Thursday, June 25, 2026
28.4 C
Hyderabad

ప్రభుత్వ సంక్షోభ హాస్టళ్ళు!|EDITORIAL

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అమ్మాయిలైతే బలవంతపు అత్యాచారాలకు గురవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం మండల కేంద్రంలోగల గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇద్దరు బాలికలు చనిపోవడం, 138 మంది పచ్చ కామెర్లతో హాస్పిటల్ పాలు కావడం సంక్షేమ హాస్టళ్ళలోని పరిస్థితులకు, నిర్వహణా తీరుకు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు అద్దం పడుతున్నది. క్వాంటం కంప్యూటింగ్‌, ఎఐ అంటూ నిత్యం వల్లె వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ హాస్టళ్ళ దుస్థితి కనిపించకపోవడం దురదృష్టకరం.

గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో ఎక్కువ శాతం కనీస సౌకర్యాల లేవు. బాలికల వసతి గృహాలు సరిపడినన్ని లేక, ఉన్నవి అత్యంత దయనీయంగా వున్నాయి. బోధన, వసతి, సదుపాయాలు అన్నింటికీ ఒకటి రెండు గదులతో సరిపుచ్చు తున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎ.ఎన్‌.ఎం లు లేరు. గురుకులాలలో ఉన్నప్పటికీ తగిన మందులు, సౌకర్యాలు లేవు.

పాలకులు మారుతున్నా పరిస్థితులు మారడం లేదు. వార్డెన్‌ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన లేనందున ఉపాధ్యాయులే ఒకవైపు బోధన మరోవైపు, పిల్లల బాధ్యత చూస్తున్నారు. మెడికల్‌ ఖర్చు భరించేందుకు తగిన నిధిని సమకూర్చడం లేదు. పిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు గాని, టీచర్లు గాని ప్రత్యేకంగా లేకపోవడం వల్ల పిల్లల మానసిక, శారీరక, విద్యా, వైద్య తదితర అంశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
సరైన ఆహారం ఉండదు. సరైన వసతి ఉండదు. నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలతో పిల్లలు హాస్పిటల్స్ పాలు కావడం, అందులో కొందరు మృత్యువాత పడడం, తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు అధ్వాన్నంగా ఉన్నాయి. గత పాలన, పదేళ్ళ పాలన, ప్రస్తుత పాలనలో చర్విత చరణంగా అవే తప్పులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, ప్రతిపక్షంలోకి రాగానే గగ్గోలు పెట్టడం మన పాలకులకు అలవాటైపోయింది. ఏపీలోనూ ఇదే తతంగం నడుస్తోంది. విద్య, వైద్యానికి పెద్దపీట వేయాల్సిన పాలకులు ఓట్‌ బ్యాంకు రాజకీయాలతో సంక్షేమ, ఉచిత పథకాలను కొనసాగిస్తున్నారు.

మారుమూల అటవీ ప్రాంత గిరిజనులకు అక్షరాస్యత అందించాలనే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 గిరిజనులకు విద్య, రక్షణ, సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. గిరిజనుల విద్య కోసం ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పి గాలికి వదిలేస్తున్నారు. గిరిజనుల వైద్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. నేటికీ డోలీల్లో సుదూర ప్రాంతాలకు వైద్యానికి గిరిజనులు వెళుతున్నారు. మన్నానికి జ్వరమొచ్చిందనే వార్తాలు ఇంకా వస్తూండటం పాలకులకు సిగ్గుచేటు. షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రకటించింది. అయినా వారి గూడాలకు నేటికీ రోడ్డు లేదు. చదువు, వైద్యం లేదు. ఈ నిర్లక్ష్యం సంక్షేమ హాస్టళ్ళపై కూడా కొనసాగుతున్నది. ఆశ్రమ పాఠశాలల్లో తాగునీరు లేక, మరుగుదొడ్లు లేక రోగాల బారినపడి చనిపోయిన ఘటనలను చూస్తున్నాం.

నిజానికి గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందివ్వాలి. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టాలి. బడులు లేక, ఉన్నా బడుల్లో టీచర్లు లేక, అసంపూర్ణ భవనాలు, చాలీచాలని వసతుల దుస్థితికి స్వస్తి పలకాలి. విష జ్వరాలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి అనారోగ్యాలతో పిల్లలు పిట్టల్లా రాలిపోవడాన్ని తక్షణమే అరికట్టాలి. ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పోషక విలువలతో కూడిన మెనూ చార్జీల పెంపునకు నిధులు ఇవ్వాలి. భావి భారత ఆశాకిరణాలైన పిల్లల భవిష్యత్తుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆ భావి భారతాన్ని నేటి నుంచే తీర్చిదిద్దడం మొదలు పెట్టాలి.

Latest News

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

జూన్ 24, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి రాత్రి 08.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం చిత్త సాయంత్రం 04.28 వరకు ఉపరి స్వాతి యోగం పరిఘ మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శివ కరణం తైతుల ఉదయం 07.45...

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

జూన్ 23, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 07.28 వరకు ఉపరి దశమి నక్షత్రం హస్త మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి చిత్త యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.02 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 07.26...

జూన్ 22, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 07.26 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 02.37 వరకు ఉపరి హస్త యోగం వ్యతీపాత మధ్యాహ్నం 03.02 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం 07.41...

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP -బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP -జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News