Sunday, July 26, 2026
28.1 C
Hyderabad

అవినీతిపై నిజానిజాల నిగ్గు తేల్చాల్సిందే!|EDITORIAL

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానించింది. ఇది ప్రభుత్వం తీసుకున్న తెలివైన నిర్ణయంగా కనిపిస్తోంది. అటు రాజకీయ లబ్ధి, ఇటు కాగల కార్యాన్ని ఒడుపుగా జరిపించే నిర్ణయంగా భావించాలి. నేనుగా ప్రభుత్వం చేస్తున్నట్లుగా కాకుండా, దర్యాప్తు సంస్థల ద్వారానే కానించేయడంగా అనిపిస్తోంది. ఆలస్యంగా అయినా అవినీతిపై చర్యలకు సర్కార్‌ పూనుకున్నట్లయింది. నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా విశ్వాసం సన్నగిల్లుతోన్న ఈ దశలో ఈ నిర్ణయం ఫలితం ఏ విధంగా ఉండనుందనేది ఆకస్తిగా మారింది. ఏపీలో వైఎస్‌ వివేకా హత్య కేసు, ఐదేళ్లుగా దర్యాప్తు దశలోనే ఉంది. జగన్‌ అవినీతి వ్యవహారాల్లో కూడా ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇలా తేలని కేసులు, దర్యాప్తుదశలోనే జైలుకు వెళ్ళిన నిందితులు, రకరకాల స్థాయిల్లో పెండింగులోనే ఉన్నాయి.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ లు ఎందుకు అప్పుల్లో కూరుకు పోయాయో ఇప్పుడు అర్థమవుతున్నది. ప్రభుత్వాలపై ఎప్పటికప్పుడు కాగ్ నివేదికలు వస్తున్నా, వాటిపైగానీ, రాజకీయ అవినీతి ఆరోపణలపై విచారణలు సహజంగానే ఆలస్యంగా కొనసాగుతూ వస్తున్నాయి. పాలకులైతే చాలు, ఏమైనా చేయొచ్చనే దీమాను ప్రశ్నించే స్థాయిలో మన చట్టాలు, దర్యాప్తు సంస్థలు ఉన్నాయా? అన్నది స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకు కూడా అనుమానంగానే ఉండటం మన దేశ ప్రజల దౌర్భాగ్యం. కమిషన్లు, సిట్ లు, దర్యాప్తు సంస్థలు ఇలా ఏయే విచారణలైప్పటికీ అవినీతి పాలకులకు ఏదో ఓ దారి దొరుకుతూనే ఉంది. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట, బయట ఉండాల్సిన వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతుండటం నయా ప్రజాస్వామ్య కొత్త రూపంగా తోస్తున్నది.
దర్యాప్తు సంస్థలకు దీటుగా గతంలో లోక్ పాల్, లోకాయుక్త వ్యవస్థలు ఉండేవి. రిటైర్డ్ జడ్జీలు వాటికి చైర్మన్లుగా ఉండేవారు. కేవలం రాజకీయ అవినీతి, పాలకులకు సంబంధించిన కేసులను వీరు విచారించేవారు. రాజకీయావసరాల కోసమే కొందరు నేతలు వాటిని నిర్వీర్యం చేశారు. వాటిని మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
దేశంలో రాజకీయ అవినీతి బాగా వేళ్లూను కుంది. రాజకీయ నాయకులు పాలనను పక్కన పెట్టి అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఒక్కసారి అధికారం వస్తే చాలు, తరతరాలకు తరగని ఆస్తులను మూటగట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా రాజకీయ నేతల పనంతా ఇదే అన్నట్లుగా ప్రస్తుత రాజకీయ, పరిపాలనా పద్ధతులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాల్సిందే. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిబద్ధతను చాటుకుని సర్వ స్వతంత్ర న్యాయ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి. కేవలం రాజకీయ అవినీతిని విచారించేందుకు దీని అవసరం చాలావుంది.
కాళేశ్వరం నిర్మాణమే పెద్ద డొల్లని, అది కేవలం కమీషన్ల కోసం, కేసీఆర్‌ తన ఎర్రవల్లి ఎస్టేటు పొలాలను పారించుకునేందుకు నీటిని మళ్ళించిన కట్టడంగా తప్ప, ప్రజలకు ఉపయోగపడే కట్టడం కాదని మరోసారి తేలింది. నిపుణుల సూచనలు బేఖాతర్‌ చేస్తూ, అవినీతి కట్టడంగా, నియమనిబంధనలు పాటించకుండా, డీపీఆర్ ను కేంద్రానికి ఇవ్వకుండా, కేంద్రం నిధులే రాకుండా, ఏక పక్షంగా కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఓ కుటుంబం కమీషన్ కాసులకు కక్కుర్తిపడి కట్టిన కట్టడండా ఆ ప్రాజెక్టుపై సీఎం విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైంది కాదని రిపోర్టులున్నాయని, తర్వాత కమిషన్ విచారణలోనే ఇదే తేలిందని సీఎం నిండు అసెంబ్లీ సభలో స్పష్టం చేశారు. అసెంబ్లీ కూడా అవినీతి జరిగిందని, సీబీఐ దర్యాపు జరపాలని తీర్మానించింది. పీసీ ఘోష్ కమిషన్ తేల్చేసింది తప్పైతే, కేసీఆర్‌ నిజాయితీ పరుడైతే కాళ్వేరం కమిషన్‌ను వ్యతిరేకించరు. హైకోర్టుకు వెళ్లి కమిషన్‌ను రద్దు చేయమని కోరరు. ఒకవేళ విచారణ జరిపినా దాన్ని సభలో పెట్టొద్దని, పెట్టినా చర్యలు తీసుకోవద్దని అభ్యర్థించరు. ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునివవ్వరు. ఇదీ అందరికీ అర్థమవుతున్న వాస్తవమే.
దాదాపు పదేళ్లు పాలించిన కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అప్పులకుప్పగా చేసినది కూడా నిజమేనని సీఎం పదే పదే అసెంబ్లీలోనే చెబుతున్నారు. శాసనసభలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయించడం ఒక విధంగా మంచిదే. ప్రభుత్వం, సీఎం ఏకపక్షంగా, కక్షపూరితంగా వ్యవహించే అవకాశం లేకుండా చేశారనుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్నవారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌, కాగ్‌, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌… గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయి. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషభిషలకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75 శాతం నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కూడా ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్‌ పేరుతో మేడిగడ్డకు మార్చడం తోనే అవినీతికి తెరలేపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్టాన్రికి గుదిబండగా మార్చిన కేసీఆర్‌, హరీశ్‌రావులే కాదు, ఇందులో భాగస్వామ్యం ఉన్న ఈటల, తుమ్మల, ఐఎఎస్ లు, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కేబినెట్ లో మంత్రులుగా ఉన్నవాళ్ళంతా శిక్షార్హులే.
రాజకీయ నాయకులు తమ ఇష్టాను సారం డబ్బులు వెనకేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం గురించి ఎన్‌డీఎస్‌ఏ ఎప్పుడో తేల్చిచెప్పింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను ఎన్‌డీయే రిపోర్టని బీఆర్‌ఎస్‌ ఆనాడు ఎదురుదాడికి దిగింది. అలాగే పీసీ ఘోష్ కమిషన్ ను పీసీసీ కమిషన్ గా దాడి చేసింది. ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతోంది.
మొత్తంగా గోదావరిలో సభలో సీఎం చెప్పినట్లు రూ.లక్షన్నర కోట్లు కొట్టుకుపోయాయి. అప్పు, దానికి వడ్డీ మిగిలింది. దాన్ని కట్టే బాధ్యత ప్రజలపై పడింది. విచారణను అడ్డుకుంటున్న తీరు, బీఆర్‌ఎస్‌ అవినీతిని తేటతెల్లం చేస్తోంది. ఇందుకు బాధ్యులైన నేతలను, అందుకు సహకరించిన అధికారలును జైళ్లల్లో వేయాలి. ఈ కేసులను త్వరగా తేల్చి సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలి.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News