Friday, June 19, 2026
34.3 C
Hyderabad

TODAY|నేడే విస్తరణ!|EXPANSION

SIX|ఆరు ఖాళీల్లో ప్రస్తుతం THREE|ముగ్గురికే అవకాశం
BC|బీసీ, SC|ఎస్సీ వర్గాలకే పరిమితం
VIVEK|వివేక్‌, ADLURI LAXMAN KUMAR|అడ్లూరి, VAKITI SRIHARI|వాకిటి శ్రీహరిలకు చోటు
RAJ BHAVAN|రాజ్ భవన్ లో ఏర్పాట్లకు ఆదేశం
AFTERNOON|మధ్యాహ్నం 12.15కు ముహూర్తం
CM|సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు
అందుబాటులో ఉండండని సీఎం ఆదేశాలు
మిగతా మూడు బెర్తులకూ ఖరారు…
కానీ, CONGRESS|కాంగ్రెస్ లో తకరారు
ఆఖరి క్షణం వరకూ చర్చోప చర్చలు… వీడని ఉత్కంఠ

హైదరాబాద్‌, జూన్‌ 7 (అడుగు న్యూస్):
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు- దక్కనుంది. ఆరు ఖాళీల్లో ప్రస్తుతం ముగ్గురికే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. బీసీ, ఎస్సీ వర్గాలకే విస్తరణను పరిమితం చేశారు. ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి వివేక్‌, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ కు చెందిన వాకిటి శ్రీహరిలకు చోటు దక్కనుంది.
ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.45కు ముహూర్తంగా నిర్ణయించారు. మరోవైపు సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు కలిసి తమకే అవకాశం ఇవ్వాలని అడిగారు. వాళ్ళంతా ఎవరికి అవకాశం వచ్చినా కలిసి ఉండాలని, అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. అయితే మిగతా మూడు బెర్తులకూ పేర్లు ఖరారు అయినప్పటికీ, ప్రస్తుతం ఆ మూడు ఖాళీల భర్తీతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడకూడదని, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తాత్కాలికంగా ఆ మూడు బెర్తుల భర్తీని నిలిపివేసినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ తరహా రాజకీయాల్లో భాగంగా ఆఖరి క్షణం వరకూ చర్చోప చర్చలు జరిగాయి. వీడని ఉత్కంఠ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు జరుగుతున్నది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏడాదిన్నరకు పైగా కేబినెట్‌ విస్తరణ జరగలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్న పరిస్థితి. ఇటీవల విూనాక్షీ నటరాజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్ గా నియమితులైన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్‌ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు-, ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సంకేతాలు ఇచ్చింది. నేడు మంత్రి వర్గ విస్తరణ జరగుతున్నది. రాజ్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

అనేక ఊహాగానాలు, మంత్రులుగా పదవులకు రేసులో నిల్చిన వాళ్ల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలించి చివరకు వడపోసింది. రేవంత్‌ రెడ్డి క్యాబినెట్లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు పదవులు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ముగ్గురిలో ఇద్దరు దళిత సామాజికవర్గానికి చెందిన వారు కాగా..ఒకరు బీసీ నేతకు క్యాబినెట్‌ ర్యాంక్‌ కల్పిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌తో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ రావు తో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రిపదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఈ క్యాబినెట్‌ విస్తరణ ప్రక్రియ అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలో మరో ముగ్గురికి కొత్త మంత్రులుగా చోటు దక్కింది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు ఉన్న మంత్రులతో పాటు మరికొందరికి అవకాశం కల్పించింది పార్టీ హైకమాండ్‌. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారిగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని దళిత, వెనుకబడిన సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కొత్త మంత్రి పదవులకు ఎంపిక చేసింది. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ను మాల సామాజికవర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(మాదిగ)తో పాటు అడ్లూరి లక్ష్మణ్ రావు పేర్లు పరిశీలించిన అధిష్ఠానం చివరకు లక్ష్మణ్ పేరే ఖరారైనట్లు తెలిసింది. బీసీ నేత ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కూడా కొత్త మంత్రుల జాబితాలో చేర్చింది. కాగా కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నేతల్లో ఒకరు అయిన కాకా వెంకటస్వామి కుమారుడు గడ్డం వివేక్‌ . చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. %వీదీదీూ% చదివిన వివేక్‌, విశాఖ ఇండస్ట్రీస్‌ ను స్థాపించారు. అలాగే మీడియా సంస్థనూ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పలుమార్లు అరెస్టయ్యారు. 2009లో పెద్దపల్లి నుండి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్‌, %దీRూ, దీజీూ%లలో పనిచేసి, 2023లో కాంగ్రెస్‌లోకి తిరిగి చేరారు. విద్య, సామాజిక సేవ, సమాజ సాధికారత కోసం విశాఖ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.100 కోట్లకు పైగా వెచ్చించారు. మాల వర్గానికి చెందిన ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఆశీస్సులు ఉండటంతో పదవి లభించింది. వివేక్‌ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారుడు ఎంపీగా ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1965లో కరీంనగర్‌ జిల్లాలో జన్మించిన ఆయన, కాకతీయ మెడికల్‌ కాలేజీ నుండి %వీదీదీూ, వీూ% పూర్తి చేశారు. వైద్యుడిగా సుదీర్ఘ కెరీర్‌లో, ఆయన అనేక గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించి, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు. 2023 ఎన్నికల్లో రసమయి బాలకిషన్‌ను 32,365 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఎమ్మెల్యేగా, ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రెవెన్యూ సదస్సులు, క్రీడా టోర్నమెంట్‌లు వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మాదిగ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ వర్గ ఎమ్మెల్యేలంతా పోరాడారు. ఆ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అవకాశాన్ని హైకమాండ్‌ ఇస్తోంది. లక్ష్మణ్ కుమార్ అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ పై గెలిచారు. ముదిరాజ్‌ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో వాకిటి శ్రీహరికి అవకాశం లభిస్తోంది. ఆయన నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గం నుండి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌ రెడ్డిని 17,525 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆయన తండ్రి వాకిటి నరసింహులు రైతు. 2001-2006 మధ్య మక్తల్‌ గ్రామ సర్పంచ్‌గా, 2014-2018 మధ్య జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేశారు. 2024లో సమగ్ర కుటుంబ సర్వే, బీసీ కుల గణన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. రెడ్డి సామాజికవర్గం నుంచి చాలా మంది సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే సమస్యలు వస్తాయని పూర్తిగా ఖాళీగా ఉంచుతున్నారు. ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో .. కానీ వాటికి రేస్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Latest News

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News