Friday, April 10, 2026
36.2 C
Hyderabad

పాశమైలార ఘటనకు ఎవరు బాధ్యులు!?|EDITORIAL

కంపెనీ సైరన్‌ మోగింది. యథావిధిగా కార్మికులంతా ఉత్సాహంగా తాము రోజూ చేసే పనుల్లో మునిగిపోయారు. వేగంగా పనులు ముగించుకొని, త్వరగా ఇళ్లకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోజులాగానే వీడ్కోలు పలికినా, సాయంత్రానికి మళ్లీ తిరిగి వస్తారన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఇదే వారికి ఆఖరి రోజని వారు ఊహించలేకపోయారు. అదే కడసారి చూపవుతుందని వారు అనుకోలేదు. అనుకోని ప్రమాదం తమ వారిని కబళిస్తుందని వారికేం తెలుసు? ఇప్పుడు తల్లికి పిల్ల, పిల్లలకు తల్లులు, తండ్రులు కాకుండా పోయారు. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోని స్థితిలో వారున్నారు. జరిగిన ఘటనను ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి ఇప్పటి లెక్క ప్రకారం 45 కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? తగు రక్షణ, భద్రత జాగ్రత్తలు తీసుకోకుండా యథాలాపంగా నడిపిన కంపెనీదా? కంపెనీ నిర్లక్ష్యాన్ని చూసీ చూడనట్లుగా వదిలేసిన అధికారులదా? ఇప్పుడు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా, కంటి తుడుపు సహాయాలు పోయిన వారిని తిరిగి ఇవ్వగలవా? అన్యాయమైన ఆ కుటుంబాలను ఆదుకోగలవా?

ఏ ప్రమాదం జరిగినా కంటితుడుపు చర్యలు తప్ప కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. పాశమైలారం ఒక్కటే కాదు, ఇండస్టియ్రల్‌ పార్కుల్లోనే భద్రత డొల్ల అని తేలిపోయింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండానే ఇలాంటి వందల కంపెనీలు నడుస్తున్నాయి. పేరుకే కార్మికశాఖ ఉంది. కార్మికుల గురించి వారు పెద్దగా స్పందించరు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఉన్న అంజయ్య భవన్‌కు వెళితే ఎన్నో దీనగాథలు కనిపిస్తాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందన్నది ప్రాథమిక విచారణ జరుగుతోంది. పేలుడు ధాటికి కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగ భవనం కూలిపోగా, మరో భవనానికి బీటలు వారాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఇక ఇక్కడ కార్మికులే కాదు, అందులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్‌ ప్లాంట్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకున్న మధుర జ్ఞాపకం మరువకుండానే అనంతలోకాలు పోయారు.

మొన్నటికి మొన్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన విషాదం మరువక ముందే ఈ ఘటన జరగడం విచారకరం. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని కార్మిక మంత్రి వివేక్‌ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తుందన్నారు. ఫిర్యాదు చేయడం కాదు…అలా జరుగుతుందా లేదా అన్న విషయం ఆరా తీయాల్సింది కార్మికశాఖనే. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే పౌడర్‌ తయారు చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు రసాయన పరిశ్రమల భద్రతపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడే యాజమాన్యాలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆతర్వాత కొద్ది రోజులకు అంతా మరచిపోతాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. రసాయనాల మధ్య చర్యల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లతో యంత్రాలను తనిఖీ చేయించాలి. జిల్లా అధికారులు పరిశ్రమలను నిర్ణీత తేదీల్లో తనిఖీ చేస్తుండాలి. కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలకు వెళ్తుంటారు. వీరు తనిఖీలు చేసి ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి అనుమతులు ఇస్తుంటారు. క్షుణ్నంగా పరిశీలన చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల నిర్వహణ ఉండాలి. ఇవి కాగితాల్లోనే కనిపిస్తాయి. ప్రతి పరిశ్రమలలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్‌ వాహనాలు, సిబ్బంది ఉండాలి. అంతేకాదు అగ్నిమాపక సిబ్బందిని వారే నియమించుకోవాలి. ఈ కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేయాలి. నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకోవట్లేదు. తక్కువ వేతనాలు ఇస్తూ ఇతర రాష్టాల్రకు చెందిన కూలీలనే పనిలోకి తీసుకుంటున్నారు. చిన్నచిన్న ప్రమాదాల బారినపడి కార్మికులు మృతిచెందిన విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇక నుంచి బంద్‌ కావాలి. క్షేత్ర స్థాయిలో ఒక్కో పరిశ్రమను అడుగడుగునా తనిఖీ చేయాలి. నిపుణుల బృందం పరిశీలించాలి. అప్పుడే ప్రమాదాలను కొంతయినా నివారించగలుగుతామని గుర్తించాలి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News