Friday, June 19, 2026
34.3 C
Hyderabad

భూ భారతితో రైతుల మధ్య గోడవలు అవుతాయి – MLC కల్వకుంట్ల కవిత

తెలంగాణ శాసన మండలిలో శుక్రవారం జరిగిన భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ధరణి తరువాత రాష్ట్రంలో భూ మోసాలు తగ్గాయి, అలాగే తెలంగాణ రైతులకు భూమికి రక్షణ కవచం లా మారింది అని కవిత అన్నారు. ‘‘ధరణితో, గతంలో రైతులు ఎదుర్కొన్న అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు భూముల విషయంలో ప్రజలను మోసం చేశాయి, కానీ కేసీఆర్ ప్రభుత్వం ధరణి ద్వారా రైతుల భూమిని రక్షించింది’’ అని పేర్కొన్నారు.

అంతేకాక, కాంగ్రెస్ పార్టీ ధరణిని నిర్ధేశించి, వాటి గురించి అనేక తప్పు ఆరోపణలు చేసిన విషయాన్ని కవిత తప్పుపట్టారు. ‘‘ధరణిలో కుట్ర కోణం ఉందని ప్రభుత్వం చెప్తే అది దారుణం. మాతృభూమి కోసం సైనికుడు ప్రాణమిస్తే, సాగు భూమి కోసం రైతు ప్రాణం వదులుతాడు’’ అని ఆమె అన్నారు.

కవిత చెప్పిన దాని ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉందని, అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి కావడంతో, 17.8 లక్షల ఎకరాల భూమి మాత్రమే వివాదాల్లో ఉందని వివరించారు. గతంలో కౌలుదారులు కోర్టులలో 20-25 సంవత్సరాల పాటు నిరీక్షించే పరిస్థితులు ఉండేవి, కానీ ధరణి వచ్చిన తర్వాత రైతులకు భూ యాజమాన్యం కాపాడటం, భూమికి రక్షణ కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని చెప్పారు.

ధరణి వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయని కవిత తెలిపారు. ‘‘35749 మంది ఉద్యోగులు 100 రోజుల్లో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేశారు, ఆ తరువాత భూ వివరాలను ధరణిలో ఎక్కించారు’’ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో, ప్రభుత్వ భూములు కూడా కాపాడబడ్డాయని పేర్కొన్నారు. ‘‘ధరణి వల్ల గుంటలను కూడా కాపాడటం, భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రజలకు చేరువవడం జరిగింది’’ అన్నారు.

అయితే, కవిత భూభారతి చట్టం గురించి కూడా మాట్లాడారు. ‘‘భూ భారతి అనేది ఒక పిచ్చి చర్యగా కనిపిస్తోంది. ఇది ఒక వ్యవస్థ రద్దు చేయడాన్ని సూచిస్తుంది’’ అని పేర్కొన్నారు. భూ భారతి చట్టంలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ జోడించడం వల్ల రైతుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు కవిత అభిప్రాయపడ్డారు. కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవడం మంచిది అని ఆమె సూచించారు.

ధరణి తీసుకురావడంతో కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ‘‘భూభద్రత’’ మరియు ‘‘రైతు బంధు’’ వంటి సంక్షేమ పథకాలు అందుకున్నాయని కవిత గుర్తుచేశారు. ‘‘ధరణి కారణంగా పంట రుణాలు, బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు, రైతులకు అనేక విధాలుగా మేలు చేశాయి’’ అని ఆమె చెప్పారు.

కవిత చివరగా, ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు భయపెట్టి శిక్షలతో భూ భారతి చట్టాన్ని అమలు చేయడం సరికాదు. భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థను నయం చేయడమే ముఖ్యం’’ అని అన్నారు.

Latest News

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News