Wednesday, April 8, 2026
35.2 C
Hyderabad

ఎన్డీఎ పక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యమేది!?|EDITORIAL

పేరుకే జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డిఎ). పరిపాలన మొత్తం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీదే. ఇంకా చెప్పాలంటే మోడీదే. వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కారణమైన ఎన్‌డిఎ పక్షాల పాత్ర పరిమితంగానే కనిపిస్తోంది. విధానపరమైన నిర్ణయాలలో, పరిపాలనలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు పెద్దగా భాగస్వామ్యం ఉన్నట్లుగా లేదు. సమిష్టి నిర్ణయాలు, ఆలోచనలు లేవు. గతంలో వాజ్‌పేయి హయాంలో తరచూ ప్రధాన అంశాలపై చర్చించేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎన్‌డిఎ పక్షాలు కూడా ఇదేమిటని అడిగే ధైర్యం చేయడం లేదు. చంద్రబాబు లౌక్యంగా ఏపీకి, నితీశ్‌ కుమార్‌ బీహార్‌కు పరిమితం అయ్యారు. వారి రాష్ట్రాలకు నిధులు సమకూర్చుకోవడంలో ఉన్న ఆసక్తి, ప్రజల సంక్షేమంపై మాత్రం లేదు. వ్యవసాయ జాతీయ విధానం వంటి అంశాలను పట్టించుకోవడం లేదు.

విద్య, వైద్యం, మౌళిక వసతులు, రోడ్లు తదితర అంశాల పై జాతీయస్థాయిలో చర్చించి ప్రజలకు అనువైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కేవలం డవ్మిూ పాత్ర పోషిస్తున్నాయి. విద్యారంగంలో మార్పులు రావాల్సి ఉంది. ఇప్పుడున్న విద్యావిధానం ఉద్యోగాలను, ఉపాధిని చూపడం లేదు. విదేశాలకు వెళ్లి చదువుకుందామనుకుంటే ఖరీదైనదిగా ఆమరింది. విద్యారంగ సంస్కరణలు రావాలి. విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. పెరిగిన డాలర్‌ విలువ, రూపాయి పతనంతో విదేశీ మారకం కోసం విద్యార్థులు, టూరిస్టులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటున్న ప్రధాని మోడీ కనీసం ఆడపిల్లల చదువుల ఖర్చుల గురించి ఆలోచించడం లేదు.

దేశీయంగా, విదేశీయంగా కూడా చదువులు భారంగా మారాయి. విదేశాలకు వెళుతున్న ఆడపిల్లలకు కనీసం వడ్డీ మాఫీ పథకం వర్తింప చేయాలన్న డిమాండ్‌ పట్టించు కోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వడ్డీలేని రుణాలను లేదా నామమాత్రం వడ్డీతో దేశీయంగా, విదేశాల్లో ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించేలా పథకాలు రూపొందాల్సి ఉంది. కార్పోరేట్‌ కంపెనీలకు వేలకోట్లు పందేరం చేస్తున్న ప్రభుత్వం విద్యారంగంలో మాత్రం వెసలుబాటు చూపడం లేదు. బ్యాంకులు కూడా రకరకాల కొర్రీల గ్యారెంటీతోనే వడ్డీ రుణాలు అందిస్తున్నాయి.

మరోవైపు భారత ఆర్థికవ్యవస్థ కుదేలు కావడంతో పాటు, ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు అందనంత ఎత్తున ఉన్నాయి. వైద్య సేవలు భరించలేనంత భారంగా పెరిగాయి. కార్పోరేట్‌ ఆస్పత్రుల దోపిడీతో సామాన్యులు అప్పుల పాలవుతున్నారు. మందుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నా పట్టించుకోవడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కూడా ఎప్పటికప్పుడు పెంచడంతో సామాన్యుల బతుకు భారంగా మారుతోంది. పన్నుల భారం మోయలేక ప్రజల నడ్డి విరుగుతున్నది. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థికరంగాన్ని నిలబెట్టేలా లేవు. ఎడాపెడా పన్నులు విధించడంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఊపిరాడని స్థితికి చేరింది.

ఇదంతా ఒక ఎత్తయితే విదేశీ డాలర్‌ మారకం తీరని భారంగా మారింది. ఉన్నత చదువులకు వెళ్లాల నుకునే వారికి డాలర్‌ మారకం 86 రూపాయలకు పైనే కావడంతో తట్టుకోలేక పోతున్నారు. ఫీజులను డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఫీజల భారం తడిసి మోపెడు అవుతోంది. డబ్బున్నవాళ్లే చదువుకునేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి వాళ్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితితులు కానరావడం లేదు.

ఇలాంటి సమస్యలను ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చర్చించాలి. ఇక్కడ ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ పూర్తి చేసి, ఇతర డిగ్రీలతో విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి ప్రధానంగా రెండు సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకటి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బ్యాంకులు సజావుగా స్పందించడం లేదు. డబ్బున్న వారికి రుణాలు అందుతున్నాయి. కానీ పేదలు, మధ్య తరగతి వారికి రుణాలు ఇవ్వడం లేదు. రెండోది రుణం పొందినా.. దాని వడ్డీ రేటు అధికంగా ఉంటోంది. విదేశాలకు వెళ్లి, చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం సంపాదించి వచ్చే సరికి రుణభారం మోయలేనంతగా పెరుగుతోంది. దీంతో సంపాదన అంతా చదువుకోసం తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించడానికే సరిపోతుంది. దీనికి తోడు విదేశీయానం కూడా భారంగా మారింది. ఇంధన ధరల వల్ల విమానరంగం టిక్కెట్లను అమాంతంగా పెంచేసింది. దీంతో అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకున్న వారికి టిక్కెట్లు భారంగా మారాయి.

విదేశీ విద్య కావచ్చు, దేశీయంగా చదువుకునే విద్య కావచ్చు..సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు స్వశక్తివిూద బతికేలా చేయాలి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రుణాలను ఉదరాంగా ఇచ్చేలా చూడాలి. అప్పుడే మన యువత తమకాళ్లవిూద తాము నిలబడగలుగుతారు. దేశీయంగా ఉన్నత చదువులు చదివే వారికి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారి కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకులు నామమాత్రపు గ్యారెంటీతో, నామమాత్రపు వడ్డీతో రుణాలు ఇచ్చేలా విధానాలు సరళీకరించాలి. అందుకు కేద్రం వడ్డీ భరించే పథకాన్ని ప్రవేశ పెడితే మరీ మంచిది. ఇలాంటి సమస్యలపై చర్చించే ధైర్యం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చేయకపోవడం దారుణం.

Latest News

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

బట్టల మీద బూరును సాఫ్ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

సూటూ, బూటూ గదేనుల్లా... బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది....

కెజి బేసిన్ – మన గ్యాస్ మన హక్కు!|EDITORIAL

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం మన దేశంతోపాటు అన్ని దేశాలపైనా,...

07-04-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి మధ్యాహ్నం 01.49 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.21 వరకు ఉపరి మూల యోగం వ్యతీపాత మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల మధ్యాహ్నం...

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News