Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

నమ్మిన మోసమా!? నమ్మక ద్రోహమా!?|MAOIST|RED FLAG

లొంగిపోవడానికి పిల్చి…
ప్రశ్నించడానికి పట్టుకెళ్ళి…
నమ్మించి…నట్టడవిలో కాల్చి…
హిడ్మా దళం దగా పడిందా?
లొంగిన వాళ్ళను పోలీసులే మట్టుబెట్టారా?
హిడ్మా ఎన్ కౌంటర్ పై అనేక అనుమానాలు
పట్టుబడ్డాకే మట్టు పెట్టారంటున్న ప్రజాసంఘాలు
ఆ అవసరం మాకు లేదంటున్న పోలీసులు
అగ్రనేతలే లక్ష్యంగా పోలీసుల ప్రణాళిక
మావోయిస్టుల అంతానికే ఆపరేషన్ పన్నాగం
హిడ్మా లేఖ రాసిన ఆ జర్నలిస్టు ఎవరు?
ఆరా తీస్తున్న పోలీసులు, నిఘా వర్గాలు!

హైదరాబాద్, నవంబర్ 19 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలకం. ఆ పార్టీ గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) ప్లాటూన్ 1 ప్రధాన కమాండర్, ప్రభుత్వం, పోలీసులకు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్ కౌంటర్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఎన్ కౌంటర్ బూటకమని, పట్టుకెల్లి మట్టుబెట్టారని సీపీఐ, ప్రజా, పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆవసరం మాకు లేనే లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దశలో ఏపీలో వేర్వేరు చోట్ల పట్టుబడ్ట నక్సలైట్లు హిడ్మా ప్లాటూన్ సభ్యులేనని ఆ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏడీజీ లద్దా ప్రకటించారు. వారిని బుధవారమే కోర్టులో హాజరు పరిచారు. ఈ ప్రకటనతోపాటు, నక్సల్స్ కదలికలపై అవగాహన ఉన్న వారి ఆలోచనలు, మారేడ్ మిల్లి అడవుల్లో జరిగిన హిడ్మా ఎన్ కౌంటర్ వంటి ఘటనలు, తాను లొంగిపోవడానికి హిడ్మా దళం నిర్ణయించుకుని, ఓ జర్నలిస్టుకు లేఖ రాశారన్న పుకార్లు వంటి ఈ వరుస పరిణామాలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.

మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ స్థాయిలో కీలకంగా ఉన్న హిడ్మా పోలీసులకు కొరకరానిక కొయ్యగా మారాడు. పోలీసులే చెబుతున్నట్లు వారికి భారీ నష్టం వాటిల్లిన అన్ని ఘటనలకు బాధ్యుడు హిడ్మానే. పైగా మావోయిస్టు పీఎల్ జీఏ ఒకటవ ప్లాటూన్ కు కమాండర్. మావోయిస్టు దాడుల చోదక శక్తిగా పని చేసిన, అంతటి వ్యక్తి దళమే బెజవాడలో పట్టుబడిందని కూడా ఏపీ పోలీసులే ప్రకటించారు. ఇదిలా వుంటే, బెజవాడలో హిడ్మా దళంగా భావిస్తున్న 50 మంది నక్సలైట్లు పట్టుబడగా, హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్ లు మారేడ్ మిల్లిలో ఎన్ కౌంటర్ అయ్యారు. ఈ రెండు మంగళవారం తెల్లవారుజామునే జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలు కాకతాలీయంగా జరిగినవా? కావాలనే చేసినవా? అనే అనుమానాలను ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అరణ్యాల్లో సేఫ్టీ లేకే జనారణ్యంలోకి వచ్చిన నక్సల్స్ లో హిడ్మా, ఆయన భార్య, మరికొందరితో తిరిగి అడవుల్లోకి వెళ్ళారా? అలా చేసి ఉంటారా? పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మా అంత ఈజీగా దొరికాడా?

అయితే, హిడ్మా తన దళంతోపాటు లొంగిపోవడానికి సిద్ధపడి, ఓ జర్నలిస్టుకు లేఖ రాశాడన్నదాన్ని బట్టి చూస్తే, లొంగిపోవడానికే హిడ్మా సహా ఆయన దళం కానూరు న్యూ ఆటో నగర్ లో దిగిందా? హిడ్మా లొంగుబాటుకు దళాన్ని ఎవరు రప్పించారు? వారే వచ్చారా? వారిలో నుంచి హిడ్మా, ఆయన భార్య, మరికొందరు మాత్రమే ఎందుకు వేరుగా వెళ్ళారు? వారిని లొంగుబాటులో ప్రక్రియలో భాగంగానే జనారణ్యంలోకి రప్పించి, షెల్టర్ పై దాడి చేసి, హిడ్మా అతడి భార్యను మరికొందరిని పట్టుకెళ్ళి కాల్చి చంపారా? అనుమానాలు రాకుండానే మిగతా అతడి దళాన్ని అరెస్టు చేశారా? ఒకవేళ ఇవన్నీ తప్పైతే అసలు హిడ్మా సమాచారాన్ని ఇచ్చిందెవరు? లేక ఆయనంతట ఆయనే పోలీసులకు దొరికిపోయాడా? అన్న అనుమానాలు ప్రజా, పౌరహక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు హిడ్మా లేఖ రాసింది నిజమేనా? ఆయన రాసిందెవరికి? ఆ జర్నలిస్టు ఎవరు? అన్న కోణంలోనూ పోలీసులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయని తెలిసింది. ఈమొత్తం ఎపిసోడ్ లో ఎవరైనా కోవర్టులుగా పని చేశారా? అన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

ఇదిలావుంటే, ఆధునిక టెక్నాలజీ, డ్రోన్లు, లొంగుబాట్లు, లొంగినవాళ్ళిస్తున్న సమాచారం, ప్రజల్లో మావోయిస్టులకు తగ్గిన ఆదరణ, అక్కున చేర్చుకునే వారే లేకపోవడం, గతంలోలా ప్రభుత్వాలను ప్రశ్నించేవారే కరువవడం, పెరిగిన నిర్బంధాలు, తరిగిన మావోయిస్టులు, లెఫ్ట్ తీవ్రవాదమే లేకుండా చేయాలన్న కేంద్ర ప్రభుత్వం గట్టి సంకల్పం. ‘ఆపరేషన్ కగార్’ ప్రణాళిక, పోలీసులు, దళాల లక్ష్యం, మావోల ఉద్యమాల్లో సమన్వయ లోపం, అంతర్గత కలహాలు, భిన్నాభిప్రాయాలు, బేధాభిప్రాయాలు, విభేదాలు వెరసి మావోయిస్టుల యుద్ధం ముగియడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొత్తానికి దేశంలో1967లో ప్రారంభమైన దాదాపు ఆరు దశాబ్దాల ఉత్థాన, పతనాల సాయుధ విప్లవ సుదీర్ఘ ప్రయాణం ముగింపుకు చేరుతోంది.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News