Friday, June 26, 2026
30.7 C
Hyderabad

భారత్–ఈయూ ఒప్పందం-బహుళప్రయోజనాలు!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలతో ప్రపంచ వాణిజ్యం గందరగోళంలో పడింది. తక్షణ, దుందుడుకు ఆర్థిక విధానాలు, వీసాల కట్టడులు, వాణిజ్య నియంత్రణలు గ్లోబల్ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టాయి. ఒకవైపు అమెరికా టారిఫ్‌ల దూకుడు, మరోవైపు చైనా ఆధిపత్య కాంక్షల మధ్య ప్రపంచ దేశాలు కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు.

2007లో యూపీఏ హయాంలో మొదలైన భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు, వివిధ కారణాలతో నిలిచిపోయాయి. తిరిగి 2022లో చర్చలు పునఃప్రారంభమై, ఇప్పుడు ఫలితానికి చేరాయి. గ్రీన్‌లాండ్ పై ట్రంప్ వ్యవహారశైలి, “అమెరికా లేకుంటే యూరప్‌కు విలువే లేదు” అన్న వ్యాఖ్యలు, టారిఫ్‌లతో బెదిరింపులు యూరోపియన్ యూనియన్‌ను భారత్ వైపు వేగంగా నడిపించాయి. మరోవైపు భారత్ కూడా ఆచితూచి, పరస్పర సహకార విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలతో సయోధ్యకు ప్రయత్నిస్తోంది.

కొన్ని రాజకీయ ఆరోపణలను పక్కనపెడితే, వాస్తవానికి ప్రస్తుత గ్లోబల్ పరిణామాల్లో అమెరికాను ప్రత్యక్షంగా ఎదిరించే పరిస్థితి భారత్‌కు లేదు. వాణిజ్యం, పెట్టుబడులు మాత్రమే కాదు. లక్షలాది భారతీయుల జీవనాధారం అమెరికాతో ముడిపడి ఉంది. అందుకే ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు అడుగులు వేయడం భారతావనికి తప్పనిసరి. ఆ దిశలో ఈయూ ఒప్పందం ఎడారిలో ఒయాసిస్‌లాంటిదని చెప్పాలి.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో యూరప్ దేశాలకు భారత్ ఎగుమతి చేసే అనేక ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల భారత ఎగుమతిదారులకు దీర్ఘకాలిక లాభాలు చేకూరతాయి. అదే సమయంలో యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, కీలక ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుని, వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను భారత్–ఈయూ ఆమోదించాయి.

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా, భారత్–ఈయూ ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం. ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతుకు ఇది సమానం. యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలు తమ దేశీయ చట్టాలను పూర్తి చేసిన తర్వాత ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టే అవకాశముంది.

ఈ ఒప్పందంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఆటోమొబైల్ రంగం. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ 125% వరకు సుంకాలు విధిస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం ఇవి మొదట 40 శాతానికి, తర్వాత దశలవారీగా 10 శాతానికి తగ్గనున్నాయి. దీనివల్ల బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్, లాంబోర్గిని, పోర్షే వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా భారత్ నుంచి యూరప్‌కు ఎగుమతి అయ్యే కార్లపై అక్కడి సుంకాలు కూడా తగ్గనుండటంతో భారత ఆటో రంగానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

ఫార్మా రంగంలోనూ ఈ ఒప్పందం కీలకం. క్యాన్సర్, బరువు తగ్గించే మందులు వంటి కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై సుంకాలు తగ్గడం వల్ల భారత ఫార్మా కంపెనీలకు లాభం చేకూరుతుంది. విమానాలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గడంతో వినియోగదారులకు ధరల ఉపశమనం లభిస్తుంది.
ఇక భారత్ నుంచి యూరప్‌కు వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశముంది. విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో భారత యువతకు యూరప్‌లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. గ్రీన్ హైడ్రోజన్, శాస్త్ర సాంకేతిక భాగస్వామ్యం, డిజిటల్ కనెక్టివిటీ వంటి రంగాల్లోనూ సహకారం బలపడనుంది.

మొత్తానికి, అమెరికా టారిఫ్‌ల బెడద నుంచి ఉపశమనానికి, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, భారత ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అందిపుచ్చుకునేందుకు భారత్–ఈయూ ఒప్పందం ఒక చారిత్రక ముందడుగు. ప్రపంచంతో పోటీ పడుతూ భారత్ తన ఆర్థిక శక్తిని మరింత బలపర్చుకునే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

Latest News

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

జూన్ 24, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి రాత్రి 08.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం చిత్త సాయంత్రం 04.28 వరకు ఉపరి స్వాతి యోగం పరిఘ మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శివ కరణం తైతుల ఉదయం 07.45...

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News