Sunday, July 26, 2026
28.1 C
Hyderabad

ప్రజా సమస్యలు పార్టీలకు పట్టవా!?

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దని ఏనాడో చెప్పాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరి కోసం ఎవరూ రాని ఈ రోజుల్లో ప్రజల కోసం వచ్చేవాళ్లు కూడా లేకుండా పోయారు. ప్రజలు కేంద్రంగా పని చేసే రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ప్రజలు, వారి సమస్యలు ఎజెండాగా కాకుండా, సొంత ఎజెండాలతో వారి వారి మనుగడ, ఉనికి కోసం మాత్రమే పని చేస్తున్నాయి. అన్ని జెండాలు వారి ఎజెండాలనే అమలు చేసుకుంటున్నాయి. ఇక సమస్య ఏదైనా మైలేజీ వస్తేనే పార్టీలు టేకప్ చేస్తున్నాయి. తప్పితే ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోవడం ఏనాడో మానేశాయి. దీంతో ప్రజా సమస్యలు దిక్కులేని, దిక్కుమాలిన అనాథలవుతున్నాయి. ఇప్పుడు దేశంలో సమస్య ఏదైనా ప్రజలే తమకు తాముగా ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలే ఎక్కడికక్కడ తమ సమస్యల పరిష్కారాలను తామే చూసుకోవాల్సి వస్తున్నది. ఆయా సమస్యలను ఎలుగెత్తి చాటాల్సిన ప్రథమ కర్తవ్యాన్ని ప్రజలు భుజాలకెత్తుకోవాలి.

పార్లమెంట్‌, అసెంబ్లీల్లో అధికార, విపక్షాలు సొంత ఎజెండాలతో నడుస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు, రాష్ట్రాల్లో పాలక, ప్రతిపక్షాలు కూడా సొంత ఎజెండాలనే అనుసరిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తప్పితే, ప్రజలతో పార్టీలకు సంబంధాలే లేకుండా పోయాయి. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన లేదు. ప్రజా వ్యతిరేక విధానాలపై అందరిదీ ఒకటే దారి. రాష్ట్రాల్లో నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై యుద్ధానికి దిగినా ప్రజలని ఆకర్శించలేకపోతున్నాయి. తమపై పెట్టిన ఇడి కేసులపై ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్‌, ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయడంలేదు. అందుకే కాంగ్రెస్ కు ఇలాంటి సమయంలో ప్రజా మద్దతు కరువవుతున్నది.

ఇక ప్రజా సమస్యలను ఉద్యమాలుగా మలచిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆ పంథాని ఏనాడో వీడాయి. అప్పటి నుంచే కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు దూరమవడం మొదలైంది. ఇప్పుడు ఆ ప్రాభవం కోసం పాకులాడుతున్న లెఫ్ట్ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు అప్పుడప్పుడు ఉద్యమిస్తున్నా, ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే లెఫ్ట్‌ పార్టీలు మనుపెన్నడూ లేనంతా బలహీనపడ్డాయి. ప్రజా మద్దతును కోల్పోయాయి. ఈ దశలో ఇక ఉమ్మడిగా పోరు చేయడానికి అన్ని పార్టీలను కలుపుకుని పోవడానికి సిద్దం కావాలి. కానీ, పార్టీలకు సొంత ఐడెంటిటీ, మైలేజీ సమస్యలుగా మారాయి. కలిసి పని చేస్తే క్రెడిట్ ఎవరు కొట్టేస్తారోననే భయం పట్టుకుంది. పశ్చిమ బెంగాల్ లో మమతపై ఒంటరి పోరాటం చేస్తున్న లెఫ్ట్‌ పార్టీలు కాంగ్రెస్‌తో కలవలేకపోతున్నాయి. కేరళలో అధికారం పంచుకోవడం వరకే తప్పితే, మిగతా ఎవరిదారి వారిదే. అయితే ప్రజా సమస్యలపై ఒంటరిగా లేదంటే కలిసికట్టుగా పోరాటాలు చేయాలని అన్ని పార్టీలు గుర్తించాలి. ఆయా పార్టీల్లో ఉన్న అనైక్యతను తమకు అనుకూలం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఆయా పార్టీలు, ఆ పార్టీల పాలిత రాష్ట్రాల్లో నేతల అవినీతిపై కూడా బీజేపీ కాచుకుని కూచుంది. ప్రజా సమస్యలపై పార్టీలు పోరాడితే, ప్రజల మద్దతు ఆ పార్టీలకు దక్కుతుంది.

ప్రధానంగా రైతాంగ, కార్మిక సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణం ప్రస్తుతం దేశంలో ఉంది. పెట్రోలు, గ్యాస్‌, నిత్యావసర ధరలు పెరిగాయి. ఉత్తరాది పది రాష్ట్రాల్లో రైతులు ఆందోళనకు దిగి కేంద్రానికి ముచ్చెమటలు పట్టించారు. గతంలో తమిళనాడు రైతులు కూడా ఢిల్లీ వేదికగా దిగ్విజయంగా ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. రైతు ఉద్యమాల కారణంగా సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నా, రైతు సంక్షేమానికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అత్యధిక ప్రజలు ఆధారపడిన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులను నమ్మించగలిగితే ఇది రైతు ఉద్యమాలకు సరైన సమయం. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ హావిూలు అటకెక్కాయి. దేశంలో 42 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అంటున్నారు. గత పదేళ్ల యూపిఎ హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలో రైతుల వద్ద భూములను వివిధ పరిశ్రమల అవసరాల కోసం బలవంతంగా లాక్కొంటున్న తీరును ఎండగట్టాల్సి ఉంది. మరోవైపు ప్రజాస్వామ్య హక్కులపై దాడి కొనసాగుతోంది. ప్రజలను కుల, మత ప్రాతిపదికన విభజిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిరుద్యోగిత పెరిగింది. ఉన్న ఉద్యోగాలు ఊడి పోతున్నాయి. విద్యా, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ బలంగా వేళ్ళూనుకుంది. ప్రభుత్వంలో కార్పొరేట్‌ శక్తుల ప్రభావం పెరుగుతున్నది. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంలో పస లేకుండా పోయింది. ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయి. మొత్తంగా దేశంలో ప్రజలంతా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ప్రజలు గుర్తించారు. ఆ సమస్యలను గర్తించి, ఉద్యమించడంలోనే పార్టీలు విఫలం అవుతున్నాయి.

ఇక అంతర్జాతీయంగా ట్రంప్‌ సుంకాలు, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వృద్ధిరేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు పెరిగి, కొనుగోలు శక్తి తగ్గి, నిరుద్యోగిత మరింత తీవ్రం అయ్యే సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి ప్రజలు ఎదుర్కోవాల్సిన సమీప భవిష్యత్తు సమస్యలు. వీటన్నింటినీ పార్టీలు అడ్రస్ చేయాల్సి ఉంది. లేకపోతే ఆ పార్టీల అడ్రసే గల్లంతు కావచ్చు.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News