Saturday, June 27, 2026
25.3 C
Hyderabad

కేసీఆర్|KCR ASSEMBLY|అసెంబ్లీకి వస్తారా!?  STRATAGIES|వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంపై కొనసాగుతున్న చర్చ కేవలం ఒక ఎమ్మెల్యే హాజరుకు సంబంధించింది మాత్రమే కాదు. అది ప్రతిపక్ష పాత్ర. ప్రజాస్వామ్య బాధ్యత. కేసీఆర్‌ వస్తే, రాకపోతే ఏమి జరుగుతుంది? ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చర్చలు ఎలా సాగుతాయి? పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులపై చర్చ ఎలా ఉండనుంది?

హైదరాబాద్, డిసెంబర్ 26 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):

అధికారంలో ఉన్నన్నాళ్ళూ కేసీఆర్, సెక్రటేరియట్ కు వస్తారా? రారా? అన్న వాద వివాదాలు, ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా? రారా? అన్న వైపు మళ్ళాయి. కేసీఆర్ మాట్లాడినా, మాట్లాడకపోయినా, అసెంబ్లీకి వచ్చినా, రాకున్నా చర్చల్లో ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్, ఆ పార్టీ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా.. అసెంబ్లీకి రెండంటే రెండే సార్లు వచ్చారు. ఒకటి 2024లో ఆయన తన ప్రమాణ స్వీకారానికి వచ్చినా, అసెంబ్లీ లోపలికి రాలేదు. అదీ స్పీకర్ చాంబర్ లో ముగించి వెళ్ళారు. ఆ తర్వాత 2024 బడ్జెట్ సమావేశానికి ఇలా వచ్చి, అలా వెళ్ళారు. రెండేళ్ళల్లో రెండు సార్లే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్, మూడో ఏట జరుగుతున్న ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? దాదాపు రాకపోవచ్చు. వస్తే గిస్తే, అది సాంకేతికంగా తన ఎమ్మెల్యే పదవికి గండం లేకుండా చూసుకోవడానికేననే వాదన వినిపిస్తున్నది. అయినప్పటికీ, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలని, చర్చల్లో పాల్గొనాలని ప్రభుత్వం పట్టుపడుతున్నది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గమంతా కేసీఆర్ ను రా రమ్మంటున్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి ఆయనకు కొన్ని రాజకీయ, వ్యక్తిగత కోణాలు, వ్యూహాలు ఉండొచ్చు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న నేత ప్రతిపక్షంలో కూర్చోవడం అంత సులువు కాదు. పరిపాలనా శైలి నుంచి ప్రతిపక్ష పాత్రకు మారాల్సిన మానసిక, రాజకీయ సంసిద్ధతకు కొంత సమయం పడుతుంది. సభలో హాజరు కంటే బయట నుంచి రాజకీయ ఒత్తిడి పెంచడం, తమ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే వ్యూహాత్మకతను ఆయన ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రజాస్వామ్యంలో శాసనసభ సభ్యుడిగా సభకు రావడమనే బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారనే విమర్శకు ఆయన గైర్హాజరీ బలం చేకూరుస్తోంది.

ఈసారి ఆయన వస్తారా? వస్తే సాంకేతికంగా సమస్యలు తలెత్తకుండా సంతకం పెట్టి వెళ్ళిపోతారా? చర్చల్లో పాల్గొంటారా? కేసీఆర్ సభకు హాజరైతే అధికార-విపక్షాల మధ్య చర్చలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి, రేవంత్-కేసీఆర్ మధ్య కాదంటే, సీఎం-ప్రతిపక్ష నేతల మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధం జరగొచ్చు. వాద ప్రతివాదనల మధ్య అసలు నిజాలు వెలుగుచూసే అవకాశమూ ఉంది.

అలాగే కేటీఆర్, హరీశ్ రావులకే పరిమితమైన ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ రాకతో ద్విగుణీక్రుతం అవుతుంది. అనుభవజ్ఞుడైన మాజీ సీఎం, సభలో అధికార పార్టీని అదుపు చేయనూ వచ్చు. ఆర్థిక నిర్వహణ, హామీల అమలు, పరిపాలన వంటి అంశాలపై లోతైన చర్చ జరగవచ్చు. ఇది ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉన్నా, ప్రజలకు స్పష్టతనిస్తుంది. అదే సమయంలో, ప్రతిపక్షానికి నాయకత్వ నైతిక బలం, కేసీఆర్ మాటలకు మీడియా ప్రాధాన్యం పెరుగుతుంది. సభలో చర్చలు అర్థవంతంగా, ఆచరణ యోగ్యంగా జరుగుతాయి.

ఒకవేళ కేసీఆర్ సభకు రాకపోతే అసెంబ్లీలో చర్చలు ఏకపక్షమవుతాయి. యథావిధిగా ప్రతిపక్ష విమర్శలు బయటి వేదికలకే పరిమితం అవుతాయి. దీర్ఘకాలంలో ఇది ప్రతిపక్షానికే నష్టం చేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై అధికారిక రికార్డులో ప్రతిపక్ష స్వరం బలహీనపడుతుంది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా మారవచ్చు. కేసీఆర్ సభకు రాకపోవడం రాజకీయ వ్యూహమే అయినా, వ్యూహాత్మక తప్పిదమవుతుంది? ప్రజాభిప్రాయ పరంగా ప్రమాదకరమే.

కేసీఆర్ అసెంబ్లీకి రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన మాజీ సీఎం. కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే. అన్నింటికీ మించి ప్రతిపక్ష నేత. రాజ్యాంగ బద్ధంగా సభో సీఎం తర్వాత స్థానం ప్రపతిపక్ష నేతదే. ఆయన గైర్హాజరీ ప్రభావం వ్యవస్థపై పడుతుంది. కేసీఆర్ సభకు వస్తే, తెలంగాణ రాజకీయాలు చురుగ్గా మారి, మరింత వేడెక్కుతాయి. ఇదంతా కేసీఆర్ కు తెలియంది కాదు. ఎవరో చెప్పాల్సిన అగత్యం ఆయనకు లేదు. కాకపోతే ఆయన ఎవరు చెప్పినా వినరు? ఆచరించరు. తనదైన శైలిలోనే వ్యవహరిస్తారు.

Latest News

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News