Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

భారత్–ఈయూ ఒప్పందం-బహుళప్రయోజనాలు!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలతో ప్రపంచ వాణిజ్యం గందరగోళంలో పడింది. తక్షణ, దుందుడుకు ఆర్థిక విధానాలు, వీసాల కట్టడులు, వాణిజ్య నియంత్రణలు గ్లోబల్ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టాయి. ఒకవైపు అమెరికా టారిఫ్‌ల దూకుడు, మరోవైపు చైనా ఆధిపత్య కాంక్షల మధ్య ప్రపంచ దేశాలు కొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు.

2007లో యూపీఏ హయాంలో మొదలైన భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు, వివిధ కారణాలతో నిలిచిపోయాయి. తిరిగి 2022లో చర్చలు పునఃప్రారంభమై, ఇప్పుడు ఫలితానికి చేరాయి. గ్రీన్‌లాండ్ పై ట్రంప్ వ్యవహారశైలి, “అమెరికా లేకుంటే యూరప్‌కు విలువే లేదు” అన్న వ్యాఖ్యలు, టారిఫ్‌లతో బెదిరింపులు యూరోపియన్ యూనియన్‌ను భారత్ వైపు వేగంగా నడిపించాయి. మరోవైపు భారత్ కూడా ఆచితూచి, పరస్పర సహకార విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలతో సయోధ్యకు ప్రయత్నిస్తోంది.

కొన్ని రాజకీయ ఆరోపణలను పక్కనపెడితే, వాస్తవానికి ప్రస్తుత గ్లోబల్ పరిణామాల్లో అమెరికాను ప్రత్యక్షంగా ఎదిరించే పరిస్థితి భారత్‌కు లేదు. వాణిజ్యం, పెట్టుబడులు మాత్రమే కాదు. లక్షలాది భారతీయుల జీవనాధారం అమెరికాతో ముడిపడి ఉంది. అందుకే ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు అడుగులు వేయడం భారతావనికి తప్పనిసరి. ఆ దిశలో ఈయూ ఒప్పందం ఎడారిలో ఒయాసిస్‌లాంటిదని చెప్పాలి.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో యూరప్ దేశాలకు భారత్ ఎగుమతి చేసే అనేక ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల భారత ఎగుమతిదారులకు దీర్ఘకాలిక లాభాలు చేకూరతాయి. అదే సమయంలో యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, కీలక ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుని, వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను భారత్–ఈయూ ఆమోదించాయి.

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా, భారత్–ఈయూ ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం. ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతుకు ఇది సమానం. యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలు తమ దేశీయ చట్టాలను పూర్తి చేసిన తర్వాత ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టే అవకాశముంది.

ఈ ఒప్పందంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఆటోమొబైల్ రంగం. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ 125% వరకు సుంకాలు విధిస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం ఇవి మొదట 40 శాతానికి, తర్వాత దశలవారీగా 10 శాతానికి తగ్గనున్నాయి. దీనివల్ల బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్, లాంబోర్గిని, పోర్షే వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా భారత్ నుంచి యూరప్‌కు ఎగుమతి అయ్యే కార్లపై అక్కడి సుంకాలు కూడా తగ్గనుండటంతో భారత ఆటో రంగానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

ఫార్మా రంగంలోనూ ఈ ఒప్పందం కీలకం. క్యాన్సర్, బరువు తగ్గించే మందులు వంటి కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై సుంకాలు తగ్గడం వల్ల భారత ఫార్మా కంపెనీలకు లాభం చేకూరుతుంది. విమానాలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గడంతో వినియోగదారులకు ధరల ఉపశమనం లభిస్తుంది.
ఇక భారత్ నుంచి యూరప్‌కు వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశముంది. విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో భారత యువతకు యూరప్‌లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. గ్రీన్ హైడ్రోజన్, శాస్త్ర సాంకేతిక భాగస్వామ్యం, డిజిటల్ కనెక్టివిటీ వంటి రంగాల్లోనూ సహకారం బలపడనుంది.

మొత్తానికి, అమెరికా టారిఫ్‌ల బెడద నుంచి ఉపశమనానికి, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, భారత ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అందిపుచ్చుకునేందుకు భారత్–ఈయూ ఒప్పందం ఒక చారిత్రక ముందడుగు. ప్రపంచంతో పోటీ పడుతూ భారత్ తన ఆర్థిక శక్తిని మరింత బలపర్చుకునే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News