Wednesday, June 24, 2026
24.9 C
Hyderabad

జనాభా-రాజకీయావసరమా? సామాజికావసరమా!?|EDITORIAL

దేశాభివృద్ధి మానవ గణాంకాలలో కాదు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిలో ఉంటుంది. జనాభా పెంపు రాజకీయ అవసరమా? సామాజిక అవసరమా? ముందుగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోవడం, భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనను ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే కాదు, దక్షిణ భారత దేశంలోని రాజకీయ నేతలు, రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు ఇంచుమించు ఇంతే కావచ్చు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత కోణంలో బాబు బాధను అర్థం చేసుకోవచ్చు. అయితే, అంతకంటే కీలకం… ప్రస్తుతం ఉన్న జనాభాకే సరిపడా మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు దేశంలో అందుబాటులో ఉన్నాయా? ఇవేవీ ఇవ్వలేని దేశంలో జనాభా మరింత పెరిగితే సంభవించే సమస్యలకు పరిష్కారాలేంటి?

భారత్ ప్రస్తుతం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. అయినప్పటికీ కోట్లాది మంది ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సేవలు, గృహ వసతి, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, స్థిర ఉపాధి కోసం ఇంకా పోరాడుతున్నారు. జనాభా పెంపుపై ప్రోత్సాహకాలు ప్రకటించే ముందు ఈ వాస్తవాలను ప్రభుత్వాలు నిజాయితీగా అంగీకరించాల్సిన అవసరం ఉంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5, 2019-21 ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0కు పడిపోయింది. జనాభా స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన ‘రిప్లేస్‌మెంట్ లెవల్’ 2.1గా పరిగణిస్తారు. అంటే దేశం ఇప్పటికే సహజ జనాభా నియంత్రణ దశలోకి ప్రవేశించింది. మహిళల విద్యాభివృద్ధి, పట్టణీకరణ, ఆరోగ్య సేవల విస్తరణ, కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన కారణంగా ఈ మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో జననాల రేటు ఇప్పటికే రిప్లేస్‌మెంట్ స్థాయి కంటే తక్కువగా ఉంది.

జనాభా పెంచాలని పిలుపునిచ్చే ముందు యువత పరిస్థితిని పరిశీలించాలి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే-2023-24) ప్రకారం దేశ నిరుద్యోగ రేటు 3.2 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 5.1 శాతానికి చేరుకుంది. మరోవైపు, ఉద్యోగాల్లో ఉన్నవారిలో కూడా పెద్ద శాతం అసంఘటిత రంగంలో, తక్కువ ఆదాయంతో, భద్రతలేని పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. శాశ్వత ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, నైపుణ్యాలకు సరిపడే ఉద్యోగాలు లేకపోవడం యువతను తీవ్ర అనిశ్చితిలోకి నెడుతోంది.

ఇక ఆరోగ్య రంగ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో పోలిస్తే భారతదేశ ప్రభుత్వ ఆరోగ్య వ్యయం ఇంకా తక్కువగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలిపిన ప్రజా ఆరోగ్య వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 2% పరిధిలోనే కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, అత్యవసర సేవల కొరత ఇప్పటికీ తీవ్ర సమస్యగానే ఉంది. గర్భిణీ స్త్రీలను వైద్యశాలలకు తరలించేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరింత మంది పిల్లలను కనమని ప్రోత్సహించడం కన్నా మాతా-శిశు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరం.

ఈ విధానాల ప్రభావం మహిళలపై ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదు. భారత సమాజంలో మహిళలు ఇప్పటికే వివాహం, సంతానం, కుటుంబ బాధ్యతల విషయంలో తీవ్రమైన సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జనాభా పెరుగుదలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా ఆ ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో మహిళల ఆరోగ్యం, విద్య, ఉద్యోగ అవకాశాల కంటే సంతానోత్పత్తికే ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంటుంది.

జనాభా పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందనడం సరైన వాదన కాదు. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల అనుభవం చెబుతున్నది ఏమిటంటే జనాభా సంఖ్య కంటే మానవ వనరుల నాణ్యతే ఆర్థికాభివృద్ధికి కీలకం. విద్యావంతులు, ఆరోగ్యవంతులు, నైపుణ్యాలు కలిగిన యువతే దేశ సంపద. జనాభా పెరిగినా వారికి సరైన విద్య, వైద్యం, ఉపాధి లేకపోతే అది అభివృద్ధికి కాకుండా అసమానతలకు, నిరుద్యోగానికి, సామాజిక అస్థిరతకు దారితీస్తుంది.

ప్రభుత్వాలు, రాజకీయ నేతలు నిజంగా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తే ముందుగా ప్రతి గ్రామంలో నాణ్యమైన పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, పోషకాహార కార్యక్రమాలు, మహిళల భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించాలి. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ హామీ, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సరసమైన గృహ వసతి కల్పించే దిశగా పెట్టుబడులు పెట్టాలి. పిల్లలను కనమని చెప్పడం కంటే ప్రతి పుట్టే బిడ్డకు గౌరవప్రదమైన జీవితం హామీ ఇవ్వడం ప్రభుత్వాల అసలు బాధ్యత.

దేశాభివృద్ధి మానవ గణాంకాలలో కాదు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిలో ఉంటుంది. జనాభా పెంపు రాజకీయ అవసరమా? సామాజిక అవసరమా? ముందుగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.

Latest News

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

జూన్ 24, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి రాత్రి 08.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం చిత్త సాయంత్రం 04.28 వరకు ఉపరి స్వాతి యోగం పరిఘ మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శివ కరణం తైతుల ఉదయం 07.45...

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

జూన్ 23, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 07.28 వరకు ఉపరి దశమి నక్షత్రం హస్త మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి చిత్త యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.02 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 07.26...

జూన్ 22, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 07.26 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 02.37 వరకు ఉపరి హస్త యోగం వ్యతీపాత మధ్యాహ్నం 03.02 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం 07.41...

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP -బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP -జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా...

సిమిటి, అస్తర్కార్ లేకుండనే గోడలు?!|ADUGU TRENDS

ఇల్లు కట్టి సూడు, పెండ్లి శేసి సూడన్నరు. గయి రెండంటే గంత కట్టమన్నట్లు.? పెండ్లంటే గిప్పట్ల సిడెంల అయిపోతానయి గనీ, గీ ఇండ్లంటేనే గవాటి టైం గయి తీసుకుంటయి. మట్టి, సిమెంటు, ఇటికె,...

సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం యోగా!|EDITORIAL

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 21 నుండి జూన్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News