Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

సౌ‘భాగ్య’నగరంగా హైదరాబాద్ నిలిచేదెలా!?|EDITORIAL

హైదరాబాద్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. హైదరాబాద్ దేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్ట్ వేర్, ఫార్మా, విద్య, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో కూడా భాగ్యనగరంగా ప్రఖ్యాతి గాంచింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాద్ కు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం వంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్ర మట్టం నుండి 541 మీ. -1776 అడుగుల- ఎత్తులో ఉంది. నగర వైశాల్యం 260 చ.కి.మీ. అంటే 00 చ.మైళ్ళు. జన సాంద్రత చ.కి.మీ. కి 10,477గా ఉంది. రాష్ట్ర జనాభాలో 4వ వంతు జనాభా ఇక్కడే ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా, ప్రస్తుతం కోటి దాటిన జనాభా, 2031 నాటికి అది 1 కోటి 84 లక్షలకు పెరుగుతుందనే అంచనా.

హెచ్ఎండిఎ 2031 కి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను అదిగమించి 2050పై దృష్టి సారించింది, ఇది వికేంద్రీకృత పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధి, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. హెచ్ఎండిఎ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని భాగాలను కలిగి ఉంది. కొత్త మాస్టర్ ప్లాన్ కింద, హైదరాబాద్‌లో రూ.17,212 కోట్ల వ్యయంతో 7,034 కిలోమీటర్ల పొడవైన మురుగునీటి నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్‌లో R1, R2 వంటి వివిధ జోన్‌లు ఉన్నాయి,

ఈ మాస్టర్ ప్లాన్ లు ఎలా ఉన్నప్పటికీ, అమలవడానికి మరికొంత సమయం కూడా పట్టవచ్చు. కానీ, ప్రస్తుతం చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్‌ రోడ్లు వరదలను తలపిస్తున్నాయి. మురుగునీటి కాలువలు జామ్ అవుతున్నాయి. రోడ్ల మీద రద్దీ నరకానికి నకలుగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందీగా మారుతోంది. వర్షం వస్తే నరకం కనిపిస్తోంది. తక్షణ సమస్యలపై కూడా ద్రుష్టి సారిచాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్‌ విస్తరిస్తున్నా అందుకు తగ్గట్లుగా డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, మంచినీరు వింటి కనీస మౌలిక వసతులు అందుబాటులో లేవు. రోడ్ల మీద పడిన వర్షపు నీరు నిరాటంకంగా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. వేలకోట్ల ఆదాయం వస్తున్నా నగరం అభివృద్ది విషయంలో పాలకులు శ్రద్ధ వహించడం లేదు. హుస్సేన్‌ సాగర్‌ను కొబ్బరినీళ్లలా తయారు చేస్తానని ప్రగల్భాలు పలికిన వాళ్ళు పత్తా లేకుండా పోయారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. హైదరాబాద్‌ సమగ్రాభివృద్దికి ప్రణాళికలు అమలు కావాలి. ప్రధానంగా మురుగునీరు, చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ట్రాఫిక్‌ సమస్యలు ఎప్పటినుంచో వేధిస్తున్నాయి. నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపై వెలసిన ఆలయాలు, దర్గాలు, ఇతర కట్టడాల తొలగేంచేయాలి. అలాగే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. హైడ్రా పనితీరు బాగుంది. ప్రజలను కూడా ఇందులో బాధ్యులను, భాగస్వాములను చేయాలి. శివారు ప్రాంతాలు విస్తరించి, నగరంలో కలిసి పోవడంతో, సిటీ ప్లానింగ్, పట్టణీకరణ భవిష్యత్ ఆధారంగా చేయాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీ.ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం జరగాలి. ఎయిర్‌ పోర్ట్‌ వరకూ, పాత నగరానికి మెట్రో విస్తరణ సాకారం కావాలి. మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్ పోర్ట్‌ సిస్టమ్‌ వంటివన్నీ కూడా ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేవే.

ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడేందుకు హైడ్రా చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు అందించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగు రోడ్డు వరకు విస్తరిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున, జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ స్థలాల పరిరక్షించడం, అక్రమ నిర్మాణాలను నియంత్రించడంలో ప్రధాన భూమికను పోషించనుంది. విపత్తుల నిర్వహణలోనూ అది కీలకం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్‌, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములకు కబ్జాదారుల చెర నుంచి విముక్తి కలిగించాలి. ప్రధాన రహదారుల పక్కన ఫుట్‌పాత్‌లపై శాశ్వత ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించాలి. వరద నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన బృందాల పనితీరును క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తం చేయాలి. నిర్దిష్టమైన బృహత్‌ లక్ష్యాలతో సాగితేనే హైదరాబాద్‌ మంచి నగరంగా రాణించగలదు. పైగా హైదరాబాద్ కి ప్రపంచంలోనే అత్యంత సెఫ్టీ నగరంగా పేరుంది. అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉన్న ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే అందుకుతగ్గ చిత్తశుద్ధి పాలకులకు ఉండాలి. అప్పుడే తన పూర్వ పేరుకు తగ్గట్లుగా భాగ్యనరం అవుతుంది. అందరికీ సౌభాగాన్ని అందిస్తుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News