Friday, April 10, 2026
36.2 C
Hyderabad

పార్టీల దశ,దిశను మార్చే పురపోరు!|EDITORIAL

ఎన్నికలు రాజకీయ పార్టీలకు కేవలం ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రమే కాదు. అధికారాన్ని అధిష్టించడానికి, తమ బల ప్రదర్శనకు, భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించుకునే వేదిక. తెలంగాణలో ఇటీవల గ్రామ పంచాయితీల ఎన్నికలు ముగియగా, ఇప్పుడు పట్టణ ఎన్నికలకు తెరలేచింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పట్టణాలు, నగరాలు రాజకీయ రణక్షేత్రాలుగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు మరింత ఉధృతమవుతోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 16న మున్సిపల్ ఛైర్మన్‌లు, మేయర్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. ముఖ్యంగా అధికార పార్టీకి పట్టణాల్లో పట్టు నిలబెట్టుకోవడం ఒక పెద్ద సవాల్. కాగా, ప్రతిపక్షాలకు ఇది తమ ఉనికిని చాటుకునే అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో సాధించిన ఫలితాలను పట్టణాల్లో కూడా పునరావృతం చేయాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వంపై పట్టణ ఓటర్ల అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి.

గ్రామ పంచాయతీల్లాగే, మున్సిపల్ ఎన్నికలు కూడా స్థానిక సమస్యలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్, పట్టణ అభివృద్ధి వంటి అంశాలే ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, ఈ ఎన్నికలు రాష్ట్ర స్థాయి రాజకీయ బల నిరూపణకు కొలమానంగా మారుతున్నాయి. పట్టణాల్లో ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపనున్నాయి.
నామినేషన్ల ఘట్టం మొదలవడంతో ఆశావహుల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. రిజర్వేషన్ల కారణంగా కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతుండగా, మరికొందరు పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ టికెట్ల కోసం అంతర్గత రాజకీయాలు, పైరవీలు జోరుగా సాగుతున్నాయి. అధికారిక నోటిఫికేషన్‌కు ముందే ఖర్చులు మొదలవడం, ఇప్పుడు నోటిఫికేషన్‌తో మరింతగా వ్యయాలు పెరగడం అభ్యర్థులకు ఆర్థిక భారంగా మారింది.

ప్రచారానికి కేవలం రెండు వారాలే సమయం ఉండటం ఒకవైపు మంచిదే అయినప్పటికీ, తక్కువ సమయంలో ఓటర్లను ప్రభావితం చేయాలనే తొందరలో అనవసర హంగులు, ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పథకాలు, హామీలు కీలకంగా మారనున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలతో అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే మొదలైంది.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు పోలింగ్, ఒకే రోజు లెక్కింపు ద్వారా ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించడం ద్వారా అనవసర ఉద్రిక్తతలకు తావు లేకుండా చూసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలన్న ఎన్నికల కమిషన్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సిందే.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News