Wednesday, June 24, 2026
25.1 C
Hyderabad

నిర్వాసితుల గోడు!|EDITORIAL

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.

గంగవరం పోర్టు కోసం త్యాగం చేసిన మత్స్యకారులు ఉపాధి కోల్పోయి నిండా మునిగారు. అదే పోర్టును దక్కించుకున్న ఆదానీ మాత్రం ఒడ్డున పడ్డారు. ఇదే నమూనా తెలంగాణలోనూ పునరావృతమైంది. కేసీఆర్‌ హయాంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల భూములు, గ్రామాలు త్యాగం చేసిన రైతులు, ప్రజలు ఆగమయ్యారు. కానీ పాలకులూ, వారి అనుచరుల భూములు మాత్రం నీటితో పచ్చగా కళకళలాడతున్నాయి.

అమరావతి రాజధాని పేరుతో లక్ష ఎకరాలకు పైగా భూసేకరణ జరిగింది. రైతులు ఇచ్చిన త్యాగాలకు తగిన పరిహారం లభించిందా? ప్లాట్లు సక్రమంగా అందాయా? అంటే సమాధానం లేదు. బహిరంగంగా ప్రశంసలు కురిపించడం తప్ప రైతులకు వాస్తవ లబ్ధి చేకూరలేదు. ఇంకా ప్లాట్ల కోసం రైతులు పాట్లు పడుతూనే ఉన్నారు. అయినా పాలకుల భూదాహం తీరలేదు. ఇప్పుడు రెండో దఫా భూసేకరణ మొదలైంది. ఈ అభివృద్ధి ఎవరి కోసం అన్న ప్రశ్నకు పాలకులు నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన సమయం ఇది.

పోలవరం ప్రాజెక్టు పరిస్థితి మరింత విషాదకరం. దేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రాజెక్టుగా చెప్పుకునే పోలవరం నిర్వాసితులు నేటికీ దుర్భర జీవితం గడుపుతున్నారు. 1.20 లక్షల కుటుంబాలు ముంపు ముప్పులో ఉండగా, వారికి న్యాయమైన పరిహారం, సమగ్ర పునరావాసం ఇప్పటికీ అందలేదు. భూమికి భూమి లేదు. ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అమలు కాలేదు. నిర్మించిన పునరావాస కాలనీల్లో వర్షం పడితే ఇళ్లు నీళ్ళల్లో తేలుతున్నాయి. నిలువునా కారుతున్నాయి. శ్మశానాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు వంటి కనీస సదుపాయాలే లేవు.

1986, 2022 వరదల అనుభవం ముంపు ప్రాంతాల స్థితిగతులను కళ్ళకు కట్టినా, పాలకులు వాస్తవాన్ని గ్రహించడం లేదు. కాంటూరు సర్వేలు, లైడార్‌ సర్వేలు వాస్తవాలను ప్రతిబింబించలేదని నిర్వాసితులు చెబుతున్నారు. అయినా తాజా పరిహారం 2017కు ముందు అంచనాల ఆధారంగానే చెల్లిస్తున్నారు. డ్యామ్‌ అంచనాలు రెండుసార్లు పెరిగినా, నిర్వాసితుల ప్యాకేజీ మాత్రం పెరగలేదు. పెళ్లయిన యువతులకు పునరావాస హక్కులు నిరాకరించడం, మహిళలకు పురుషులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వకపోవడం తీవ్రమైన అన్యాయం.

గతంలో ఏపీ సీఎం జగన్ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించినా, అది కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అయినా తాజా ధరలకు అనుగుణంగా ప్యాకేజీ సవరించి అమలు చేస్తుందేమోనని నిర్వాసితులు ఆశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. డ్యామ్‌ పనులను పరిశీలించిన సీఎం, ముంపు ప్రాంతాలు, పునరావాస కాలనీలను సందర్శించి ఉంటే సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండేది.

మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం చేస్తామని లక్ష్యాలు ప్రకటిస్తున్నారు. కానీ నిర్వాసితులకు న్యాయం జరగకుండానే ప్రాజెక్టు పూర్తయితే అది అభివృద్ధి ఎలా అవుతుంది? డ్యామ్‌ను దశలవారీగా కాకుండా పూర్తి ఎత్తు వరకూ ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తయ్యాకనే నిర్మించాలన్న నిర్వాసితుల డిమాండ్ న్యాయమైనదే. డయాఫ్రం వాల్‌ నాణ్యత లోపాల వల్ల దెబ్బతిన్న విషయం విదేశీ నిపుణులే నిర్ధారించారు. అయినా నివేదికను బహిరంగపర్చలేదు. అదనంగా రూ.900 కోట్లు వెచ్చించారు. కానీ, బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు లేవు. అవకతవకలపై పారదర్శక విచారణ జరగాలి.

అభివృద్ధి అంటే ప్రజలను ముంచి నిర్మించే కాంక్రీట్‌ నిర్మాణాలు కాదు. ప్రజల జీవన భద్రత, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణే నిజమైన అభివృద్ధి. హెలికాప్టర్‌ పర్యటనలు, తీయని మాటలు తగ్గించి, నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వాల తొలి కర్తవ్యం కావాలి. మరి ప్రభుత్వాలు, పాలకులు ఆ దిశగా ఆలోచిస్తారా? నిర్వాసితులకు నిజంగా సాయంగా నిలబడతారా? ప్రజల త్యాగాల పునాదుల మీద నిర్మితమవుతోన్న ప్రాజెక్టుల ఫలాలను వారికే దక్కనిస్తారా?

Latest News

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

జూన్ 23, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 07.28 వరకు ఉపరి దశమి నక్షత్రం హస్త మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి చిత్త యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.02 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 07.26...

జూన్ 22, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 07.26 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 02.37 వరకు ఉపరి హస్త యోగం వ్యతీపాత మధ్యాహ్నం 03.02 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం 07.41...

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP -బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP -జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా...

సిమిటి, అస్తర్కార్ లేకుండనే గోడలు?!|ADUGU TRENDS

ఇల్లు కట్టి సూడు, పెండ్లి శేసి సూడన్నరు. గయి రెండంటే గంత కట్టమన్నట్లు.? పెండ్లంటే గిప్పట్ల సిడెంల అయిపోతానయి గనీ, గీ ఇండ్లంటేనే గవాటి టైం గయి తీసుకుంటయి. మట్టి, సిమెంటు, ఇటికె,...

సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం యోగా!|EDITORIAL

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 21 నుండి జూన్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా...

జెర పెండ్లి శేసుకోరా…?!|ADUGU TRENDS

పెండ్లిల్లు సర్గంల అయితయి అని ఎందుకన్నరో గనీ, గీ భూమ్మీద మాత్రం లేటైతానయి. బహు కట్టమైతానయి. ఎవర్నడుగు దుర్బిణి యేసి సూసినా, ఆడి పిల్లలు అసలే దొరుకుతలేరంటాండ్రు. మన దగ్గర గిట్లుంటే, మరి...

సమగ్ర పంటల విధానమే రైతుకు రక్ష!|EDITORIAL

వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో లేదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో మాత్రమే ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్‌కు అవసరమైన...

జూన్ 20, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు షష్ఠి రాత్రి 10.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మఖ మధ్యాహ్నం 02.48 వరకు ఉపరి పుబ్బ యోగం వజ్ర సాయంత్రం 06.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ ఉదయం 09.34...

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News