Thursday, April 23, 2026
33.2 C
Hyderabad

తెలుగు సాహిత్యాధ్యుడు సోమనాథుడే!|PALKURKI SOMANATHA

PALAKURTHI|పాలకుర్తి సాహితీ ప్రస్థానానికి పాదాభివందనం
ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న|GORATI VENKANNA
డాక్టరేట్ ప్రకటించాక తొలిసారి పాలకుర్తికి వచ్చిన వెంకన్న
గోరేటికి ఘనంగా SOMANATHA KALA PITHAM|సోమనాథ కళాపీఠం సత్కారం
LANGUAGE|భాషా, LITERATURE|సాహిత్య కేంద్రంగా పాలకుర్తి
కవి సంగమం వ్యవస్థాపకుడు, కవి యాకూబ్
గోరేటి, యాకూబ్, దినకర్, ఒద్దిరాజులకు సన్మానం

పాలకుర్తి, సెప్టెంబర్ 26 (అడుగు న్యూస్):
తెలుగు సాహిత్య చరిత్రలో పాలకుర్తి నేల అజరామరమైన స్థానం సంపాదించుకుందని, ఈ ప్రాంతానికి చేతులెత్తి వందనం సమర్పిస్తున్నానని ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. కవి సంగమం వ్యవస్థాపకులు, బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు ముచ్చర్ల దినకర్, కవి వద్దిరాజు ప్రవీణ్ కుమార్ తో కలిసి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ లో శుక్రవారం జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరై, తిరిగి హైదరాబాద్ కు వెళ్తూ, మార్గమధ్యంలో, తొలి తెలుగు కవి, ఆది కవి పాల్కురికి సోమనాథుడి స్వస్థలం పాలకుర్తిలో, ఆయన చిరకాల మిత్రుడు, సోమనాథ కళాపీఠం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీ నారాయణను కలిశారు. ఈ సందర్భంగా సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు, కవి పండితుడు, బహుభాషావేత్త, డాక్టర్ రాపోలు సత్యనారాయణ క్లినిక్ లో ఆగి కాసేపు సాహిత్య కలబోతను నిర్వహించారు. డా. మార్గం నాగర్ కర్నూల్ లో చేసిన వార్తల యుద్ధం నుండి కేసుల పర్వం వరకు అప్పటి రోజులను నెమరు వేసుకున్నారు. అడుగు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగేది అంటూ మార్గం కుటుంబంతో వారికున్న సాన్నిహిత్యాన్ని అక్కడి వారితో పంచుకున్నారు. ఇదే సమయంలో ఈ నెల 25న డా. బి ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం గోరేటి వెంకన్న కు డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా సోమనాథ కళాపీఠం, పాలకుర్తి ప్రజల తరపున సన్మానించారు. శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పాలకుర్తి, చిట్యాల/చాకలి ఐలమ్మ జయంతి కావడంతో చౌరస్తాలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం గోరేటి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, సాహిత్యాన్ని అంతపురాల నుంచి అనంత ప్రజల్లోకి తీసుకువచ్చిన మహాకవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన నేల పాలకుర్తి, ఆయన భాషను జీవ భాషగా నిలబెట్టి, జాను తెలుగులో ద్విపద కావ్యాలను సృష్టించి, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి అమూల్యమైన కావ్యాలను సమాజానికి అందించారన్నారు. సోమనాథుని రచనలు కేవలం కవిత్వమే కాదు, సమాజ మార్పులకు దిక్సూచి. ఆయన సాహిత్యం సమాజంలోని ప్రతి రంగాన్నీ తాకి, భవిష్యత్తు దశ, దిశలను నిర్దేశించింది. అందుకే నేటికీ పాలకుర్తి, తెలంగాణతో పాటు కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాహిత్య వాతావరణాన్ని నింపుతూ డా. రాపోలు సత్యనారాయణ, డా. మార్గం లక్ష్మీనారాయణ వంటి మిత్రులు పనిచేయడం విశేషమన్నారు. నగరాల్లో సాహిత్య వ్యాప్తి సులభం, కానీ పల్లెల్లో అలా చేయడం గొప్ప కృషి అని కొనియాడారు. సోమనాథ కళాపీఠంకు అభినందనలు తెలిపారు.

అలాగే తాను రాసిన ప్రతి కవిత, పాటలో పాల్కురికి సోమనాథుడి ప్రస్తావన తప్పనిసరి అని, అంటే తనపై పాల్కురికి సోమనాథుడి ప్రభావం ఎంతో ఉందన్నారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనలు తెలుగు సాహిత్యానికే మార్గదర్శకులు అన్నారు. అలాగే తెలుగు సాహిత్యం ఆశు సంప్రదాయంగా ఆరంభమై, తరువాత లిఖిత సంప్రదాయంగా రూపుదిద్దుకుందన్నారు. యతి, ప్రాసలకు జన్మనిచ్చిన ఈ పవిత్ర నేల పాలకుర్తి అని, ఈ ప్రాంతానికి రావడం తన అదృష్టం అన్నారు. తనకు డాక్టరేట్ ప్రకటించిన తర్వాత పాలకుర్తికి రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఇదే సందర్భంలో తన మిత్రుడు డా. మార్గం గురించి మాట్లాడుతూ, ఏదైనా విషయంలో తనకు అనుమానం వస్తే దాన్ని చీల్చి చెండాడే దాకా వదలడని, నాగర్ కర్నూల్ ను తాను ఉన్నన్ని రోజులు గడగడలాడించాడని చెప్పారు. ఆ రోజుల్లో నాగర్ కర్నూల్ లో మార్గం ఉన్నాడో లేడో తెలుసుకొని అప్పటి ప్రజా ప్రతినిధులు వచ్చేవారని, ఉన్నాడంటే అక్కడికి రావడానికే భయపడే వారని చెప్పారు. 35 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం వున్న వ్యక్తి నేటి తరానికి తగ్గట్లుగా, అడుగు డిజిటల్ మీడియా పెట్టడం, తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకోవడం అభినందనీయమని అన్నారు. అలాగే అడుగు డిజిటల్ మీడియాను టెక్నికల్ గా, క్రియేటివ్ గా మార్చుతున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను కూడా అభినందించి, ఆశీస్సులు అందించారు.

అంతకముందు కవి సంగమం వ్యవస్థాపకులు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్ మాట్లాడుతూ, పాలకుర్తి ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని సాహిత్య కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడి చరిత్రను మిత్రులు డా. రాపోలు సత్యనారాయణ, డా. మార్గం లక్ష్మీ నారాయణలు వివరిస్తుంటే తాను ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ఈ ప్రాంతానికి కవులు, రచయితలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతానికి సాహిత్య యాత్రకు రావాలన్నారు. ఇక నుండి సోమనాథ కళా పీఠం సాహిత్య కార్యక్రమాలకు తాము వస్తామన్నారు. మేము వస్తుంటే ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉందని, ఇలాంటి ప్రశస్తమైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ ప్రాంతానికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.

చాకలి ఐలమ్మ కు నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో మారం రవికుమార్, రేపాల అశోక్, రాపాక ఉదయ్, రాపోలు రాంబాబు, అబ్బోజు యాకస్వామి, రాపోలు సోంసాయి, మచ్చ సునీల్, కమ్మగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/gzKUDyvzxcM?feature=shared

Latest News

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

23-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి రాత్రి 01.32 వరకు ఉపరి అష్టమి నక్షత్రం పునర్వసు రాత్రి 01.30 వరకు ఉపరి పుష్యమి యోగం సుకర్మ ఉదయం 10.41 వరకు ఉపరి ధృతి కరణం గరజి మధ్యాహ్నం...

గా కార్ బిల్డింగును సూద్దాం పాండ్రి!?|ADUGU TRENDS

ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్...

మండుటెండల గుణ‘పాఠాలు’! |EDITORIAL

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు...

22-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 06.05 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 02.55 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి సుకర్మ కరణం బాలవ...

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

20-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం అక్షయ తృతీయ బసవ జయంతి తిధి శు తదియ ఉదయం 10.58 వరకు ఉపరి చవితి నక్షత్రం కృత్తిక ఉదయం 07.53 వరకు ఉపరి రోహిణి యోగం సౌభాగ్య రాత్రి 07.51 వరకు ఉపరి శోభ కరణం...

కులాలు, పండుగలు, ఆచారాలు, తెలంగాణ అస్తిత్వం|TELANGANA|FESTIVALS

ప్రాగైతిహాసిక కాలంలో కులపరమైన సమాజం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి బృహత్ శిలా సమాధులు తెలంగాణలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ప్రపంచంలోనే తొలినాళ్లలో ఇనుప ఉత్పత్తి చేసిన ప్రాంతాల్లో ఒకటి. దీని కారణంగా ఇక్కడ...

ఏసీల్లెక్క కూలర్ గాలికి గీ శిట్కాలు!?|ADUGU TRENDS

ఎండాకాలం రానే వచ్చె. పెనంల కెళ్ళి పొయ్యిల పడ్డట్టు, కుమ్ముల పెట్టినట్లు మలమల మాడి, ఉడికిపోబడితిమి. ఇగిప్పుడు ఏసీ టైమొచ్చింది. ఏసీల గిరాకీ, ధరలు సూత్తే అవి గూడ మండిపోబట్టే. ఇగ మద్దె...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News