Tuesday, April 21, 2026
35.2 C
Hyderabad

పార్టీల రిజర్వేషన్ల రాజకీయాలు!|EDITORIAL

రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?

బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి.
రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా?

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తీవ్ర చర్చకు కేంద్ర బిందువైంది. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న రాజ్యాంగ నిబంధనకు లోబడి హైకోర్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తిరస్కరించింది. సుప్రీం కోర్టు సమర్ధించింది. హైకోర్టు సూచన మేరకే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. నిజానికి రిజర్వేషన్ల అమలు బాధ్యత రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది. సమాజంలో బలహీన వర్గాల పేరుతో బలమైన వర్గాల మెజార్టీ ఓట్లతోనే ఎవరైనా గెలుస్తున్నారు. ఓడుతున్నారు. కానీ, వారిని గెలిపిస్తున్న బలమైన బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం అంగీకరించడం లేదు. రాజకీయ పార్టీల సంకల్పబలం లేకుండా రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి మన రాజ్యాంగంలో ఏమాత్రం కనిపించడం లేదు.

ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రిజర్వేష్ల ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తున్నారు. లేకపోతే వారికావకాశాలు దక్కేవి కావు. జనాభాలో సామాజిక వర్గాలను పరిశీలిస్తే, బలహీన వర్గాలే బలమైన వర్గాలు. ప్రభుత్వాలు చూపిస్తున్న లెక్కలకు తక్కువగా కనీసం 42శాతం రిజర్వేషన్లకు కూడా అంగీకరించకుండా బీసీలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు? ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేష్లను బట్టి, రిజర్వేషన్లు ఉంటే తప్ప అవకాశాలివ్వరని తేలిపోయింది. ఎస్సీ, ఎస్టీ తప్ప రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?
ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, తటస్థులకు టిక్కెట్లు ఇచ్చి, వారిని ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టారు. ఆ ప్రభంజనంలో కల్వకుర్తిలో ఎన్టీఆర్ సహా, ఎన్.జీ రంగా లాంటి మహామహులు కూడా ఓడిపోయారు. అందువల్లే ఆ రోజుల్లో కొత్తతరం రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకుంది. అది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల రాజకీయ ప్రస్థానానికి నాందీ పలికింది.

మండల్‌ కమిషన్ తీర్పు, ఇందిరా సహాని కేసు పరిణామాలు రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చినా, వాస్తవిక రాజకీయాల్లో వాటి అమలు కష్టసాధ్యమే అయింది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల అమలుకు అప్పటి సీఎం జయలలిత చేసిన కసరత్తు, రిజర్వేషన్ల పరిమితి, రాజ్యాంగ అనుకూలతల మధ్య పోరాటమే జరిగింది. ఇవన్నీ చట్టపరమైన ప్రయోగాలు. అయితే, అమలుకు సాధ్యం కాని సత్యదూరాలు మాత్రం కాదు. బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి. ఇందుకు తెలంగాణ ఉద్యమం, తమిళనాట బీసీల ఆధిపత్యమే ప్రబలమైన ఉదాహరణలు.
ఇక సర్పంచ్‌ పదవి అనేది రాజకీయాలకు, రాజ్యాంగ పదవులకు తొలి మెట్టు. గ్రామాల ప్రగతే దేశ ప్రగతి కాబట్టి, దేశం లాగే, గ్రామాభివృద్ధి బాధ్యతను చేపట్టే పదవిగా ఎంతో ప్రాధాన్యతతో కూడింది. అందువల్ల రాజకీయ పార్టీలన్నీ సమాజంలో సంఖ్యా బలంగా ఉన్న సామాజిక వర్గాలకు, అందునా చదువుకున్న, నిజాయితీగల, సేవాతత్పరత ఉన్న అభ్యర్థులను నిలబెట్టాలి. రిజర్వేషన్ లేని గ్రామాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను ప్రోత్సహించాలి. ఇలా చేస్తేనే ప్రజాస్వామ్యంలో పాతనీరు పోయి కొత్త నీరు వస్తుంది.

తెలంగాణ శాసనసభలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, అదే స్పూర్తితో బీసీ అభ్యర్థులకు అవకాశాలిచ్చి, గెలిపించుకోవాలి. “సర్పంచ్‌లకు పార్టీ గుర్తు ఉండదు” అనే నెపంతో వారిని పక్కన పెట్టడం వల్ల అసెంబ్లీ తీర్మానాలకు కూడా విలువలేకుండా పోతుంది. రాజ్యాంగ స్ఫూర్తిపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇప్పుడు కానిది ఎప్పుడూ కాదు కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటి ఎన్నికల్లోనే తగిన నిర్ణయాలు తీసుకుంటే, భవిష్యత్తు రాజకీయ సామాజిక సమానత్వానికి పునాది పడుతుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలి. రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా? ఈ పంచాయతీ ఎన్నికలే తేలుస్తాయి.

Latest News

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

20-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం అక్షయ తృతీయ బసవ జయంతి తిధి శు తదియ ఉదయం 10.58 వరకు ఉపరి చవితి నక్షత్రం కృత్తిక ఉదయం 07.53 వరకు ఉపరి రోహిణి యోగం సౌభాగ్య రాత్రి 07.51 వరకు ఉపరి శోభ కరణం...

కులాలు, పండుగలు, ఆచారాలు, తెలంగాణ అస్తిత్వం|TELANGANA|FESTIVALS

ప్రాగైతిహాసిక కాలంలో కులపరమైన సమాజం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి బృహత్ శిలా సమాధులు తెలంగాణలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ప్రపంచంలోనే తొలినాళ్లలో ఇనుప ఉత్పత్తి చేసిన ప్రాంతాల్లో ఒకటి. దీని కారణంగా ఇక్కడ...

ఏసీల్లెక్క కూలర్ గాలికి గీ శిట్కాలు!?|ADUGU TRENDS

ఎండాకాలం రానే వచ్చె. పెనంల కెళ్ళి పొయ్యిల పడ్డట్టు, కుమ్ముల పెట్టినట్లు మలమల మాడి, ఉడికిపోబడితిమి. ఇగిప్పుడు ఏసీ టైమొచ్చింది. ఏసీల గిరాకీ, ధరలు సూత్తే అవి గూడ మండిపోబట్టే. ఇగ మద్దె...

విపక్షాలను ఏకం చేసిన అధికార పక్షం!?|EDITORIAL

విపక్షాలు ఏకమైతే కేంద్రానికి సవాల్ విసరగలవని తేలిపోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం, ఎన్‌డిఎ మద్దతుపైనే ప్రభుత్వం కొనసాగుతుండటం వల్ల కీలకమైన రాజ్యాంగ సవరణలను చేపట్టాలంటే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. కొత్త అవకాశాలు మీ ముందు వస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది....

మనుసులతోటి పనేంది? మిషిన్లుండంగ!?|ADUGU TRENDS

గిదంతా రెడీమేడ్ల కాలం! రెడీమేడ్ బట్టలొచ్చె. వండకతినే కుక్కర్లు, మైక్రో ఓవెన్లు వచ్చె. ఆర్డరేస్తే ఫుడ్డొచ్చె. బెడ్డొచ్చె. బట్టలుతికే వాషింగ్ మిషిన్లొచ్చె. ఇగ ఎవలికే కట్టం లేకుండ పిల్లల్ని కనే పద్ధతులొచ్చె!? గట్లనే...

మహిళల కోటా కోసం సీట్లు పెంచాల్సిందేనా!?|EDITORIAL

ప్రజలపై అదనపు భారం మోపకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేమా? ప్రస్తుత సీట్లలోనే 33 శాతం కేటాయింపు అమలు చేయడం సాధ్యమే. అంటే 543 సీట్లలో సుమారు 181 సీట్లు మహిళలకు ఇవ్వవచ్చు. దీనివల్ల...

18-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖమాసం ప్రారంభం తిధి శు పాడ్యమి మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి విదియ నక్షత్రం అశ్విని ఉదయం 10.50 వరకు ఉపరి భరణి యోగం ప్రీతి రాత్రి 01.50 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ...

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News