Monday, July 27, 2026
24.4 C
Hyderabad

మత విధ్వేషాలు బంగ్లా భద్రతకే పెను ముప్పు!|EDITORIAL

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు దక్షిణాసియాలో శాంతి, భద్రతలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో దేశం రాజకీయ అరాచకంలోకి జారిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ అస్థిరతలోనే ఆదేశంలోని హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి రాజకీయ ఘర్షణలలో భాగమా? లేక అక్కడి హిందూ సముదాయాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

హసీనా భారత్‌లో ఆశ్రయం పొందిన తరువాతే హిందువులపై దాడులు తీవ్రమయ్యాయన్న వాదన విస్తృతంగా వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మూకలు రెచ్చిపోయి హత్యలు, దహనాలు, ఆలయాల ధ్వంసం, భూ కబ్జాలు చేస్తున్నాయని స్వతంత్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం వీటిని ‘రాజకీయ హింస’గా కొట్టిపారేయాలని ప్రయత్నిస్తున్నా, బాధితులలో అధికశాతం హిందువులే కావడం ఈ వాదనను బలహీనపరుస్తోంది.

దీపూ చంద్రదాస్‌, అమృత్ మండల్‌ వంటి వారి క్రూరమైన, కిరాకతక హత్యలు ఆ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలను మతపరమైనవి కావని బంగ్లాదేశ్ ప్రభుత్వం బుకాయిస్తున్నప్పటికీ, వరుసగా అదే సముదాయానికి చెందినవారు బలవుతున్న పరిస్థితి యాదృచ్ఛికంగా కనిపించడం లేదు. తాత్కాలిక ప్రభుత్వ హయాంలోనే సుమారు 2,900కుపైగా హింసాత్మక ఘటనలు మైనారిటీలపై జరిగాయని స్వతంత్ర సంస్థల అధ్యయనాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ పరిణామాలపై భారత్ స్పందించక తప్పలేదు. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి విస్మరించదగిన ఘటనలు కాదని, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేసింది. భారత్–బంగ్లా సరిహద్దు పొడవునా జరుగుతున్న పరిణామాలను న్యూఢిల్లీ సునిశితంగా గమనిస్తోందని అధికార ప్రతినిధులు తెలిపారు. ఇది కేవలం ద్వైపాక్షిక అంశం మాత్రమే కాదు, దేశీయ స్థిరత్వానికి సంబంధించిన విషయం అన్న సంకేతాన్ని భారత్ స్పష్టంగా ఇచ్చింది.

అయితే ఇంత జరుగుతున్నా, అంతర్జాతీయ సమాజం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? గాజా, ఉక్రెయిన్ వంటి ప్రాంతాల్లో మానవహక్కుల ఉల్లంఘనలపై పెద్ద ఎత్తున స్పందించిన ప్రపంచం, పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మైనారిటీల ఊచకోతపై ఎందుకు అంతగా స్పందించడం లేదు? ఈ ద్వంద్వ వైఖరి మానవహక్కుల పరిరక్షణలోని రాజకీయ స్వార్థాలను బహిర్గతం చేస్తోంది.

భారత్‌లో సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు ఈ దాడులను ఖండిస్తున్నారు. ‘పక్కనే జరుగుతున్న అన్యాయంపై మౌనం నేరంతో సమానం’ అన్న భావన సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ అధికారులకు నేరుగా హెచ్చరికలు చేయడం పెల్లుబికుతోన్న ఆగ్రహానికి ప్రతిబింబం.

గత కొంతకాలంగా అంతగా కనిపించని, వినిపించని మతతత్వ రాజకీయాలు బంగ్లాలో పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. కొందరు నేతలు మతతత్వాన్ని తిరిగి ప్రోత్సహిస్తూ, మైనారిటీలను బలిపశువులను చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం దేశీయ సమస్యగా కాకుండా, భారత్‌ను రెచ్చగొట్టే వ్యూహంలో భాగమేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణాసియాలో మతతత్వ అశాంతి సరిహద్దులు దాటుతుందన్న చరిత్రను మరచిపోలేం.

బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలతో కాకుండా, చర్యలతో మైనారిటీల భద్రతకు భరోసానివ్వాలి. దోషులను శిక్షించి, బాధితులకు రక్షణ కల్పించడం, ప్రజాస్వామిక మానవీయ, న్యాయబద్ధమైన, సుపరిపాలనను పునరుద్ధరించడం అత్యవసరం. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అంతర్గత అత్యవసర సమస్యలతో సతమతమవుతోన్న దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతుంది. దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News