Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

మహిళలకు అండగా ఐద్వా!|EDITORIAL

మహిళలు అన్ని రంగాల్లో విప్లవాత్మక విజయాలు సాధిస్తున్న ఈ కాలంలోనూ, భారత మహిళల స్థితి పూర్తిగా మారి, ఆ స్థితికి చేరిందని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతరిక్షం నుంచి రాజకీయాల వరకూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, సాధారణ మహిళలు భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. నేటికీ మహిళలు ఒంటరిగా ప్రయాణించలేని పరిస్థితులు, స్వేచ్ఛగా జీవించలేని దుస్థితి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సమాజం సాధించిన అభివృద్ధికి పెద్ద ప్రశ్న మాత్రమే కాదు. పెను సవాల్ కూడా.

సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది. పనిప్రదేశాలు, అన్ని రంగాల్లో పురుషుల పెత్తనమే కనిపిస్తోంది. మహిళలకు అధికారం దక్కినట్టు కనిపిస్తున్నా, అది వాస్తవంలో ఉండటం లేదు. పాలనలో మహిళలు ఉన్నా, మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకునే స్థాయికి ఆ అధికారం ఉపయోగపడడం లేదు. మమతా బెనర్జీ లాంటి మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోనూ నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితి అక్కడ కూడా ఉంది. ఇది మహిళలకు అధికారం ఇచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవ్వవని, ఆ అధికారాన్ని ప్రజల తరఫున వినియోగించే దృక్పథం కీలకమని స్పష్టం చేస్తోంది. మహిళలు, చిన్నపిల్లలను గౌరవించే సమాజం ఏర్పడే వరకు, వారికి సంపూర్ణ రక్షణ కల్పించే వరకు ఈ పోరాటం ఆగకూడదు.

ఈ నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అఖిల భారత 14వ మహాసభలు జనవరి 24-28 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 1981లో మార్చిలో చెన్నై వేదికగా ఐద్వా స్థాపించబడింది. దేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తి కోసం పోరాడే ఈ సంస్థకు 23 రాష్ట్రాలలో 1.1 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఇది సీపీఐఎం కి అనుబంధంగా పనిచేస్తున్నప్పటికీ స్వతంత్ర మహిళా ఉద్యమ వేదికగా గుర్తింపు పొందింది. ప్రధానంగా గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహ హింస, వరకట్నం, అత్యాచారాలు, రాజకీయ అణచివేత వంటి సమస్యలపై ఐద్వా నిరంతరం పోరాడుతుంది. అణగారిన వర్గాల మహిళల కోసం గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పనిచేస్తున్న అతిపెద్ద మహిళా సంస్థలలో ఐద్వా ఒకటి.

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ముందుకు సాగిన రైతు మహిళల నేలలో జరగనున్న మహాసభలు మహిళా ఉద్యమానికి దిశానిర్దేశం చేసే వేదికలుగా మారాలి. ఈ సందర్భంగా ఐద్వా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ‘మనువాద’ నినాదాన్ని నిర్మూలించే భావనను సగటు మహిళకు అర్థమయ్యేలా వివరించాలి. ఇది కేవలం లెఫ్ట్ పార్టీల మహిళా సంఘం అన్న ముద్రను చెరిపేసి, అన్ని వర్గాల మహిళలకు అండగా నిలవాలి.

‘మహిళలంతా ఒక్కటే’ అన్న సమభావన ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే మహిళల గొంతు మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే కాదు, సమాజంలోనూ కలసికట్టుగా నినదించే స్థాయికి రావాలి. అసంఘటిత రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా చేసిన పోరాటాలు ప్రేరణగా నిలవాలి.

సోషల్ మీడియా విస్తరణతో మహిళల వ్యక్తిత్వ హననం మరింతగా పెరిగింది. అశ్లీలత, ట్రోలింగ్, వేధింపులు సాధారణమయ్యాయి. సినిమాల్లో మహిళలను అవమానకరంగా చూపించే సన్నివేశాలపై, సోషల్ మీడియాలో మహిళల హక్కుల దుర్వినియోగంపై ఐద్వా స్పష్టమైన పోరాటం చేయాలి. సమస్య ఏదైనా, మహిళల తరఫున ఐద్వా నిలబడుతుందన్న నమ్మకం కలగాలి.

33 శాతం మహిళా రాజకీయ రిజర్వేషన్లు హక్కుగా తక్షణం అమల్లోకి రావడానికి ఐద్వా నాయకత్వం వహించాలి. పార్లమెంటు, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. కానీ అది కేవలం కార్పొరేట్, ఉన్నత వర్గ మహిళలకే పరిమితం కాకుండా, నిమ్న, బడుగు, బలహీన వర్గాల మహిళల చేతికి అధికారం చేరేలా పోరాటం సాగాలి.

స్త్రీ విముక్తి సమాజ విముక్తితో ముడిపడి ఉందన్న అవగాహన పెరగాలి. మహిళను వంటగదికి, సంతాన ఉత్పత్తికే పరిమితం చేసే ఈ వ్యవస్థపై తిరుగుబాటు రావాలి. అభ్యుదయ ఆలోచనలతో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ, ఐద్వా తన పరిధిని విస్తరించి ప్రతి మహిళకు ఒక బలమైన గొడుగుగా మారాల్సిన అవసరం ఉంది. అదే మహిళా శక్తికి నిజమైన చిరునామా అవుతుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News