Friday, April 10, 2026
36.2 C
Hyderabad

ప్రపంచానికి పెను సవాల్ గా అమెరికా సామ్రాజ్యవాదం!|EDITORIAL

‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటీష్‌ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది.

అమెరికా ఇతర దేశాల మీద దాడులు చేస్తే, అందుకు కారణాలు ఉంటాయి. అదే ఇతర దేశాలు ఏ దేశం మీద దాడి చేసినా అందుకు కారణాలుండ కూడదన్నది అమెరికా సిద్ధాంతంగా మారింది. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక టెంపరితనం, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష విపరీతంగా పెరిగింది. తన కనుసన్నల్లోనే దేశాలన్నీ నడవాలన్న నిరంకుశత్వం కనిపిస్తోంది. ట్రంప్ రెండు రకాలుగా ప్రపంచాన్ని గిప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒకటి టారిఫ్ ల బాదుడు. రెండు సైనిక దాడులు. చైనా,భారత్‌ వంటి దేశాలపైనా పన్నులతో విరుచుకుపడుతున్నారు. కాని పక్షంలో ‘బడిత ఉన్నోడిదే బర్రె’ అనే సామెతలా వెనెజువెలా లాంటి దేశాలపై సైనిక దాడికి దిగుతున్నాడు. ఇప్పటికే ఇరాన్‌, ఖతార్‌, సిరియాలపై విరుచుకుపడి బాంబులు వేశారు. ఇప్పుడు వెనెజువెలాను తామే పాలిస్తామని చెబుతున్నాడు.

ప్రపంచంలో సైనిక శక్తి ఉంటే ఏ దేశం మీదైనా దాడి చేయవచ్చా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అలా అయితే మన దేశం నుంచి విడిపోయిన పాక్‌, బంగ్లా దేశ్‌లపై మనం కూడా దాడి చేసి భారత్‌లో కలిపేసుకుని, అఖండ భారత్‌ కలను సాకారం చేసుకోవచ్చా? భారత్‌లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్‌కు బుద్థి చెప్పేందుకు దాడి చేస్తే అడ్డుకోవాలని ట్రంప్‌ చూశారు. తానే పాక్‌, భారత్‌ యుద్దాన్ని ఆపానని అంటాడు. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్దం వద్దని మధ్యవర్తిత్వం వహిస్తాడు. తానే అనేక యుద్ధాలను ఆపానని ప్రగల్బాలు పలుకుతాడు. వెనెజువెలాపై దాడి చేస్తాడు. అధ్యక్షుడిని, అతడి సతీమణిని అపహరిస్తాడు. ఇలా ట్రంప్‌ తన తల తిక్కి అహంకారంతో వ్యవహరి స్తున్నాడు. నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టింది. తాను వెనెజువెలా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు. తదుపరి ఏం జరుగుతుందో తెలియని అయోమయం. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్‌ ఆమెను కూడా బెదిరించాడు.

అయితే వెనెజువెలాలోని చమురు నిక్షేపాలను ఆక్రమించుకోవడం అమెరికా ఎత్తుగడగా ఉంది. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. దాని జోక్యం మరింత అవసరం. రెండో ప్రపంచ యుద్దానికి ముందు జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ కూడా యూదుల మారణకాండకు పాల్పడ్డాడు. నరమేధం సృష్టించాడు. గ్యాస్‌ ఛాంబర్‌లు పెట్టి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. అనేక దేశాలను ఆక్రమించుకుంటూ పోయినా ప్రజాస్వామిక ముసుగు వేసుకున్న దేశాలేవీ అడ్డుకోలేదు. అప్పట్లో అమెరికా ఆయుధాలు కూడా అందించింది. అయితే రష్యా అధినేత స్టాలిన్‌ నాయకత్వంలో ప్రతిఘటించిన తరవాతనే హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.

ఇండియాలో కూడా బ్రిటిషర్లు ఇలాగే వ్యవహరించారు. అంతకు ముందు మొగలులు కూడా దాడులు చేసి హిందూ ఆలయాలను ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశారు. మత మార్పిళ్లు చేశారు. తెలంగాణలో నిజాం నిరంకుశ రజాకార్లు కూడా ప్రజలను ఊచకోత కోశారు. కాశ్మీర్‌లో మారణహోమం చూశాం. మతమార్పిళ్లు చూశాం. ఊచకోతలు చూశాం. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ మారంది. ఆధునిక ప్రపంచంలో ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడిని, ఇప్పుడు వెనిజువెలాపై అమెరికా దాడిని చూస్తున్నాం. ఇది తమ దారికి రాని వారికి ఏ గతి పడుతుందో తెలిపే ఆరంభం మాత్రమే అని, మదురో అపహరణ తరువాత ట్రంప్‌ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని దాడులు చూడాల్సి వస్తుందో? ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో అన్నది ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఉన్న అమెరికన్‌ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరనేదే కాలమే చెప్పాలి.

తమ తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్‌ చెప్పాడు. ట్రంప్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షను వెనెజువెలా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్‌ స్వయంపాలిత గ్రీన్‌లాండ్‌ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. అది కూడా త్వరలోనే స్వాధీనం చేసుకునేదాకా వదిలేట్టుగా లేడు. కెనడాను కూడా ఇలాగే బెదిరించాడు. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటిష్‌ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News