూరల్ & డెవలప్మెంట్ కమ్యూనికేషన్ ఐచ్ఛికంగా ఎం.ఫిల్ పూర్తి చేసిండు.

1988 నుంచి వివిధ తెలుగు పత్రికల్లో దశాబ్ద కాలం జర్నలిస్టుగా పనిచేసిండు. జర్నలిజంలో నిలదొక్కుకోవాలనుకున్నడు. 1998లో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా, స్వభావ రీత్యా నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో నిమగ్నమైండు. ఆత్మవంచన, శక్తివంచన లేకుండా ప్రజల కోసం పనిచేసే బహుకొద్దిమంది ప్రభుత్వ అధికారుల్లో ప్రభంజన్ కుమార్ యాదవ్ ఒకడు.

స్వభావ రీత్యా ప్రభంజన్ చాల సెన్సిటివ్. పేద ప్రజల పట్ల, ఉత్పత్తి కులాల పట్ల అభిమానం, ఆదరణ గల వ్యక్తి అనడానికి ఆయన రచనలే ప్రత్యక్ష సాక్ష్యం. జర్నలిస్టుగా ప్రభంజన్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను పుస్తకంగా తీసుకురావడం సంతోషం. నడుస్తున్న చరిత్రను సజీవంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభంజన్ ది. నిజాలను నిర్భయంగా రాసే సాహసం ఆయన కలానిది. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించడం ప్రభంజన్ మనస్తత్వం. రాగద్వేషాలకు అతీతంగా ఉండే ప్రయత్నం ఆయనది. ఏ రోటికాడి మాట ఆ రోటికాడ చెప్పడం చాతకానివాడు. నొప్పించక తానొవ్వక తప్పించుక తిరగటం తెలియనివాడు. నిష్టూరమైనా పరవాలేదని నిగ్గు తేల్చాలనుకునేవాడు. కష్టాలకు, నష్టాలకు వెరవడు. ఏటికి ఎదురీదడమే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభంజన్ ప్రజల పక్షపాతి. ఆయన రచనల్లో ప్రతిబింభించిన ఉత్పత్తి కులాల ఆవేదన, బీదల బాధలు అందుకు నిదర్శనం. ప్రజల ఆలోచనలకు, ఆవేదనలకు ప్రభంజన్ అక్షర నివేదనే ఈ వ్యాస సంకలనం.

‘ప్రభంజన పథం’
“గొల్లల సంస్కృతి-గొప్ప సంస్కృతి” అనే పరిశోధన వ్యాసంతో మొదలైంది ఈ పుస్తకం. ఈ సమాజానికి తన కులం ‘అయిదు రకాల పరిశ్రమలను, ఉత్పత్తులను అందించినందుకు ప్రతిఫలం అవమానమా?’ అని ప్రభంజన్ నిలదీసిండు. శ్రమను గౌరవించని దోపిడి సంస్కృతిని ఈసడించుకున్నడు. వెట్టిచాకిరి చేస్తున్న రజకుల కష్టాలు తీరాలన్నడు. గీత కార్మికులకు ఊతం యివ్వాలని, వెలవెల బోతున్న నేతగాళ్ల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఆశతో రాసిండు. మూలవాసుల విముక్తి బాటలో కలిసి పయనించిండు. దళిత గేయాలు రాసి పల్లవి కలిపిండు. దళిత రచయితల, కళాకారుల, మేధావుల (దరకమే) ఐక్యవేదికలో, నాస్తిక సంఘంలో పనిచేసిండు. రచనలు, ఉపన్యాసాలతోనే ఊర్కోలేదు. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నడు. జన చైతన్యం కోసం సంఘటిత ఉద్యమాల్లో భాగస్వామి అయిండు. ఆచరణే గీటురాయని నిరూపించిండు.

‘చూడు చూడు వాడలు నిర్లక్ష్యపు నీడలు’ అన్న వ్యాసంలో ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పట్టిండు. ‘జనజీవనాడి పాట’, ‘పరిగెత్తే కాలంతో పయనించలేక’, ‘బతుకు బాటలో ఒంటరి పయనం’, ‘బూటకపు ఎన్ కౌంటర్లలో బలహీన వర్గాలే బలి’, ‘కమ్యూనిస్టులకు కనువిప్పు కలిగే మేడే ఏనాడో!’, ‘కమ్యూనిస్టులకు కుల నిర్మూలన ఇప్పుడు గుర్తొచ్చిందా!’, ‘సామాన్యుడి ముంగిట ఇంకా వికసించని విద్యుత్తేజం’ అన్న వ్యాసాలతో అన్ని వర్గాల ప్రజల కోసం స్పందించిండు. కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యను గుర్తించినా సామాజిక అసమానతలను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణకు ఉపక్రమించలేదని ప్రశ్నించిండు. కమ్యూనిస్టులే ఐక్యం కానప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపివ్వడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసిండు.

ప్రభంజన్ వ్యంగ్య రచనలు కూడా చేసిండు. ‘లత్కోర్ కౌంటర్’, ‘భలే ఓట్లు…. బాయినెట్లు’, ‘రామోజీరావు గారు అందుకో ఈ లేఖ’, ‘నేనే రారాజు చూసేవాళ్లే బేజారు’ అన్న రచనల్లో సూటిగా చురకలంటించిండు. కథనం చాల సాఫీగా సాగిపోయింది.

ఈ రచనలతో పాటు ప్రభంజన్, యాదవ కులాన్ని సమీకరించిండు. సమాజంలో యాదవులు బాగా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. యాదవ కులంలో మేధావి వర్గం కూడా తక్కువే. అటువంటి యాదవ కులాన్ని సమీకరించడమే కాక, మేధావి వర్గాన్ని ఆర్జనైజ్ చేయాల్సిన అవసరముందని గుర్తించిండు. యాదవ మేధావుల ఫోరానికి వ్యవస్థాపక కన్వీనర్ గా పనిచేసిండు. నేను రాసిన “గొల్ల కురుమలు ఈ సమాజానికి ఏం చేసిండ్రు?”, “డోలు దెబ్బ” పాటల సంకలనాన్ని మేధావుల ఫోరం తరపున వెలువరించడంలో కన్వీనర్ గా కీలకపాత్ర పోషించిండు.

ప్రభంజన్ పాటలు కూడా రాసిండు. దొడ్డి కొమురన్న పాట చాల మంచి పాట. దొడ్డి కొమురయ్య జీవితాన్ని తిరిగి మనకు గుర్తు చేస్తుంది. ‘మంద కదిలింది రా జంబాయిరే’ అనే పాట కూడా యాదవ జీవన పోరాటాన్ని అద్దంలో చూపుతుంది.

ప్రభంజన్ వ్యాసాలు, పాటలు, కవితలు, కథలు కూడా రాసిండు. రచనలన్నీటిలోనూ సామాజిక స్పృహ, చైతన్యం కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనం లేని రచనలు చేయడమెందుకని ప్రశ్నిస్తాడు కూడా!

-ఆచార్య కంచె ఐలయ్య
(23/3/2004న రాసిన వ్యాసం)

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News