Saturday, May 9, 2026
24.7 C
Hyderabad

ప్రజా సమస్యలు పార్టీలకు పట్టవా!?

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దని ఏనాడో చెప్పాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరి కోసం ఎవరూ రాని ఈ రోజుల్లో ప్రజల కోసం వచ్చేవాళ్లు కూడా లేకుండా పోయారు. ప్రజలు కేంద్రంగా పని చేసే రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ప్రజలు, వారి సమస్యలు ఎజెండాగా కాకుండా, సొంత ఎజెండాలతో వారి వారి మనుగడ, ఉనికి కోసం మాత్రమే పని చేస్తున్నాయి. అన్ని జెండాలు వారి ఎజెండాలనే అమలు చేసుకుంటున్నాయి. ఇక సమస్య ఏదైనా మైలేజీ వస్తేనే పార్టీలు టేకప్ చేస్తున్నాయి. తప్పితే ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోవడం ఏనాడో మానేశాయి. దీంతో ప్రజా సమస్యలు దిక్కులేని, దిక్కుమాలిన అనాథలవుతున్నాయి. ఇప్పుడు దేశంలో సమస్య ఏదైనా ప్రజలే తమకు తాముగా ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలే ఎక్కడికక్కడ తమ సమస్యల పరిష్కారాలను తామే చూసుకోవాల్సి వస్తున్నది. ఆయా సమస్యలను ఎలుగెత్తి చాటాల్సిన ప్రథమ కర్తవ్యాన్ని ప్రజలు భుజాలకెత్తుకోవాలి.

పార్లమెంట్‌, అసెంబ్లీల్లో అధికార, విపక్షాలు సొంత ఎజెండాలతో నడుస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు, రాష్ట్రాల్లో పాలక, ప్రతిపక్షాలు కూడా సొంత ఎజెండాలనే అనుసరిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తప్పితే, ప్రజలతో పార్టీలకు సంబంధాలే లేకుండా పోయాయి. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన లేదు. ప్రజా వ్యతిరేక విధానాలపై అందరిదీ ఒకటే దారి. రాష్ట్రాల్లో నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై యుద్ధానికి దిగినా ప్రజలని ఆకర్శించలేకపోతున్నాయి. తమపై పెట్టిన ఇడి కేసులపై ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్‌, ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయడంలేదు. అందుకే కాంగ్రెస్ కు ఇలాంటి సమయంలో ప్రజా మద్దతు కరువవుతున్నది.

ఇక ప్రజా సమస్యలను ఉద్యమాలుగా మలచిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆ పంథాని ఏనాడో వీడాయి. అప్పటి నుంచే కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు దూరమవడం మొదలైంది. ఇప్పుడు ఆ ప్రాభవం కోసం పాకులాడుతున్న లెఫ్ట్ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు అప్పుడప్పుడు ఉద్యమిస్తున్నా, ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే లెఫ్ట్‌ పార్టీలు మనుపెన్నడూ లేనంతా బలహీనపడ్డాయి. ప్రజా మద్దతును కోల్పోయాయి. ఈ దశలో ఇక ఉమ్మడిగా పోరు చేయడానికి అన్ని పార్టీలను కలుపుకుని పోవడానికి సిద్దం కావాలి. కానీ, పార్టీలకు సొంత ఐడెంటిటీ, మైలేజీ సమస్యలుగా మారాయి. కలిసి పని చేస్తే క్రెడిట్ ఎవరు కొట్టేస్తారోననే భయం పట్టుకుంది. పశ్చిమ బెంగాల్ లో మమతపై ఒంటరి పోరాటం చేస్తున్న లెఫ్ట్‌ పార్టీలు కాంగ్రెస్‌తో కలవలేకపోతున్నాయి. కేరళలో అధికారం పంచుకోవడం వరకే తప్పితే, మిగతా ఎవరిదారి వారిదే. అయితే ప్రజా సమస్యలపై ఒంటరిగా లేదంటే కలిసికట్టుగా పోరాటాలు చేయాలని అన్ని పార్టీలు గుర్తించాలి. ఆయా పార్టీల్లో ఉన్న అనైక్యతను తమకు అనుకూలం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఆయా పార్టీలు, ఆ పార్టీల పాలిత రాష్ట్రాల్లో నేతల అవినీతిపై కూడా బీజేపీ కాచుకుని కూచుంది. ప్రజా సమస్యలపై పార్టీలు పోరాడితే, ప్రజల మద్దతు ఆ పార్టీలకు దక్కుతుంది.

ప్రధానంగా రైతాంగ, కార్మిక సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణం ప్రస్తుతం దేశంలో ఉంది. పెట్రోలు, గ్యాస్‌, నిత్యావసర ధరలు పెరిగాయి. ఉత్తరాది పది రాష్ట్రాల్లో రైతులు ఆందోళనకు దిగి కేంద్రానికి ముచ్చెమటలు పట్టించారు. గతంలో తమిళనాడు రైతులు కూడా ఢిల్లీ వేదికగా దిగ్విజయంగా ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. రైతు ఉద్యమాల కారణంగా సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నా, రైతు సంక్షేమానికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అత్యధిక ప్రజలు ఆధారపడిన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులను నమ్మించగలిగితే ఇది రైతు ఉద్యమాలకు సరైన సమయం. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోడీ హావిూలు అటకెక్కాయి. దేశంలో 42 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అంటున్నారు. గత పదేళ్ల యూపిఎ హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలో రైతుల వద్ద భూములను వివిధ పరిశ్రమల అవసరాల కోసం బలవంతంగా లాక్కొంటున్న తీరును ఎండగట్టాల్సి ఉంది. మరోవైపు ప్రజాస్వామ్య హక్కులపై దాడి కొనసాగుతోంది. ప్రజలను కుల, మత ప్రాతిపదికన విభజిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిరుద్యోగిత పెరిగింది. ఉన్న ఉద్యోగాలు ఊడి పోతున్నాయి. విద్యా, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ బలంగా వేళ్ళూనుకుంది. ప్రభుత్వంలో కార్పొరేట్‌ శక్తుల ప్రభావం పెరుగుతున్నది. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంలో పస లేకుండా పోయింది. ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయి. మొత్తంగా దేశంలో ప్రజలంతా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ప్రజలు గుర్తించారు. ఆ సమస్యలను గర్తించి, ఉద్యమించడంలోనే పార్టీలు విఫలం అవుతున్నాయి.

ఇక అంతర్జాతీయంగా ట్రంప్‌ సుంకాలు, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వృద్ధిరేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు పెరిగి, కొనుగోలు శక్తి తగ్గి, నిరుద్యోగిత మరింత తీవ్రం అయ్యే సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి ప్రజలు ఎదుర్కోవాల్సిన సమీప భవిష్యత్తు సమస్యలు. వీటన్నింటినీ పార్టీలు అడ్రస్ చేయాల్సి ఉంది. లేకపోతే ఆ పార్టీల అడ్రసే గల్లంతు కావచ్చు.

Latest News

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

07-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 06.31 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం సాధ్య రాత్రి 10.59 వరకు ఉపరి శుభ కరణం తైతుల ఉదయం 06.31...

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News