Tuesday, April 21, 2026
35.2 C
Hyderabad

బిడ్డకు నీరా‘జనం’ తల్లికి అశేష ఆహ్వనం|MEDARAM|SAMMAKKA SARALAMMA|

గద్దెపైకి సారలమ్మ…నేడు సమ్మక్క…
బిడ్డరాకతో ఊపందుకున్న మొక్కులు
తల్లి రాకకై భక్తజనకోటి ఎదరు చూపులు
కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలసిన గుడారాలు

వనమెల్లా జనం.. నిలువెల్లా బంగారంతో జంపన్నవాగు భక్తి ప్రవాహంగా మారింది. అడవి తల్లి పులకించింది. మేడారం మట్టి పరిమళం కుంకుమ, పసుపువర్ణమై మెరిసింది. మేడారం ఆధ్యాత్మిక కోలాహలంగా మారిపోయింది. ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపై కొలువుదీరింది.

ఇక ఈ రోజు జాతరలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది! చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో.. జాతర తారాస్థాయికి చేరుకుంటుంది.

ఇప్పటికే పూజారులు. అటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారం గద్దెలపై ప్రతిష్ఠించడంతో జాతరకు అంకురార్పణ జరిగింది.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర మొదలయ్యింది. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి రానున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గోవింద రాజు, పగిడిద్ద రాజులు కూడా గద్దెలకు చేరుకుంటారు. అలాగే గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు. సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణం కానుంది. మరుసటి రోజు అనగా శుక్రవారం(జనవరి 30) భక్తులు సమ్మక్క ` సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన శనివారంసాయంత్రం సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిపూర్ణంగా ముగుస్తుంది. మేడారం మహా జాతర తెలంగాణ సంస్కతి, గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. జనాల గుడారాలతో మేడారం కిటకిటలాడుతోంది. భక్తులు బెల్లం(బంగారం) సమర్పిస్తూ ఆచారాలు పాటిస్తున్నారు. మహాజాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రభుత్వం తాజాగా గ్దదెలను పునర్నిర్మాణం చేసింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రవాణా, నీరు, వైద్యం, భద్రతా ఏర్పాట్లు చేశారు.మేడారం సమ్మక్క`సారలమ్మ మహాజాతర ప్రారంభం కావడంతో ములుగు జిల్లాలోని అడవులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా పేరొందిన ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం. సారలమ్మ గద్దెపైకి వస్తున్న తరుణంలో వేలాది మంది భక్తులు జంపన్న వాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులందరూ బస్సుల ద్వారా, సొంత వాహనాల ద్వారా నేరుగా వాగు వద్దకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వచ్చే ప్రతి భక్తుడు ముందుగా జంపన్న వాగును సందర్శించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాతే అమ్మవార్ల గద్దెల దర్శనానికి వెళ్లడం సంప్రదాయం. భక్తులు తమ వెంట తెచ్చుకున్న అమ్మవారి ప్రతిమలను వాగులో పవిత్రంగా కడిగి, పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్ల వద్ద ప్రతిష్టించుకున్న గద్దెలను మేడారం తీసుకువచ్చి, ఇక్కడ జంపన్నకు మొక్కులు అప్పగిస్తారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరినందుకు కతజ్ఞతగా ’ఎత్తు బంగారం’ అంటే తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన వెదురు లంకలను (ఎదురు కర్రలు) పట్టుకుని భక్తిపాటలు పాడుతూ భక్తులు చేసే సందడి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఘనంగా ఆవిష్కృతమైంది. వనం వీడి జనం మధ్యకే వచ్చి వనదేవతలు గద్దెలపై కొలువుదీరారు. డోలు వాయిద్యాల నడుమ కోలాహలంగా కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ మేడారానికి చేరుకున్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వైభవంగా గద్దెలపై కొలువుదీరారు. వనదేవతల రాక సందర్భంగా సారలమ్మకు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు సాదర స్వాగతం పలికారు. సారలమ్మ రాక నేపథ్యంలో భద్రతా బలగాలు మూడంచెల పటిష్ట బందోబస్తును కల్పించాయి. అంతకు ముందు కన్నెపల్లి గ్రామస్థులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ సంప్రాదాయాల ముగ్గులతో చూడ ముచ్చటగా అలంకరించారు. వనదేవతల రాక సందర్భంగా భక్తులతో మేడారం వెలుగుజిలుగులతో కళకళలాడుతోంది. భక్తులంతా ఎంతో ఆతురతగా చూసే మరో అద్భుత ఘట్టం గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి మేడారంలోని గద్దెపైకి చేరుకోవడంతో ఆవిష్కృతం కానుంది. శుక్రవారం వనదేవతలు అందరూ గద్దెలపై నుంచి భక్తులకు దర్శమిస్తారు.అంతకుముందు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం సారలమ్మ గద్దెలపైకి చేరుకున్నారు. జంపన్న వాగు నుంచి పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలిసి డోలు వాయిద్యాల నడుమ గద్దెలపైకి వచ్చారు. వనదేవతలను మేడారం తీసుకువస్తుండగా శివసత్తులకు పూనకాలు వచ్చాయి. సారలమ్మ గద్దె పైకి ప్రవేశించనుడడంతో అధికారులు దర్శనాలను నిలిపివేశారు. గద్దెల వద్ద ఉన్న భక్తులను బయటికి పంపేశారు. మేడారం మహాజాతర సందర్భందా ఎల్లుండి కలెక్టర్ ములుగు జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు.

   

Latest News

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

20-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం అక్షయ తృతీయ బసవ జయంతి తిధి శు తదియ ఉదయం 10.58 వరకు ఉపరి చవితి నక్షత్రం కృత్తిక ఉదయం 07.53 వరకు ఉపరి రోహిణి యోగం సౌభాగ్య రాత్రి 07.51 వరకు ఉపరి శోభ కరణం...

కులాలు, పండుగలు, ఆచారాలు, తెలంగాణ అస్తిత్వం|TELANGANA|FESTIVALS

ప్రాగైతిహాసిక కాలంలో కులపరమైన సమాజం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి బృహత్ శిలా సమాధులు తెలంగాణలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ప్రపంచంలోనే తొలినాళ్లలో ఇనుప ఉత్పత్తి చేసిన ప్రాంతాల్లో ఒకటి. దీని కారణంగా ఇక్కడ...

ఏసీల్లెక్క కూలర్ గాలికి గీ శిట్కాలు!?|ADUGU TRENDS

ఎండాకాలం రానే వచ్చె. పెనంల కెళ్ళి పొయ్యిల పడ్డట్టు, కుమ్ముల పెట్టినట్లు మలమల మాడి, ఉడికిపోబడితిమి. ఇగిప్పుడు ఏసీ టైమొచ్చింది. ఏసీల గిరాకీ, ధరలు సూత్తే అవి గూడ మండిపోబట్టే. ఇగ మద్దె...

విపక్షాలను ఏకం చేసిన అధికార పక్షం!?|EDITORIAL

విపక్షాలు ఏకమైతే కేంద్రానికి సవాల్ విసరగలవని తేలిపోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం, ఎన్‌డిఎ మద్దతుపైనే ప్రభుత్వం కొనసాగుతుండటం వల్ల కీలకమైన రాజ్యాంగ సవరణలను చేపట్టాలంటే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. కొత్త అవకాశాలు మీ ముందు వస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది....

మనుసులతోటి పనేంది? మిషిన్లుండంగ!?|ADUGU TRENDS

గిదంతా రెడీమేడ్ల కాలం! రెడీమేడ్ బట్టలొచ్చె. వండకతినే కుక్కర్లు, మైక్రో ఓవెన్లు వచ్చె. ఆర్డరేస్తే ఫుడ్డొచ్చె. బెడ్డొచ్చె. బట్టలుతికే వాషింగ్ మిషిన్లొచ్చె. ఇగ ఎవలికే కట్టం లేకుండ పిల్లల్ని కనే పద్ధతులొచ్చె!? గట్లనే...

మహిళల కోటా కోసం సీట్లు పెంచాల్సిందేనా!?|EDITORIAL

ప్రజలపై అదనపు భారం మోపకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేమా? ప్రస్తుత సీట్లలోనే 33 శాతం కేటాయింపు అమలు చేయడం సాధ్యమే. అంటే 543 సీట్లలో సుమారు 181 సీట్లు మహిళలకు ఇవ్వవచ్చు. దీనివల్ల...

18-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖమాసం ప్రారంభం తిధి శు పాడ్యమి మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి విదియ నక్షత్రం అశ్విని ఉదయం 10.50 వరకు ఉపరి భరణి యోగం ప్రీతి రాత్రి 01.50 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ...

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News