Monday, July 27, 2026
26.4 C
Hyderabad

సం‘క్షోభ’ ‘సాగు’ సవాళ్లు !

వ్యవసాయాభివృద్ధికి ఎంత చేసినా తక్కువే. అన్నం పెట్టే రైతన్నలను కాపాడుకుంటేనే మన నోట్లోకి ముద్దపోతుంది. కార్పొరేట్ కంపెనీలను మించి వారికి రాయితీలు ఇవ్వడం కూడా మంచిదే. వ్యవసాయికంగా దేశాన్ని బలోపేతం చేస్తే..అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తే దేశంలో ఆకలి చావులు ఉండవు. తక్కువ ధరలకు పంటలను ప్రజలకు అందించేలా కూడా కార్యాచరణ ఉండాలి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రాలు కలిసి వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి బృహత్‌ ప్రణాళికలు రచించాలి. వ్యవసాయానికి తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. సబ్సిడీలు అందిస్తున్నారు. ధాన్యం సజావుగానే కొంటున్నామని అంటున్నారు. పాలకులు, ప్రతిపక్ష నేతలు రైతు జపం చేస్తున్నప్పటికీ వారి జీవితాలు మాత్రం బాగుపడడం లేదు. నిరంతర, నిరంతరాయ ఉచిత విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందించాలి. నిజానికి ఇదొక్కటే సరిపోదు. ముందుగా నదుల అనుసంధానం చేసైనా సరే, నీటి సదుపాయం కల్పించాలి. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలి. పండించిన పంటలకు లాభదాయక ధరలను ప్రకటించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. వ్యవసాయాన్ని దండుగ కాకుండా పండుగ చేయాలి. పంటలకు గిట్టుబాటు లేకుండా ఎన్ని సబ్సిడీలు, సదుపాయలు కల్పించినా లాభం లేదు. ఇక ఉచిత విద్యుత్‌ సరఫరాకు తగ్గట్లుగా ఉత్పత్తి కూడా ముఖ్యమే. దేశంలో సరిపడా విద్యుత్‌ ఉందా? లేదా? అన్న ఆలోచన చేయాలి. ఉత్పత్తి అవకాశాలు పెంచుకోవాలి. సోలార్‌ విద్యుత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే విద్యుత్‌ సమృద్ధిగా లభ్యత కాగలదు. అనేక గ్రామాలకు, ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా లేదు. అలాంటప్పుడు పంపిణీతో పాటు, లభ్యత కూడా సవాల్‌ కానుంది. ముందుగా దేశంలో నిరంతర విద్యుత్‌ ఉత్పత్తి కోసం కృషి జరగాలి. ఉన్న విద్యుత్‌ను ఇప్పుడు సరఫరా చేయడానికే సరిపోదు.
ఇక రైతుల ఆత్మహత్యలపై నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పైగా అలాంటి చావులను సహజ మరణాలుగా చిత్రీకరించే దుస్సాహసం ప్రభుత్వాలు చేస్తున్నాయి. అధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగం పట్ల, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్‌ నియంత్రణ బిల్లుకు నడుం బిగించిన కేంద్రం రాష్టాల్రపై ఒత్తిడి తెస్తోందన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్‌ నియంత్రణ అంతా ఇక కేంద్రం చేతిలోకి వెళితే రాష్ట్రాలపై విద్యుత్‌ పెను భారం తడిసి మోపెడు కానుంది. వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అగ్రి బేస్‌డ్‌, ప్రాసెసింగ్‌ పై దృష్టి పెట్టామని, వంటనూనె గింజల ఉత్పత్తిపైన ప్రధాని మోడీ గతంలో చేసిన ప్రకటన ఎలాంటి పురోగతి సాధించలేదు. నిజంగా ఏడున్నరేళ్లుగా ఈ రంగంలో మార్పులు ఉంటే నిత్యావసర ధరలు దిగి రావాలి. కానీ అలాంటి దేవిూ జరగడంలేదు. నిజానికి రైతులు ఉద్యమించడం వల్ల.. మోడీ సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు సాగక రైతులు ఆందోళనకు గురవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. ఇంతకన్నా నిర్లక్ష్యం మరోటి ఉండదు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతులు కాడి దించితే మన కడుపులు ఖాళీగా ఉండాల్సిందేనని గుర్తించాలి. ఈ కార్పోరేట్ల ఉత్పత్తులు మన ఆకలి తీర్చవని తెలుసుకోవాలి. రైతులకు సంబంధించి ప్రభుత్వాలు తీసుకుంటున్న కంటి తుడుపు చర్యలు కనీస ఫలితాలు ఇవ్వడం లేదు.
ఇలాంటి సందర్భంలో రైతులకు మేలు చేయాలనుకుంటే సాగు చట్టాలపై విస్తృతంగా దేశవ్యాప్తంగా కాకున్నా కనీసం పార్లమెంటులో చర్చ సాగేది. దేశంలో నూనె గింజల ఉత్పత్తి పెరిగితే నూనె ధరల పెరుగుదల జరిగేది కాదు. అందుకే వ్యవసాయ రంగం పురోగమించడానికి తీసుకుంటున్న చర్యలు మాత్రం గొప్పగా లేవనే చెప్పాలి. ప్రధానంగా దిగుబడులు తీవ్రంగా దెబ్బతీస్తున్నా.. వాటిని నిరోధించి, దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో కేంద్రం విఫలం అవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గిట్టుబాటు ధరలు కల్పించడం వంటివన్నీ మాటలకే పరిమితం అయ్యాయి. దేశంలో వ్యవసాయరంగం అత్యంత దయనీయంగా, సంక్షోభంలో కూరుకు పోయి ఉన్న సమయంలో ఈ భారీ దిగుమతులు జరగడం గమనార్హం. ఇంత భారీ మొత్తం దిగుమతుల కోసం ఖర్చు చేయకుండా, భారతీయ రైతారగంపై ఖర్చు చేసి ఉంటే పరిస్థితి ఎంతోకొంత మెరుగుపడి ఉండేది. అన్ని ప్రభుత్వాలూ రైతులను ఆదుకోవడం గురించీ, వ్యవసాయాభివృద్ధి గురించీ గొప్ప ఉపన్యాసాలు, హావిూలు ఇవ్వడంతోనే సరిపెడు తున్నాయనే విషయం వాస్తవ పరిస్థితులను గమనించినప్పుడు అర్థం అవుతుంది.
కేవలం ఒక్క సంవత్స రంలోనే దేశీయ వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్‌కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఆహార ధాన్యాలను మనం దిగుమతి చేసుకున్నామంటే, మన నేతలు ఆ రంగం పట్ల ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతుంది. హరిత విప్లవం నుంచి లబ్ధిపొంది, ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించిన దేశం ఇప్పుడు ఆ ఫలాలను నిర్లక్ష్యంగా జారవిడుచుకుంటూ, ఆహార ధాన్యాల దిగుమతిదారు అవుతోంది. పసుపు విప్లవాన్ని కావాలని ధ్వంసం చేసిన కారణంగా ఏర్పడిన ఫలితాల నుంచి మనం ఎలాంటి పాఠాలనూ నేర్చుకోలేదు. వంట నూనెల విషయంలో స్వయం సమృద్ధి సాధించిన మనం దశలవారీగా దిగుమతి సుంకాన్ని దాదాపుగా సున్నాకు దించిన నేపథ్యంలో మార్కెట్లోకి దిగుమతి ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. వంట నూనెలు 60 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు దిగుమతులు అవసరమన్న వాదనను అడ్డం పెట్టుకొని, విధానకర్తలు చౌకైన, సబ్సిడీ ఇచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతిస్తున్నారు. దేశంలో విస్తారంగా దిగుబడులు వచ్చినప్పటికీ, దిగుమతులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దిగుమతులు ఎంత ఎక్కువగా వచ్చి పడితే, అంతగా సన్నకారు రైతుల జీవనోపాధిపై వేటు పడుతుంది. తమ ఉత్పత్తిని అమ్ముకోలేక, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలి, చిన్నచిన్న ఉద్యోగాల కోసం పట్టణ ప్రాంతాలకు వలుస పోతున్నారు. దేశంలో ఉపాధి సృష్టి జరుగని పరిస్థితిలో, సన్నకారు రైతులను పట్టణాలకు వెళ్ళే పరిస్థితులు సృష్టించడమన్నది ఆర్ధికంగా అర్థరహిత విషయం.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News