Trending News
Thursday, July 31, 2025
26.3 C
Hyderabad
Trending News

జనవరి 1 నుంచే భూభారతి?

ఇక వందల, వేల ఎకరాలు కొల్లగొట్టిన కబ్జాకోరుల భరతం పట్టనున్న ప్రభుత్వం

డిసెంబర్ 31తో ముగియనున్న టెర్రాసిస్ గడువు

ఎన్ ఐ సి ద్వారా నిర్వహణ

ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌‌కు సర్కార్ నిర్ణయం

దీంతో రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు

అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు?

ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ ద్వారా లావాదేవీలు చేసేవారు?

ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు?

ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీల హిస్టరీ

రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ప్రభుత్వ లెక్కలు

గత కొన్నేళ్లుగా చెలామణి లో ఉన్న ధరణి పోర్టల్‌కు కాలం చెల్లింది. జనవరి 1వ తేదీ నుంచి ధరణి స్థానంలో భూ భారతి సేవలు అందు బాటులోకి రానున్నాయి. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. దీంతో జనవరి ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్-NIC- ద్వారా భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది. ఇదే సమయంలో సర్కార్ ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌‌కు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టిన వాళ్ల పై కేసులు నమోదు కానున్నాయి. అర్థరాత్రి వేళలో కూడా ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ ద్వారా లావాదేవీలు చేశారు? ఏ సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుండి తొలగించారు? వంటి వివరాలను, ఫోరెన్సిక్ ఆడిట్‌లో మొత్తం ధరణి లావాదేవీల హిస్టరీని వెలికితీసేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ధరణి ద్వారా రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయ నుంది, టెర్రాసిస్ ఏజెన్సీ. దీంతో ధరణి మాటున భూముల కొల్లగొట్టినవారిని వెలికి తీసే పనిలో నిమగ్నం కానుంది ప్రభుత్వం.

ధరణి మాటున వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన పెద్దల భరతం పట్టనుంది రేవంత్ సర్కార్. పోర్టల్ నిర్వహణ మారడంతో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌‌కు సర్కార్ రెడీ అయ్యింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టిన కబ్జా కోరుల పని పట్టనుంది ప్రభుత్వం.

అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ లావాదేవీలు చేసేవారు? ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగిం చారు? అనే అంశాలపై ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే సుమారు 2 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ఇటీవల డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15వేల ఎకరాలు హాం ఫట్ అయినట్టు ప్రభుత్వ వర్గాల ప్రాథమిక అంచనా. ప్రభుత్వం 2014 నుండి రికార్డులు పరిశీలించి, ధరణి పోర్టల్ లావాదేవీల‌పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణకు కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేయనుంది. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతో పాటు రెవెన్యూ కీలక అధికారుల గుట్టు రట్టు కానుంది.

Latest News

అటా? ఇటా? వేటా!?|SUPREME COURT|JUDGEMENT

ముచ్చటగా మూడే దారులు! గతంలో హైకోర్టు తిరస్కరణ! తీర్పేదైనా ప్రభావం తీవ్రమే! రాజకీయాలను ప్రభావితం చేసేదే! ‘కీ’లకం కానున్న అత్యున్నత తీర్పు! ‘సుప్రీం’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలేది నేడే! పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తేంటి? ఉంటారా? ఊడుతారా?...

సోలార్‌ విద్యుత్తుదే భవిష్యత్తు!|EDITORIAL

రోజురోజుకు ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. జల విద్యుత్ ఖరీదైనదిగా మారుతోంది. మరోవైపు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. జనాభా పెరుగుతోంది. డిమాండ్ కనుగుణంగా విద్యుత్ తయారీ ఓ సవాల్ గా మారింది. వీటన్నింటికీ మించి...

గురువారం జూలై 31–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి తెల్ల 03.53 వరకు ఉపరి అష్టమి నక్షత్రం చిత్త రాత్రి 12.34 వరకు ఉపరి స్వాతి యోగ సాధ్య రాత్రి తెల్ల 03.37 వరకు ఉపరి శుభ కరణం...

నిరుద్యోగ Freshers|ఫ్రెషర్లకు Good News|శుభవార్త:

ఈ one year|ఏడాది 20 వేల Jobs|ఉద్యోగాలు ఇవ్వనున్న ఇన్ఫోసిస్|Infosys India|భారతీయ It|ఐటీ రంగంలో ఉద్యోగాల భద్రత, వేతన పెంపుదలపై అనేక అనుమానాలు ఉన్న ఈ తరుణంలో దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ...

Premanand Maharaj|ప్రేమానంద్ మహారాజ్ సంచలన వ్యాఖ్యలు

Womens|మహిళలపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువ ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో మాట్లాడిన మహారాజ్, ఈ రోజుల్లో వర్జిన్ అమ్మాయిలు చాలా...

Credit Card|క్రెడిట్ కార్డుతో చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి?

India|భారతదేశంలో పెరుగుతున్న క్రెడిట్ కార్డులు|Credit Cards పెరుగుతున్న రుణ సంక్షోభం క్రెడిట్ కార్డు వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో రుణ డిఫాల్ట్‌లు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి. ప్రముఖ క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్...

Internet|ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే Bitchatmesh|బిట్‌చాట్‌ మెష్ యాప్

Data Protection|డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత|Main Importance Twitter|ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే రూపొందించిన కొత్త కమ్యూనికేషన్ యాప్‌ బిట్‌చాట్ మెష్| BitChat Mesh ఇప్పుడు I Phone Users| ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి...

Russia|రష్యాలో భారీ earthquake|భూకంపం..

Hawai|హవాయి, Japan|జపాన్‌, China|చైనాలకు సునామీ హెచ్చరికలు రాష్ట్రాలన్నీ భయాందోళనతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు రష్యాలోని తూర్పు ప్రాంతం కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో నమోదైన...

బుధవారం జూలై 30–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. శుక్లపక్షం తిధి శు.షష్ఠి రాత్రి 02.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 10.16 వరకు ఉపరి చిత్త యోగ సిద్ద రాత్రి తెల్ల 03.08 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ...

పులులతోనే సకల మానవ జీవ వైవిధ్యం!|EDITORIAL

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం, పర్యావరణం ఇవి మానవ మనుగడుకు అత్యావశ్యం. కానీ, వీటినే మానవుడు అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై శ్రద్ధాసక్తులు తగ్గిపోతున్నాయి. మానవుడు పుట్టిన నాటి నుండే...

Jubilee hills|జూబ్లీహిల్స్‌లో గెలిచేది Congress|కాంగ్రెస్సే

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకి భారీగా వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, కాంగ్రెస్...

NAGARJUNA SAGAR|నాగార్జునసాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద|Floods

Nalgonda|నల్గొండ జిల్లా పరిధిలో ప్రధాన జలవనరుల కేంద్రంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయం నిండు కుండలా మారింది. అధికారులు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News