Thursday, April 16, 2026
29.7 C
Hyderabad

పాక్ పై భారత్‌ ప్రతి దాడులు?

ఆపరేషన్’పై ‘అడుగు’ అప్ డేట్
పాక్ ప్రయోగించిన 26 డ్రోన్ల నిర్వీర్యం!
అమృత్‌సర్‌లో గాయపడిన ఓ కుటుంబం
ఆరు నగరాల్లో క్షిపణుల ప్రయోగం!
రావల్పిండి సమీపంలో భారీ పేలుళ్లు!
ఇస్లామాబాద్‌ లోనూ వరుస దాడులు!
ఈ తెల్లవారుజామున ముష్కరులపై ముప్పేట దాడి
తాజా దాడులపై పాక్‌ ఆర్మీ ప్రకటన

మరోవైపు పాక్‌ సైనిక స్థావరాలపై బీఎల్‌ఏ దాడులు
సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై గ్రనేడ్లతో దాడి
బలూచిస్తాన్‌ తిరుగుబాటుదారుల వశం
క్వెట్టా సహా అనేక ప్రాంతాల స్వాధీనం

ఇంకోవైపు టీటీపీ దాడులు
20 మంది పాక్ సైనికుల హతం

పాక్ తోకాడించడం మానలేదు. ఇంకా భారత్ బార్డర్ ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉంది. 9వ తేదీ అర్థరాత్రి అనేక డ్రోన్లను భారత్ పై పాక్ ప్రయోగించింది. నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయి. వీటిలో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయి. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మెర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఉన్నాయి.

విచారకరంగా, ఫిరోజ్‌పూర్‌లోని ఒక పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న సాయుధ డ్రోన్ వల్ల స్థానిక కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారికి వైద్య సహాయం అందించారు. అలాగే ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోని ఖాసా కాంట్ మీదుగా ఎగురుతున్న బహుళ శత్రు సాయుధ డ్రోన్‌లను గుర్తించారు. శత్రు డ్రోన్‌లను మన వైమానిక రక్షణ విభాగాలు తక్షణమే నియోగించి నాశనం చేశాయి. ప్రతిగా భారత్ ఆ డ్రోన్లను నిర్వీర్యం చేసింది. ఎంతకూ పాక్ పన్నాగాలు ఆగకపోవడంతో తెల్లవారు జాము నుంచి భారత్ పాక్ పై ప్రతిదాడులు చేస్తోంది. అయితే ఈ దాడులను పాక్ ఆర్మీ ధృవీకరించింది.

పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్‌ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఇస్లామాబాద్‌, లాహోర్‌, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్‌ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి ఆరోపించారు. మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్‌ గగనతలం మూసివేస్తున్నట్లు పాకిస్తాన్‌ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్‌ ఖాన్‌, షోర్‌కోట్‌, మురిద్‌ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్‌ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
కొనసాగుతున్న బిఎల్ఎ దాడులు
పాకిస్థాన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బలూచిస్థాన్‌ తిరుగుబాటుదారులు ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకున్నారు. ఓవైపు భారత్‌పై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాక్‌ తెగబడుతున్న సమయంలో… బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) సహా మూడు తిరుగుబాటు గ్రూపులు అక్కడి పాక్‌ సైనిక స్థావరాలపై దాడులకు దిగాయి. క్వెట్టాలోని ఫైజాబాద్‌ ప్రాంతంలో పాక్‌ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై తిరుగుబాటుదారులు గ్రనేడ్లతో దాడికి దిగారు. పాకిస్థాన్‌ ఆర్మీని తరిమికొడుతూ, అక్కడి కీలక నగరం క్వెట్టా సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆరు ప్రాంతాల్లో పాక్‌ దళాలపై ఐఈడీలు, గ్రనేడ్లు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో దాడులు చేశామని బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జియాంద్‌ బలూచ్‌ ప్రకటించారు.

ఇదిలావుండగా, క్వెట్టా, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్‌ జెండాలను తొలగించి.. బలూచిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీటీపీ దాడులు

పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెహ్రిక్‌ ఈ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) తీవ్రవాదులు చేసిన దాడిలో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్‌, దక్షిణ వజిరిస్తాన్‌లోని షకాయి సబ్‌ డివిజన్‌లో ఉన్న ఓ మిలటరీ ఔట్‌పోస్టుపై గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగినట్టు రిపబ్లిక్‌ వరల్డ్‌ సంస్థ ఓ కథనంలో పేర్కొంది. లేజర్‌ రైఫిల్స్‌ ఉపయోగించి టీటీపీ చేసిన తొలి దాడిలో ఆరుగురు పాక్‌ సైనికులు మరణించారు. మిలటరీ ఔట్‌పోస్టు రక్షణకు బయలుదేరిన రెండు సైనిక వాహనాలపైనా టీటీపీ దాడి చేసింది. మొత్తంగా 20 మంది పాక్‌ సైనికులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని టీటీపీ ప్రకటించింది.

Latest News

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News