Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

ప్రభుత్వ సంక్షోభ హాస్టళ్ళు!|EDITORIAL

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అమ్మాయిలైతే బలవంతపు అత్యాచారాలకు గురవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం మండల కేంద్రంలోగల గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇద్దరు బాలికలు చనిపోవడం, 138 మంది పచ్చ కామెర్లతో హాస్పిటల్ పాలు కావడం సంక్షేమ హాస్టళ్ళలోని పరిస్థితులకు, నిర్వహణా తీరుకు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు అద్దం పడుతున్నది. క్వాంటం కంప్యూటింగ్‌, ఎఐ అంటూ నిత్యం వల్లె వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ హాస్టళ్ళ దుస్థితి కనిపించకపోవడం దురదృష్టకరం.

గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో ఎక్కువ శాతం కనీస సౌకర్యాల లేవు. బాలికల వసతి గృహాలు సరిపడినన్ని లేక, ఉన్నవి అత్యంత దయనీయంగా వున్నాయి. బోధన, వసతి, సదుపాయాలు అన్నింటికీ ఒకటి రెండు గదులతో సరిపుచ్చు తున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎ.ఎన్‌.ఎం లు లేరు. గురుకులాలలో ఉన్నప్పటికీ తగిన మందులు, సౌకర్యాలు లేవు.

పాలకులు మారుతున్నా పరిస్థితులు మారడం లేదు. వార్డెన్‌ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన లేనందున ఉపాధ్యాయులే ఒకవైపు బోధన మరోవైపు, పిల్లల బాధ్యత చూస్తున్నారు. మెడికల్‌ ఖర్చు భరించేందుకు తగిన నిధిని సమకూర్చడం లేదు. పిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు గాని, టీచర్లు గాని ప్రత్యేకంగా లేకపోవడం వల్ల పిల్లల మానసిక, శారీరక, విద్యా, వైద్య తదితర అంశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
సరైన ఆహారం ఉండదు. సరైన వసతి ఉండదు. నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలతో పిల్లలు హాస్పిటల్స్ పాలు కావడం, అందులో కొందరు మృత్యువాత పడడం, తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు అధ్వాన్నంగా ఉన్నాయి. గత పాలన, పదేళ్ళ పాలన, ప్రస్తుత పాలనలో చర్విత చరణంగా అవే తప్పులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, ప్రతిపక్షంలోకి రాగానే గగ్గోలు పెట్టడం మన పాలకులకు అలవాటైపోయింది. ఏపీలోనూ ఇదే తతంగం నడుస్తోంది. విద్య, వైద్యానికి పెద్దపీట వేయాల్సిన పాలకులు ఓట్‌ బ్యాంకు రాజకీయాలతో సంక్షేమ, ఉచిత పథకాలను కొనసాగిస్తున్నారు.

మారుమూల అటవీ ప్రాంత గిరిజనులకు అక్షరాస్యత అందించాలనే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 గిరిజనులకు విద్య, రక్షణ, సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. గిరిజనుల విద్య కోసం ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పి గాలికి వదిలేస్తున్నారు. గిరిజనుల వైద్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. నేటికీ డోలీల్లో సుదూర ప్రాంతాలకు వైద్యానికి గిరిజనులు వెళుతున్నారు. మన్నానికి జ్వరమొచ్చిందనే వార్తాలు ఇంకా వస్తూండటం పాలకులకు సిగ్గుచేటు. షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రకటించింది. అయినా వారి గూడాలకు నేటికీ రోడ్డు లేదు. చదువు, వైద్యం లేదు. ఈ నిర్లక్ష్యం సంక్షేమ హాస్టళ్ళపై కూడా కొనసాగుతున్నది. ఆశ్రమ పాఠశాలల్లో తాగునీరు లేక, మరుగుదొడ్లు లేక రోగాల బారినపడి చనిపోయిన ఘటనలను చూస్తున్నాం.

నిజానికి గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందివ్వాలి. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టాలి. బడులు లేక, ఉన్నా బడుల్లో టీచర్లు లేక, అసంపూర్ణ భవనాలు, చాలీచాలని వసతుల దుస్థితికి స్వస్తి పలకాలి. విష జ్వరాలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి అనారోగ్యాలతో పిల్లలు పిట్టల్లా రాలిపోవడాన్ని తక్షణమే అరికట్టాలి. ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పోషక విలువలతో కూడిన మెనూ చార్జీల పెంపునకు నిధులు ఇవ్వాలి. భావి భారత ఆశాకిరణాలైన పిల్లల భవిష్యత్తుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆ భావి భారతాన్ని నేటి నుంచే తీర్చిదిద్దడం మొదలు పెట్టాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News