Saturday, June 27, 2026
27.6 C
Hyderabad

మేడారంలో ఘనంగా ‘మండమెలిగే పండుగ’|MEDARAM|JATHARA|SAMAKKA SARALAMMA

ఆదివాసీ సంప్రదాయాల మధ్య జాతర శుభారంభం

మేడారం ప్రత్యేక ప్రతినిధి, జనవరి 21 (అడుగు న్యూస్):
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తొలి ఘట్టం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జాతర ఆరంభానికి అధికారిక సంకేతంగా భావించే ‘మండమెలిగే పండుగ’ను మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు స్వామి కొలువై ఉన్న ఆలయంలో ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పండుగతోనే మహాజాతరకు తొలి అడుగు పడిందని గిరిజనులు విశ్వసిస్తారు.

‘వరుడు సిద్ధం’ అనే సంకేతం

మేడారం జాతర ప్రారంభానికి ముందు పగిడిద్దరాజు గద్దెపై ప్రతిష్ఠ తప్పనిసరి అనే కోయ సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయానికి అనుగుణంగా మండమెలిగే పండుగను నిర్వహించడం ద్వారా “వరుడు సిద్ధం… తల్లుల జాతరకు సమయం ఆసన్నమైంది” అనే భావనను చాటుతారు. ఈ పూజలతో మేడారం మహాజాతర విజయవంతంగా సాగుతుందన్న నమ్మకం భక్తుల్లో గాఢంగా ఉంది.

మండమెలిగే పేరు వెనుక చరిత్ర

పూర్వకాలంలో అగ్నిప్రమాదాల వల్ల దగ్ధమైన ఆలయ గుడిసెలను జాతర వారం ముందు కొత్త కొమ్మలతో (మండలు) శుద్ధి చేసి పునర్నిర్మించే ఆచారం ఉండేదని పూజారులు వివరిస్తున్నారు. ఆ పవిత్ర సంప్రదాయానికే ‘మండమెలిగే’ అనే పేరు వచ్చిందని తెలిపారు. ఈ పండుగ సజావుగా జరిగితే మహాజాతర ఎలాంటి అవాంతరాలు లేకుండా ఘనంగా జరుగుతుందని ఆదివాసీలు విశ్వసిస్తున్నారు.

రహస్యంగా ప్రత్యేక పూజలు

మండమెలిగే పండుగను ప్రధాన పూజారి పెనుక బుచ్చి రాములు, ఇతర ప్రధాన పూజారులు, పెనుక వంశస్థుల ఆధ్వర్యంలో శతాబ్దాల నాటి కోయ తెగ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి అత్యంత రహస్యంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సమయంలో సామాన్య ప్రజలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించారు. డోలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ మామిడి తోరణాలతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది.

దొరస్తంభాలతో అష్టదిగ్బంధనం

మహాజాతర పూజలకు దుష్టశక్తులు అడ్డురాకుండా ఉండేందుకు అడవిలో నుంచి తెచ్చిన బూరుక కర్రలకు మామిడి ఆకులు కట్టి పూనుగొండ్ల గ్రామ పొలిమేరల్లో దొరస్తంభాలు ఏర్పాటు చేశారు. గ్రామాన్ని అష్టదిక్కుల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయం కొనసాగుతుందని పూజారులు తెలిపారు.

కఠిన నిష్ఠతో పూజలు

ఇక నేటి నుంచి మహాజాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠిన నియమాలు పాటిస్తూ ప్రత్యేక నిష్ఠతో పూజలు నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధమైన జీవనం, నియమిత ఆహారం, శుద్ధి ఆచారాలతో వనదేవతల అనుగ్రహం పొందుతారన్న విశ్వాసం ఆదివాసీ సమాజంలో బలంగా ఉంది.

Latest News

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News