Wednesday, June 24, 2026
26.1 C
Hyderabad

రాజ్యాంగం- గవర్నర్ల వ్యవహారం- సుప్రీం తీర్పు!|EDITORIAL

రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.

పదవీ విరమణ పొందుతున్న సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ బుధ, గురు వారాల్లో రెండు రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించి సంచలన తీర్పులిచ్చారు. రాష్ట్రపతి న్యాయ సలహా కోరిన అంశంపై గురువారం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పూ సంచలనమే. తమిళనాడులో గవర్నర్, పలు బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతుండటంతో అక్కడి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గవర్నర్‌ను ఆదేశించింది. బిల్లులను తొక్కిపట్టే విధానాన్ని తప్పుబట్టింది. అయినా సరే, గవర్నర్‌ మాత్రం బిల్లులను ఆమోదించలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 8న గవర్నర్‌ రాజ్యాంగ విధుల్లో విఫలయ్యారని మండిపడింది. బిల్లులు తిప్పిపంపకుండా దగ్గర పెట్టుకోవడం కుదరదని చెప్పింది. మళ్లీ శాసనసభ ఆమోదిస్తే గవర్నర్‌ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులో గవర్నర్‌ బిల్లులను ఆమోదించకపోతే, అవి ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 13న రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలతో న్యాయ సలహా కోరింది. వాటికి సుప్రీంకోర్టు గురువారం సమాధానం ఇచ్చింది. వాదనల సమయంలో ఏప్రిల్‌ 8 నాటి తీర్పును తోసిపుచ్చే ఉద్దేశం లేదని ప్రధాన న్యాయమూర్తి పదేపదే చెప్పారు. మరో తీర్పును తోసిపుచ్చేందుకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 143 కింద సలహా కోరడాన్ని ఉపకరణంగా వాడటం కుదరదని పేర్కొంది. ప్రధానంగా బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణల్లో ఇలాంటి పరిస్థితులను చూశాం.
అయితే రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే తేల్చిచెప్పింది. విచక్షణతో వ్యవహరించవచ్చంది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవా లని గవర్నర్‌ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది.ఈ తీర్పుతో ఇప్పుడు గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బిల్లులను సకాలంలో పంపాలన్న నిబంధన లేకపోతే వారు రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయిస్తారని తమిళనాడు, బెంగాల్‌ తదితర రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించారు. గవర్నర్లకు గడువు ఉండాలని, అభిప్రాయపడ్డారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.

గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆమోదించడం లేదా సహేతుక కారణం చెప్పి బిల్లును రిజర్వులో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం చేయాలి. ఒకవేళ బిల్లును తిరస్కరించి తిరిగి అసెంబ్లీకి పంపాలి. అప్పుడు శాసనసభ తిరిగి అదే బిల్లును పంపితే, ఆమోదించాలి. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. తమిళనాడు గవర్నర్‌ రవి నిబంధనలను పట్టించుకోలేదు. అయితే, రాజ్యాంగంలోని 200 నిబంధన కింద గవర్నర్‌ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారన్నది ధర్మాసనం అభిప్రాయం. అలాంటి సమయాల్లో మంత్రి మండలి సలహా ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. 361 అధికరణ కింద వారికి రక్షణ కవచం ఉన్నప్పటికీ సుదీర్ఘమైన ఆలస్యం జరిగినప్పుడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది.

తన పరిశీలనకు వచ్చిన ప్రతి బిల్లుపై రాష్ట్రపతి రాజ్యాగంలోని 143వ అధికరణం కింద సుప్రీంకోర్టు సలహా కోరనవసరం లేదు. గవర్నర్లు నిరవధికంగా ఒక బిల్లును తమ వద్ద ఉంచుకోరాదనేదే ప్రధానం. అందువల్ల పరిమితమైన న్యాయ సవిూక్ష ఉండవచ్చని రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో అభిప్రాయపడింది. డెడ్‌లైన్‌ పెట్టి, ఆలోగా ఆమోదం ఇవ్వకపోతే లభించినట్లుగానే భావించడం రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి భంగం కలిగిస్తుందని తెలిపింది.

ఇకిప్పుడు గవర్నర్ల వద్ద బిల్లుల పెండింగ్ ఎంతకాలమనేదే సమస్య. దానికి కూడా పరిమిత కాలం ఉండకపోతే ఎలా? అందుకే పార్లమెంట్‌ చర్చించాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.

Latest News

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

జూన్ 24, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి రాత్రి 08.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం చిత్త సాయంత్రం 04.28 వరకు ఉపరి స్వాతి యోగం పరిఘ మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శివ కరణం తైతుల ఉదయం 07.45...

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

జూన్ 23, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 07.28 వరకు ఉపరి దశమి నక్షత్రం హస్త మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి చిత్త యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.02 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 07.26...

జూన్ 22, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 07.26 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 02.37 వరకు ఉపరి హస్త యోగం వ్యతీపాత మధ్యాహ్నం 03.02 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం 07.41...

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP -బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP -జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా...

సిమిటి, అస్తర్కార్ లేకుండనే గోడలు?!|ADUGU TRENDS

ఇల్లు కట్టి సూడు, పెండ్లి శేసి సూడన్నరు. గయి రెండంటే గంత కట్టమన్నట్లు.? పెండ్లంటే గిప్పట్ల సిడెంల అయిపోతానయి గనీ, గీ ఇండ్లంటేనే గవాటి టైం గయి తీసుకుంటయి. మట్టి, సిమెంటు, ఇటికె,...

సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం యోగా!|EDITORIAL

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 21 నుండి జూన్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News