Sunday, July 26, 2026
29.1 C
Hyderabad

ప్రపంచానికి పెను సవాల్ గా అమెరికా సామ్రాజ్యవాదం!|EDITORIAL

‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటీష్‌ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది.

అమెరికా ఇతర దేశాల మీద దాడులు చేస్తే, అందుకు కారణాలు ఉంటాయి. అదే ఇతర దేశాలు ఏ దేశం మీద దాడి చేసినా అందుకు కారణాలుండ కూడదన్నది అమెరికా సిద్ధాంతంగా మారింది. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక టెంపరితనం, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష విపరీతంగా పెరిగింది. తన కనుసన్నల్లోనే దేశాలన్నీ నడవాలన్న నిరంకుశత్వం కనిపిస్తోంది. ట్రంప్ రెండు రకాలుగా ప్రపంచాన్ని గిప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒకటి టారిఫ్ ల బాదుడు. రెండు సైనిక దాడులు. చైనా,భారత్‌ వంటి దేశాలపైనా పన్నులతో విరుచుకుపడుతున్నారు. కాని పక్షంలో ‘బడిత ఉన్నోడిదే బర్రె’ అనే సామెతలా వెనెజువెలా లాంటి దేశాలపై సైనిక దాడికి దిగుతున్నాడు. ఇప్పటికే ఇరాన్‌, ఖతార్‌, సిరియాలపై విరుచుకుపడి బాంబులు వేశారు. ఇప్పుడు వెనెజువెలాను తామే పాలిస్తామని చెబుతున్నాడు.

ప్రపంచంలో సైనిక శక్తి ఉంటే ఏ దేశం మీదైనా దాడి చేయవచ్చా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అలా అయితే మన దేశం నుంచి విడిపోయిన పాక్‌, బంగ్లా దేశ్‌లపై మనం కూడా దాడి చేసి భారత్‌లో కలిపేసుకుని, అఖండ భారత్‌ కలను సాకారం చేసుకోవచ్చా? భారత్‌లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్‌కు బుద్థి చెప్పేందుకు దాడి చేస్తే అడ్డుకోవాలని ట్రంప్‌ చూశారు. తానే పాక్‌, భారత్‌ యుద్దాన్ని ఆపానని అంటాడు. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్దం వద్దని మధ్యవర్తిత్వం వహిస్తాడు. తానే అనేక యుద్ధాలను ఆపానని ప్రగల్బాలు పలుకుతాడు. వెనెజువెలాపై దాడి చేస్తాడు. అధ్యక్షుడిని, అతడి సతీమణిని అపహరిస్తాడు. ఇలా ట్రంప్‌ తన తల తిక్కి అహంకారంతో వ్యవహరి స్తున్నాడు. నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టింది. తాను వెనెజువెలా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు. తదుపరి ఏం జరుగుతుందో తెలియని అయోమయం. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్‌ ఆమెను కూడా బెదిరించాడు.

అయితే వెనెజువెలాలోని చమురు నిక్షేపాలను ఆక్రమించుకోవడం అమెరికా ఎత్తుగడగా ఉంది. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. దాని జోక్యం మరింత అవసరం. రెండో ప్రపంచ యుద్దానికి ముందు జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ కూడా యూదుల మారణకాండకు పాల్పడ్డాడు. నరమేధం సృష్టించాడు. గ్యాస్‌ ఛాంబర్‌లు పెట్టి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. అనేక దేశాలను ఆక్రమించుకుంటూ పోయినా ప్రజాస్వామిక ముసుగు వేసుకున్న దేశాలేవీ అడ్డుకోలేదు. అప్పట్లో అమెరికా ఆయుధాలు కూడా అందించింది. అయితే రష్యా అధినేత స్టాలిన్‌ నాయకత్వంలో ప్రతిఘటించిన తరవాతనే హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.

ఇండియాలో కూడా బ్రిటిషర్లు ఇలాగే వ్యవహరించారు. అంతకు ముందు మొగలులు కూడా దాడులు చేసి హిందూ ఆలయాలను ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశారు. మత మార్పిళ్లు చేశారు. తెలంగాణలో నిజాం నిరంకుశ రజాకార్లు కూడా ప్రజలను ఊచకోత కోశారు. కాశ్మీర్‌లో మారణహోమం చూశాం. మతమార్పిళ్లు చూశాం. ఊచకోతలు చూశాం. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ మారంది. ఆధునిక ప్రపంచంలో ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడిని, ఇప్పుడు వెనిజువెలాపై అమెరికా దాడిని చూస్తున్నాం. ఇది తమ దారికి రాని వారికి ఏ గతి పడుతుందో తెలిపే ఆరంభం మాత్రమే అని, మదురో అపహరణ తరువాత ట్రంప్‌ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని దాడులు చూడాల్సి వస్తుందో? ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో అన్నది ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఉన్న అమెరికన్‌ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరనేదే కాలమే చెప్పాలి.

తమ తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్‌ చెప్పాడు. ట్రంప్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షను వెనెజువెలా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్‌ స్వయంపాలిత గ్రీన్‌లాండ్‌ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. అది కూడా త్వరలోనే స్వాధీనం చేసుకునేదాకా వదిలేట్టుగా లేడు. కెనడాను కూడా ఇలాగే బెదిరించాడు. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటిష్‌ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News