Wednesday, May 6, 2026
33.2 C
Hyderabad

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం ప్రజల జీవన విధానం, ప్రమాణాల్లో వచ్చిన మార్పునకు సంకేతం. అయితే, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, దిగుమతులపై ఆధారపడే వ్యవస్థ అవడం, దేశంలో గ్యాస్‌ భద్రతపై అప్పుడప్పుడూ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ లో యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా అంతరాయం కలగవచ్చనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో గ్యాస్ వినియోగ స్థితి, నిల్వలు, భవిష్యత్ అవసరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశ్లేషించుకోవడం అవసరం.

భారతదేశంలో ఎల్పీజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2004-05లో దేశంలో ఎల్పీజీ వినియోగం కేవలం 10.2 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా, 2024-25 నాటికి ఇది 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే రెండు దశాబ్దాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. 2017లో 21.6 మి.మె.ట.గా ఉన్న వినియోగం 2025లో 31.3 మి.మె.ట.కి చేరి దాదాపు 44 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం దేశంలో 32.9 కోట్ల గృహ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ అందుబాటు 102.8 శాతానికి చేరినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో ప్రతి కుటుంబానికి గ్యాస్ సదుపాయం దాదాపు చేరిందని చెప్పవచ్చు. ప్రతి నెల సగటు. దేశంలో 2.6 మి. మె. ట. ల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. కుటుంబాల వారీగా చూస్తే సాధారణ వినియోగదారులు ఏడాదికి సగటున 6–7 సిలిండర్లు వినియోగిస్తుండగా, పేద కుటుంబాలకు అందించే పథకాల కింద సగటు వినియోగం 4.5 సిలిండర్లుగా ఉంది.

ఎల్పీజీ వినియోగం దేశీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా వేగంగా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే ఎల్పీజీలో 60%-65% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చే సరఫరా కీలకం. ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగాగానే గాక, రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతి దేశంగా భారత్ నిలిచింది.

మధ్యప్రాచ్యంలో యుద్ధాలు లేదా ఉద్రిక్తతలకు సరఫరా మార్గాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా భారత్‌కు వచ్చే ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ మార్గం ద్వారా వచ్చే సరఫరా నిలిచిపోతే దేశంలో తాత్కాలిక కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా తగ్గడంతో వ్యాపారాలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాణిజ్య రంగానికి సరఫరా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
దేశంలో గ్యాస్ నిల్వల పరిస్థితి కూడా అంతగా దీర్ఘకాలిక భద్రతను, భరోసాను ఇవ్వలేవనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వ సామర్థ్యం 16 రోజుల వినియోగానికి సరిపడే స్థాయిలో మాత్రమేనని పరిశ్రమ నివేదికలు చెబుతున్నాయి. అంటే దిగుమతులు నిలిచిపోయినా, సరఫరా ఆగిపోయినా, దేశం ఎక్కువకాలం నిల్వలపై ఆధారపడే పరిస్థితి లేదు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని అత్యవసర చర్యలు తీసుకుంది. రిఫైనరీలను పూర్తి సామర్థ్యంతో నడపాలని ఆదేశించడం, ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచడం, పరిశ్రమలకు వెళ్లే గ్యాస్‌ను కొంత మేర గృహ వినియోగానికి మళ్లించడం వంటి చర్యలు చేపట్టింది.

అయితే, దీర్ఘకాలికంగా చూస్తే మరికొన్ని చర్యలు అమలు చేయాల్సిన అగత్యం కనిపిస్తోంది. మొదటగా, ఎల్పీజీ దిగుమతులపై అధికంగా ఆధారపడే పరిస్థితిని తగ్గించాలి. అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యామ్నాయ దిగుమతులకు పూనుకోవాలి. రెండవది, దేశంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక నెలకు పెరగాలి. మూడవది, గ్యాస్ వినియోగంలో సమర్థతను పెంచే చర్యలు అవసరం. స్మార్ట్ బుకింగ్ విధానాలు, నిల్వల నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

నాలుగవది, ప్రత్యామ్నాయ శక్తి వనరులపై దృష్టి పెట్టాలి. బయోగ్యాస్, విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా గ్యాస్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చు. గ్యాస్ వినియోగం అభివృద్ధికి సూచికగా కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో ఇది ఇంధన భద్రతకు సవాలుగా నిలుస్తోంది. పెరుగుతున్న వినియోగానికి తగిన అన్ని ప్రత్యామ్నాయ శక్తి వనరులు లేకపోతే భవిష్యత్తులో మరింత సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం, పరిశ్రమలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే దేశ ఇంధన భద్రతకు భద్రత ఉంటుంది.

Latest News

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News