Friday, March 13, 2026
34.6 C
Hyderabad

మారణకాండకు మంగళం.. జనజీవన స్రవంతిలోకి ‘అడవి బిడ్డలు’!|MAOIST|CM|REVANTH REDDY

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల చారిత్రాత్మక లొంగుబాటు 

124 అత్యాధునిక ఆయుధాల అప్పగింత

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాట చరిత్రలో నేడు ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మి, ఏకంగా 130 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ భారీ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కేడర్, అదీ అత్యాధునిక ఆయుధాలతో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కుప్పలుతెప్పలుగా మారిన మారణాయుధాలు
లొంగిపోయిన మావోయిస్టులు తాము ఇన్నాళ్లూ అడవిలో వెంటబెట్టుకున్న 124 అత్యాధునిక తుపాకులను పోలీసులకు అప్పగించారు. వీటిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయుధాల స్థాయిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

స్వాధీనం చేసుకున్న ఆయుధాల జాబితా ఇలా ఉంది:

  • 31 AK-47 రైఫిళ్లు

  • 21 INSAS రైఫిళ్లు

  • 20 SLR రైఫిళ్లు

  • 1 INSAS LMG (లైట్ మెషిన్ గన్)

  • 18 .303 రైఫిళ్లు

  • 33 ఇతర రకాల తుపాకులు

తుడిచిపెట్టుకుపోయిన ‘తెలంగాణ రాష్ట్ర కమిటీ’

ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లొంగిపోయిన 130 మందిలో అగ్రశ్రేణి నాయకులు ఉండటం గమనార్హం.

  • రాష్ట్ర కమిటీ సభ్యులు: 03 మంది

  • రీజినల్ కమిటీ సభ్యుడు: 01 

  • డివిజనల్ కమిటీ సభ్యులు: 10 మంది

  • ఏరియా కమిటీ సభ్యులు: 46 మంది

  • పార్టీ సభ్యులు: 70 మంది

ఇటీవల కేంద్ర కమిటీ సభ్యులు దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి), దామోదర్, రాజిరెడ్డి వంటి దిగ్గజాలు లొంగిపోవడంతో, వారి అడుగుజాడల్లోనే మిగిలిన కేడర్ కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన ప్రకారం, ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ అనేది నామమాత్రంగా కూడా ఉనికిలో లేదు.

బుల్లెట్ వద్దు.. బ్యాలెట్ ముద్దు: ముఖ్యమంత్రి పిలుపు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. “శాంతియుత మార్గాల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని మన దేశం బలంగా నమ్ముతుంది. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. యుద్ధాలు చేస్తున్న దేశాలు కూడా చివరికి చర్చలకే మొగ్గు చూపుతున్నాయి. అడవిలో ఉన్న వారు కూడా హింసను వీడి ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని ఆయన కోరారు.

ప్రభుత్వం తరపున వరాల జల్లు:

లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని సీఎం స్పష్టం చేశారు.

  • ఇందిరమ్మ ఇళ్లు: లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ నివసించడానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు.

  • మెరుగైన వైద్యం: అడవిలో అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తారు.

  • ఆర్ధిక ప్యాకేజీ: ప్రస్తుతం ఉన్న పునరావాస ప్యాకేజీని మరింత పెంచి, వారు గౌరవప్రదంగా బతికేలా ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తాం.

  • కేసుల ఎత్తివేత: చట్టపరంగా అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గణపతికి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్

ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మాజీ చీఫ్ గణపతితో పాటు ఇతర కేంద్ర కమిటీ సభ్యులకు రేవంత్ రెడ్డి బహిరంగ పిలుపునిచ్చారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను.. మీరు బయటకు రండి, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఇటీవల అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా మావోయిస్టుల పునరావాసంపై చర్చించాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి

2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోవడం రేవంత్ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. “హింస ద్వారా ఏదీ సాధించలేం. అభివృద్ధి మార్గంలో పయనించి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలి” అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News