అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల పట్ల చేపట్టిన చర్యలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని బిషప్లకు పంపిన లేఖలో పోప్, ట్రంప్ వలస విధానాన్ని నిందించారు. అక్రమ వలసదారులందరూ నేరస్థులు కాదని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారు వలస వెళ్ళేందుకు వాదించారని పోప్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తుల గౌరవమర్యాదలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన సూచించారు. వలసదారుల బహిష్కరణ జరిగితే అది విపత్తుగా మారుతుందని, అక్రమ వలసదారుల సమస్యను పరిష్కరించడానికి ఇది సరైన మార్గం కాదని పోప్ అభిప్రాయపడ్డారు.
అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద బహిష్కరణను తలపెట్టినట్టు ట్రంప్ గతంలో ప్రకటించారు. ఈ క్రమంలో, యుఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసిఇ) 15 లక్షల మంది అక్రమ వలసదారుల జాబితా సిద్ధం చేసింది. నవంబర్ 2024లో విడుదలైన డేటా ప్రకారం, అమెరికాలో 1.5 లక్షల మంది అక్రమ వలసదారులలో 17,940 మంది భారతీయులు ఉన్నారు.
అమెరికాలోని 30,000 మంది అక్రమ వలసదారులను గ్వాంటనామో నిర్బంధ శిబిరానికి తరలించడానికి ట్రంప్ ఆదేశించారు. ఈ శిబిరంలో ఇప్పటికే ఉగ్రవాదులు మరియు నేరస్థులు ఉన్నారు, వీరిలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి.

