Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

మానవత్వమా నీ అడ్రసెక్కడ?|EDITORIAL

ఒక రోజు తేడాలో తెలంగాణలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు మొత్తం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నివ్వెరనొములా చేస్తున్నాయి. నిర్ఘాంతపరుస్తున్నాయి. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ళ బాలిక ధరిత్రిపై అదే స్కూల్ ఆయా లక్ష్మమ్మ దాడి చేసిన తీరు గగుర్పొడిచేలా ఉంది. కింద పడేసి, నేలకేసి బాది, కాలితో తొక్కి, గొంతు పిసికి, చెంపలపై కొట్టి, కొడుతూ, తిడుతూ చేసిన దాడి ఆమెలోని హింసా ప్రవృత్తికి పరాకాష్టగా నిలిచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై నర్సింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు చేసిన యాసిడ్ దాడి ఘటన మానవత్వంపై దాడిగా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో మౌనం వీడాలి. ప్రతి ఒక్క పౌరుడి నుండి పౌర సమాజం మొత్తం సమస్యను కేవలం పోలీస్‌, ప్రభుత్వాలపై నెట్టడం సరికాదు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మహిళలను గౌరవించాలి, రక్షించాలి, సమాన హక్కులతో కలిసి నడిచే సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని అందించాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

ఒక రోజు తేడాలో తెలంగాణలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు మొత్తం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నివ్వెరనొములా చేస్తున్నాయి. నిర్ఘాంతపరుస్తున్నాయి. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ళ బాలిక ధరిత్రిపై అదే స్కూల్ ఆయా లక్ష్మమ్మ దాడి చేసిన తీరు గగుర్పొడిచేలా ఉంది. కింద పడేసి, నేలకేసి బాది, కాలితో తొక్కి, గొంతు పిసికి, చెంపలపై కొట్టి, కొడుతూ, తిడుతూ చేసిన దాడి ఆమెలోని హింసా ప్రవృత్తికి పరాకాష్టగా నిలిచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై నర్సింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు చేసిన యాసిడ్ దాడి ఘటన మానవత్వంపై దాడిగా మిగిలిపోయింది.

ఈ రెండు ఘోర సంఘటనలు మనం ఏ దిశగా సాగుతున్నామని సమాజాన్నే కాక ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రశ్నిస్తునాయి. నిలదీస్తున్నాయి. మట్టిలో కలుస్తున్న మానవత్వానికి భయానక సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఈ దారుణాలు కేవలం నేరాలు మాత్రమే కాదు. మన సమాజంలో క్షీణిస్తున్న విలువలు, పెరుగిపోతున్న హింసాత్మక ధోరణులు, చిన్న చిన్న విభేదాలకే భయంకరమైన దాడులకు పాల్పడే దౌర్భాగ్యాన్ని, బాధితులను రక్షించడంలో వ్యవస్థల లోపాలను ఎత్తి చూపుతున్నాయి.

యూనిసెఫ్-2024 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా పిల్లలు, మహిళలు దాడులకు గురవుతున్నారు. 65 కోట్ల మంది అంటే ప్రతి 5గురిలో ఒకరు పరోక్షంగా ఆన్‌లైన్, మానసిక హింసలకు గురవుతున్నారు. భారతదేశంలో నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2023లోనే మహిళలపై 4,48,211 దాడుల కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్ష మంది మహిళలలో సగటున 66.2 కేసులు నమోదైనట్టు. తెలంగాణలో 2023లో 23,679 కేసులు నమోదయ్యాయి, ప్రతి లక్ష మంది మహిళల్లో 124.9 కేసులు నమోదయ్యాయి. ఇది దేశ సగటు రేటు 66.2తో పోలిస్తే రెండింతలు. ఆంధ్రప్రదేశ్ లో 2023లో 22,418 కేసులు నమోదయ్యాయి. ఇక పిల్లలపై హింస విషయంలో దేశంలో 2023లో 1,77,335 కేసులు నమోదు అయ్యాయి.

ఇలాంటి దాడులు ఆ ఒక్కరికే నష్టం కలిగించవు. ఆ కుటుంబంతోపాటు మొత్తం సమాజం మీద ప్రభావాన్ని చూపుతాయి. భద్రత లేని, నిత్యం ప్రమాదంలోనే ఉన్నామన్న భావన ప్రజల్లో భయానక మానసిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. నేరాలు పెరగడం ఒకవైపు, నేరస్థుల్లో శిక్షల భయం లేకపోవడం మరోవైపు, సమాజాన్ని అశాంతి దిశగా నెట్టేస్తున్నాయి.

న్యాయ వ్యవస్థ, పోలీస్ విభాగం, ప్రభుత్వ యంత్రాంగం పై నమ్మకం సన్నగిల్లడమేగాక, అవి బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాలు బలపడతాయి. నేరాలు జరిగాకే స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోగల సామర్థ్యం, చొరవ ఆ వ్యవస్థల్లో కనిపించాలి. తీవ్రమైన నేరాలకు దారితీసే సామాజిక కారణాలను గుర్తించి, వాటిపై అవగాహన, కౌన్సెలింగ్, కమ్యూనిటీ పోలిసింగ్ వంటి చర్యలు చేపట్టడం అత్యవసరం.

అన్నింటికంటే స్కూల్ నుండి కాలేజీల వరకు యువతలో విలువల విద్యను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. మహిళలపై దాడులు, చిన్నారులపై హింస వంటి దారుణాల మూలాల్లో పితృస్వామ్య ధోరణులు, కోప నియంత్రణలో వైఫల్యం, అసూయ, అసహనం వంటి మానసిక రుగ్మతలు ఉంటాయి. వీటిని విద్య ద్వారానే మార్చగలం. ఇంటి నుండి పాఠశాల, సమాజం వరకు పిల్లల్లో పరస్పర గౌరవం, బాధ్యత, సానుభూతి వంటి విలువలు పెంపొందితేనే సమాజంలో శాంతి నెలకొంటుంది. మరోవైపు, నేరాలకు పాల్పడినవాళ్ళకు గట్టి శిక్షలు పడి, అవి వెంటనే అమలయ్యేలా ప్రత్యేక కోర్టులు పనిచేయాలి. ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క.

ఈ నేపథ్యంలో మౌనం వీడాలి. ప్రతి ఒక్క పౌరుడి నుండి పౌర సమాజం మొత్తం సమస్యను కేవలం పోలీస్‌, ప్రభుత్వాలపై నెట్టడం సరికాదు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మహిళలను గౌరవించాలి, రక్షించాలి, సమాన హక్కులతో కలిసి నడిచే సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని అందించాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News