Tuesday, June 9, 2026
26.6 C
Hyderabad

పన్నులు బాదుడేనా ప్రభుత్వాల పని?|ESSAY

‘ప్రభుత్వాలు నడవడానికి పన్నులవసరమే కానీ, ఆ పన్నులు ప్రజల్ని అసంపన్నులను చేసే విధంగా ఉండొచ్చా. జనాభాలో అత్యధికంగా ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల గతేం కాను? దేనికైనా ఒక లిమిట్ ఉన్నట్లుగానే పన్నుల భారం మోపేందుకు ఓ లిమిట్ ఉండాలి. ఇప్పటికే రోడ్డు ట్యాక్స్‌, పెట్రోలు-డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీలు, జీఎస్‌టీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇలా అనేక రకాల పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై మరింత భారం వేయడం అనేది మూలిగే నక్కపై తాటి పండు పడేసినట్లే.’ అంటూ సీనియర్ జర్నలిస్టు, బీసగోని సిద్ధార్థ్ రాసిన ప్రత్యేక వ్యాసం.

పన్నులు బాదుడేనా ప్రభుత్వాల పని?

ప్రజల బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు, పన్నుల పేరిట దోపిడి చేయడం దుర్మార్గం. వృత్తి, ఉపాధి చేసుకుంటూ జీవిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం పెను శాపంగా మారుతున్నది. ఇదే వరసలో వాహనాల లైఫ్ టాక్స్ పెంచుతూ తెలంగాణ రవాణ శాఖ విడుదల చేసిన 53,54 జీవోలు అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు తీరని నష్టం చేసే విధంగా ఉన్నాయి.

ప్రభుత్వాలు నడిచేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. కానీ దానికీ ఒక పరిమితి ఉంటుంది. దేనికైనా ఒక లిమిట్ ఉన్నట్లుగానే పన్నుల భారం మోపేందుకు ఓ లిమిట్ ఉంటుంది. ఇప్పటికే రోడ్డు ట్యాక్స్‌, పెట్రోలు-డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీలు, జీఎస్‌టీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇలా అనేక రకాల పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై మరింత భారం వేయడం అనేది మూలిగే నక్కపై తాటి పండు పడేసినట్లే.

ఈరోజుల్లో ఏ చిన్న ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినా లక్ష దాటి ఉంటుంది. రైతులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను వృత్తి, ఉపాధి పరంగా కొనుగోలు చేస్తుంటారు. తాజా జీవోల ప్రకారం, లక్ష దాటిన ద్విచక్ర వాహనాలపై లైఫ్ టాక్స్ ను 12శాతం నుంచి 15శాతానికి పెంచారు. ఉదాహరణకు బైక్ ఎక్స్ షోరూం ధర లక్షా 10వేలు ఉంటే, ఇప్పటి వరకు 13,200 లైఫ్ టాక్స్ కట్టాల్సి ఉండేది. తాజా పెంపుతో ఇది 16,500 లకు పెరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారం పేద, మధ్య తరగతి ప్రజలపై పడుతుంది.

కారు కొనుక్కోవాలనేది సాధారణంగా ఎవరికైనా ఉండే కోరిక. అప్పు చేసో, లోన్ తీసుకునో కొనుగోలు చేస్తుంటారు. 10లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి. అలాంటి కార్ల మీద కూడా లైఫ్ టాక్స్ వేయడం అంటే ప్రజల కోరికలను సొమ్ము చేసుకోవడమే. 10 నుంచి 20 లక్షల కారు కొంటే 17శాతంగా ఉన్న పన్ను శాతాన్ని 18శాతానికి పెంచారు. ఉదాహరణకు 12 లక్షల కారు కొంటే పాత విధానం ప్రకారం, 2లక్షల 4వేల లైఫ్ టాక్స్ చెల్లించాలి. కానీ పెరిగిన దాని ప్రకారం, 2లక్షల 16వేల దాకా చెల్లించాలి. అంటే 12వేలు ఎక్కువ. 20లక్షలు దాటితే రెండు శాతం, 50లక్షలు దాటితే మూడు శాతం. ఇట్ల అడ్డోగులుగా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. కమర్షియల్ వాహనాల పన్నులు కూడా పెంచారు. 20లక్షల పైగా ఉంటే 20శాతంగా ఉన్న పన్నును 22శాతానికి, 50లక్షలు దాటితే 25శాతం పన్ను కట్టాలని నిర్ణయించారు. కమర్షియల్ వెహికిల్స్ పై పన్ను పెంచడం వల్ల, చివరకు ఆ భారం మార్కెట్ పై, తద్వారా ప్రజలపైనే పడుతుంది. ఇట్లా పన్నులు పెంచడం వల్ల ఏవిధంగా చూసినా పేద, మధ్య తరగతి ప్రజలే ప్రధానంగా ఇబ్బంది పడుతారు.

పోనీ ఇన్ని రకాలుగా పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నాయా? అంటే అదీ లేదు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏండ్లు కావస్తున్నా, ఇప్పటికీ విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. కూడు, గూడు దేవుడెరుగు తాగు నీటి కోసం కిలోమీటర్ల నడవాల్సిన పరిస్థితిలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వాలు పెట్టకపోవడం శోచనీయం. పేద, మధ్య తరగతిపై పన్నుల భారమైనా పడకుండా చూడాలి, లేదంటే అడ్డగోలుగా వివిధ రూపాల పేరిట వసూలు చేస్తున్న పన్నులతో విద్య, వైద్యం, తాగు నీరు, రోడ్లు వంటి కనీస సదుపాయాలైనా పూర్తి స్థాయిలో కల్పించాలని ప్రభుత్వాలను కోరుతున్నాం.

– బీసగోని సిద్ధార్థ్
సీనియర్ జర్నలిస్ట్, 97042 83062

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News