Saturday, July 11, 2026
26.5 C
Hyderabad

కొండా వర్సెస్ కాంగ్రెస్!?|KONDA SUREKHA|CONGRESS

సీఎం రేవంత్ పై కినుక|CM|REVANTHREDDY
కడియంపై సీఎం కు లేఖ|KADIYAM SRIHARI
అధిష్ఠానానికి ఫిర్యాదు?|AICC
గతంలోనూ అవమానాలే
క్రమశిక్షణా సంఘంతో విచారణకు డిమాండ్|DISIPLINERY COMMITTEE

హైదరాబాద్, జూలై 7 (అడుగు న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ అధికారులతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమవడంతో పాత సమస్యలు కూడా తెరమీదకు వచ్చాయి. గతంలోనూ తనకు అవమానాలే జరిగాయంటూ, తాజా సమస్యపై విచారణ జరపాలని సీఎం కు లేఖ రాసిన సురేఖ, అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు లేఖ రాయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కొండా కుటుంబానికి అధికారంతోపాటు వివాదాలు కొత్త కాదు. అయితే, అవి ఎప్పటికీ సమసిపోకుండా పోతున్నాయి. కొత్తగా తలెత్తుతుండటమే విచిత్రం. విధి వైపరీత్యం. స్వయం క్రుతాపారాధం. గతంలో అవినీతి ఆరోపణల కారణంగా మంత్రి కొండా సురేఖకు అత్యంత నమ్మకస్తుడైన ఓఎస్‌డీ సుమంత్ ను సీఎంఓ తొలగించింది. సురేఖకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ ఏకపక్ష నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.

నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలక మండలి నియామక వ్యవహారం మంత్రిని తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్లు తెలిసింది. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే యాదాద్రి టెంపుల్ బోర్డు చైర్మన్‌తో సభ్యుల నియామకం విషయం కూడా మంత్రికి తెలియదట. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పేర్లు ఖరారై జీవో విడుదలైందట. తన సిఫార్సులకు కనీస విలువ ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న కొండా సురేఖ, నిరసనగా ఇటీవల డిజిటల్ గా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికే హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. “కొండా సురేఖకు తెలియకుండానే కొణిదెల సురేఖ నియామకం” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు రావడం ఆమెను మరింత మనోవేదనకు గురిచేసినట్లు తెలిసింది.

యాదాద్రి వివాదం చల్లారకముందే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలి కొండా సురేఖకు మరింత ఆగ్రహం తెప్పించింది. దేవాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కడియం శ్రీహరి హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ డైరెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, భూముల పరిరక్షణపై ఆయన అధికారులకు గడువులు నిర్దేశించడంపై మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటుగానే ఫిర్యాదు చేశారు.

కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ స్ఫూర్తిని ఉల్లంఘించారని మంత్రి మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఇంత అనుభవం ఉన్న నాయకుడు, శాఖా మంత్రిని పూర్తిగా పక్కనపెట్టి సమీక్షలు నిర్వహించడం అనుచిత సంప్రదాయమని, ఇది అధికార యంత్రాంగంలో అయోమయానికి దారితీస్తుందని సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

శాఖాపరమైన ఇబ్బందులతో పాటు, తన సొంత ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లోనూ కొండా సురేఖకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని తన కుమార్తె కొండా సుస్మితా పటేల్‌కు ఇప్పించుకోవాలని ఆమె ప్రయత్నించినప్పటికీ, స్థానిక సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల ఆధిపత్యానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్గతంగా గ్రూపులు కట్టడం ఆమెను ఒంటరిని చేసింది. దీనికి విరుద్ధంగా అమె వ్యవహారశైలి, వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. అధిష్ఠానం జోక్యం చేసుకునేదాకా వెళ్లింది. ఏదో విధంగా సద్దుమణిగింది.

ఈ మొత్తం పరిణామాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న కొండా సురేఖకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో వ్యతిరేకతలు రావడం, నిర్లక్ష్యానికి గురవుతుండటాన్ని తన పట్ల వివక్షగా మంత్రి సురేఖ భావిస్తున్నారు.

అందుకే ఆమె ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని తేల్చుకోవాలనుకుంటున్నారు. ఒకవైపు సీఎంకు లేఖ రాస్తూనే, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అధిష్టానానికి రాయనున్న లేఖ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Latest News

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

కానరాని వాన జాడ..!?|RAIN|FARMER

కరువు కోరల్లో రాష్ట్రాలు కోరలు చాచిన సూపర్ ఎల్‌నినో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు అడుగంటిన భూగర్భ జలాలు ఇక మంచినీళ్ళకూ తిప్పలే కరువు కోరలు చాస్తోందా? మంచినీటికి కూడా దిక్కులేని పరిస్థితి దాపురిస్తుందా? ఎల్ నినో...

సిల్లరే కదాని సిన్నగ సూడొద్దు!?|ADUGU TRENDS

ఒక్కొక్కటి కలిత్తేనే వందైతయి. వేయైయితి. లచ్చలైతయి. గందుకే ఒక్కటే కదాని సిల్లరగ సూడొద్దు. సిల్లరే కదాని తక్కువ సేయొద్దు. సిల్లరగాడని తిడ్తం. సిల్లరని తక్కువ శేత్తే మాత్రం మనం సిల్లరైపోతం. కోట్లైనా ఒక్కటితో...

కాళేశ్వరం కథ కంచికి చేరేనా!?|EDITORIAL

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రజా పెట్టుబడుల్లో ఒకటి. దాన్ని పూర్తిగా విస్మరించడం కూడా మరింత నష్టం. జరిగిన లోపాలను విస్మరించడం అంతకంటే పెద్ద తప్పు. అందువల్ల ఒకవైపు అవినీతి,...

జూలై 09, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి నవమి ఉదయం 05.47 వరకు ఉపరి దశమి నక్షత్రం అశ్విని ఉదయం 11.14 వరకు ఉపరి భరణి యోగం సుకర్మ ఉదయం 07.23 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 05.47 వరకు ఉపరి...

ఆనలోనే ఏడడుగులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట. పెండ్లంటే పందిండ్లు, సందెడులు, చప్పుల్లు, తలంబ్రాలు. పెండ్లంటే మూడు ముడులు, ఏడు అడుగులు. ఎవ్వలైనా మనిండుంగ పెండ్లి ఒక్కసారే చేసుకుంటరు. గందుకే గా పెండ్లంటే సాలు ఆకాశమంత పందిరేసి,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News