Sunday, July 26, 2026
30.8 C
Hyderabad

మారణకాండకు మంగళం.. జనజీవన స్రవంతిలోకి ‘అడవి బిడ్డలు’!|MAOIST|CM|REVANTH REDDY

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల చారిత్రాత్మక లొంగుబాటు 

124 అత్యాధునిక ఆయుధాల అప్పగింత

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాట చరిత్రలో నేడు ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మి, ఏకంగా 130 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ భారీ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కేడర్, అదీ అత్యాధునిక ఆయుధాలతో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కుప్పలుతెప్పలుగా మారిన మారణాయుధాలు
లొంగిపోయిన మావోయిస్టులు తాము ఇన్నాళ్లూ అడవిలో వెంటబెట్టుకున్న 124 అత్యాధునిక తుపాకులను పోలీసులకు అప్పగించారు. వీటిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయుధాల స్థాయిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

స్వాధీనం చేసుకున్న ఆయుధాల జాబితా ఇలా ఉంది:

  • 31 AK-47 రైఫిళ్లు

  • 21 INSAS రైఫిళ్లు

  • 20 SLR రైఫిళ్లు

  • 1 INSAS LMG (లైట్ మెషిన్ గన్)

  • 18 .303 రైఫిళ్లు

  • 33 ఇతర రకాల తుపాకులు

తుడిచిపెట్టుకుపోయిన ‘తెలంగాణ రాష్ట్ర కమిటీ’

ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లొంగిపోయిన 130 మందిలో అగ్రశ్రేణి నాయకులు ఉండటం గమనార్హం.

  • రాష్ట్ర కమిటీ సభ్యులు: 03 మంది

  • రీజినల్ కమిటీ సభ్యుడు: 01 

  • డివిజనల్ కమిటీ సభ్యులు: 10 మంది

  • ఏరియా కమిటీ సభ్యులు: 46 మంది

  • పార్టీ సభ్యులు: 70 మంది

ఇటీవల కేంద్ర కమిటీ సభ్యులు దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి), దామోదర్, రాజిరెడ్డి వంటి దిగ్గజాలు లొంగిపోవడంతో, వారి అడుగుజాడల్లోనే మిగిలిన కేడర్ కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన ప్రకారం, ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ అనేది నామమాత్రంగా కూడా ఉనికిలో లేదు.

బుల్లెట్ వద్దు.. బ్యాలెట్ ముద్దు: ముఖ్యమంత్రి పిలుపు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. “శాంతియుత మార్గాల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని మన దేశం బలంగా నమ్ముతుంది. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. యుద్ధాలు చేస్తున్న దేశాలు కూడా చివరికి చర్చలకే మొగ్గు చూపుతున్నాయి. అడవిలో ఉన్న వారు కూడా హింసను వీడి ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని ఆయన కోరారు.

ప్రభుత్వం తరపున వరాల జల్లు:

లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని సీఎం స్పష్టం చేశారు.

  • ఇందిరమ్మ ఇళ్లు: లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ నివసించడానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు.

  • మెరుగైన వైద్యం: అడవిలో అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తారు.

  • ఆర్ధిక ప్యాకేజీ: ప్రస్తుతం ఉన్న పునరావాస ప్యాకేజీని మరింత పెంచి, వారు గౌరవప్రదంగా బతికేలా ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తాం.

  • కేసుల ఎత్తివేత: చట్టపరంగా అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గణపతికి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్

ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మాజీ చీఫ్ గణపతితో పాటు ఇతర కేంద్ర కమిటీ సభ్యులకు రేవంత్ రెడ్డి బహిరంగ పిలుపునిచ్చారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను.. మీరు బయటకు రండి, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఇటీవల అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా మావోయిస్టుల పునరావాసంపై చర్చించాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి

2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోవడం రేవంత్ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. “హింస ద్వారా ఏదీ సాధించలేం. అభివృద్ధి మార్గంలో పయనించి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలి” అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News