Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

ఫార్ములా-ఈ రేస్ కేసు నమోదు పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా-ఈ రేస్ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా స్పందించారు. ఫార్ములా-ఈ రేస్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి & ప్రభుత్వం చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. దీనిని లాత్కొర్ పని అంటూ విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ పెట్టమని మేము కోరడం వాస్తవానికి నిజాలు చెప్పడమే మా ప్రయత్నమేనని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “గత రెండు రోజులుగా స్పీకర్‌ను అసెంబ్లీలో చర్చకు అనుమతించాలని కోరుతున్నాం. మమ్మల్ని కుంభకోణంలో లాగడమే లక్ష్యమని, కానీ వారి ప్రయత్నాలు ఫలించవని,” తేల్చిచెప్పారు. నాలుగు గోడల మధ్యనే మాట్లాడితే ప్రజలు తెలుసుకోలేరని, 4 కోట్ల మంది ప్రజల ముందే ఈ విషయంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

ఫార్ములా-ఈ రేస్ పట్ల  అప్పటి ప్రభుత్వ దృక్కోణం
ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా చెప్పొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పర్యావరణానికి హాని లేకుండా మెరుగైన రేసింగ్‌ ప్రోత్సహించడమే కాదు, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే 2001లో ఫార్ములా-1 రేస్‌ను దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో పర్మనెంట్ ట్రాక్ కోసం గోపన్‌పల్లి ప్రాంతంలో 580 ఎకరాల భూమిని భూసేకరణ చేయడానికి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని,” కేటీఆర్ తెలిపారు.

ఫార్ములా-1 ట్రాక్ కోసం కేటాయించిన భూముల్లో రేవంత్ రెడ్డికి 15 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఈ వివరాలను 2023 ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని పేర్కొన్నారు. అయితే, రేసింగ్‌ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు.

ఫార్ములా-ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ద్రవ ఇంధనాలకు ప్రత్యామ్నాయం కోసం ఏర్పాటవుతుండగా, తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చి విజయవంతం చేసిందని కేటీఆర్ వెల్లడించారు. “విశ్వవ్యాప్తంగా రేసింగ్‌లో పెద్ద మార్పు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు చొరవ తీసుకోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణానికి మేలు చేకూర్చడం జరుగుతోంది. ఇలాంటి రేసింగ్ ఈవెంట్ల ద్వారా నగరాలకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. హైదరాబాద్ ఈ విషయంలో ముందంజ వేసింది,” అన్నారు.

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 14 కీలక రంగాలను గుర్తించిందని, వాటిలో ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధన రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ రెండింటి కలయికగా ఎలక్ట్రిక్ వాహనాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రం ముందడుగు వేసిందని వివరించారు.

మొనాకో సిటీ గ్రాండ్ ప్రీ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, యూపీలోని నోయిడాలో జేపీ గ్రూప్ నిర్మించిన ట్రాక్‌లో ఫార్ములా-1 రేస్‌లు జరిగినప్పటికీ, అవి మూడేండ్లకు మాత్రమే పరిమితమయ్యాయని చెప్పారు. ఫార్ములా-4 రేసింగ్‌ ఇటీవల చెన్నైలో, జమ్మూకశ్మీర్‌లో జరిగిన సందర్భాలను గుర్తుచేశారు. అమిత్ షా కూడా ఫార్ములా-4 రేస్‌ను ప్రశంసించారని, ఈ విధమైన ఈవెంట్లు భారత దేశానికి గర్వకారణమని అన్నారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అసలు వారి ఉద్దేశ్యం కేవలం ప్రజల దృష్టిని మరల్చడమేనని కేటీఆర్ ఆరోపించారు. “ఫార్ములా-ఈ రేస్‌పై ప్రభుత్వం సరిగ్గా సమాధానం ఇవ్వగలదని నమ్మకం లేదు కాబట్టే వారు చర్చకు రావడం లేదు,” అన్నారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మానసికత సాడిస్ట్‌గా ఉందని విమర్శించిన కేటీఆర్, ప్రజల మనోగతాలు గౌరవించకపోవడం వారి వైఫల్యమని అన్నారు. “ప్రజల కోసం ప్రభుత్వ విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తేనే అభివృద్ధి సాధ్యం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నాయి,” అని అభిప్రాయపడ్డారు.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News