Friday, June 26, 2026
26.2 C
Hyderabad

కేసీఆర్…తీన్మార్!|KCR|ASSEMBLY

ముచ్చటగా మూడో‘సారీ!’
అలా వచ్చారు! ఇలా వెళ్ళారు!!
2వ తేదీన మళ్ళీ సారొస్తారా?

కేసీఆర్ సారు… అసెంబ్లీకి అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు. గత రెండేళ్ళల్లో రెండుసార్లు, ముచ్చటగా ఇది మూడో‘సారీ!’… కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ప్రభుత్వం పట్టుపట్టడం, ఆయన అలా రావడం. ఇలా వెళ్ళడం పరిపాటైంది. కానీ, గతానికి భిన్నంగా ఈ సారి కేసీఆర్, ‘తోలు తీస్తా… నేనే రంగంలోకి దిగుతా’నని అసెంబ్లీ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రభుత్వానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కానీ, యథావిధిగా ఆయన వెనక్కి వెళ్ళారు. తిరిగి ఆయన ఈ సమావేశాలకు 2వ తేదీన మళ్ళీ వస్తారా? నీళ్ళపై నిజానిజాల నిగ్గు తేల్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా?

హైదరాబాద్, డిసెంబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో ఏడాది మొదటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్, అందరికంటే ముందే వచ్చారు. కొద్దిసేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనకు కేటాయించిన సీట్లో కూర్చుకున్నారు. సభలో ప్రార్థనా గీతం, అనంతరం సంతాప తీర్మానాలు ముగిసి, సభ మొదలవుతుండగానే వెనుదిరిగారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇలా రావడం, అలా వెళ్ళడం కొత్తేమీ కాదు. కానీ, గతానికి భిన్నంగా ఈ సారి సభలో ప్రభుత్వం తోలు తీస్తా. నీళ్ళపై నిలదీస్తా… ప్రాజెక్టులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఉరిమారు. తానే ముందుండి నడుపుతామని చెప్పారు. కానీ, పాత పద్ధతిలోనే తిరిగి వెళ్ళారు.
కేసీఆర్ సభ నుంచి వెళ్ళిన అంశం మాత్రం తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. అధికారపక్షంపై, ప్రభుత్వంపై రాజకీయ యుద్ధానికి సిద్ధమని జంగు సైరన్ ఊదిన కేసీఆర్, ‘అలా వచ్చి, ఇలా వెళ్ళిపోయే’ వైఖరి సహజంగానే ప్రశ్నలను రేపుతోంది.

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత పరిపాలన, విధి విధానాల రూపకల్పన వేదిక. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, లోపాలు వంటివన్నీ అక్కడే చర్చకు వస్తాయి. 1983 మిహనా, 1985 నుండి నేటి వరకు ఓటమి ఎరుగని నేతగా, కేసీఆర్ ది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు పాలనపై పట్టు అపారం. రాజకీయ వ్యూహాల దిట్ట. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ఉండటం ప్రతిపక్షానికి మాత్రమే కాదు, ప్రజలకు కూడా మేలు చేస్తుంది.

‘ప్రభుత్వాన్ని నిలదీస్తా’, ‘ప్రజల పక్షాన అసెంబ్లీని దద్దరిల్లేలా చేస్తా’, ‘నేనే ముందుండి పోరాడతా’నన్న కేసీఆర్, ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు? ఆయన మాటలకు చేతలకు పొంతన ఎందుకు లేదు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా నిలుస్తోంది.

కొందరు బీఆర్ఎస్ మద్దతుదారులు దీనిని వ్యూహాత్మక నిర్ణయంగా సమర్థించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ప్రస్తుత సభా వాతావరణం అనుకూలంగా లేద’ని, ‘ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వడం లేద’ని, ‘సభను ప్రభుత్వమే దిగజార్చింద’ని వాదిస్తున్నారు. ఇవన్నీ సాధారణ రాజకీయ విమర్శలే. అయినా, సభలో ఉండి పోరాడితేనే ఈ వాదనలకు బలం చేకూరుతుంది.

ప్రతిపక్ష పాత్ర కేవలం బయట విమర్శించడమే కాదు, సభలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయడం, ప్రజల సమస్యలను లేవనెత్తడం, విధానపరమైన ప్రత్యామ్నాయాలను సూచించడం. ఈ తరహా వ్యవహార శైలి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. మరి ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడం, లేదా దూరంగా ఉండడం, ప్రజలకు తప్పుడు సంకేతాల్ని ఇస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడి నుంచి ప్రజలు ఆశించేది రాజకీయ పరిపక్వత, స్థిరత్వం, నిలకడైన పోరాటం.

ప్రస్తుత కేసీఆర్ వైఖరి ఆయన వ్యక్తిగతం కావచ్చు. కానీ, అది బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ప్రతిపక్షం పారిపోయింది. మమ్మల్ని ఎదుర్కోనే ధైర్యం లేదు’ వంటి ఆరోపణలు రాజకీయంగా సహజమే. కానీ ఈ ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతదే. రాజకీయ పోరాటం బయట మాటలతో కాదు, లోపల నిలబడి చేసే వాదనలతో గెలవాలి. నిజానికి మాటలకంటే చేతలే రాజకీయ నాయకుడి నిజమైన బలమని గుర్తించాలి.

Latest News

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

జూన్ 24, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి రాత్రి 08.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం చిత్త సాయంత్రం 04.28 వరకు ఉపరి స్వాతి యోగం పరిఘ మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శివ కరణం తైతుల ఉదయం 07.45...

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News