Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

రాజకీయ అవినీతిని అరికట్టలేమా!?|EDITORIAL

దేశంలో, రాష్ట్రాల్లో పేరుకుపోతున్న అవినీతిని అరికట్టడానికి ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. అలాగే రాజకీయ అవినీతిని అరికట్టడానికి లోక్ పాల్, లోకాయుక్త వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. అదికార పార్టీలకు కీలు బొమ్మల్లా పై నిఘా సంస్థలు పని చేస్తున్నాయన్న విమర్శలున్నప్పటికీ ఎంతో కొంత మేర అవి పని చేస్తున్నాయి. కానీ రాజకీయ అవినీతిని నిర్మూలించడం సంగతి అటుంచి, నియంత్రించే పనిని కూడా లోక్ పాల్, లోకాయుక్త సంస్థలు చేయలేకపోతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తుంటాయి. చివరకు అవి కూడా రాజకీయాధికారం చెప్పుచేతుల్లోనే బందీ అవుతుండటం అత్యంత విచారం, విషాదం.

ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ వంటి అవినీతి నిరోధక సంస్థలు విడుదల చేసే నివేదికల ప్రకారం, మన దేశంలో అవినీతి స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి, 2024లో ప్రపంచ అవినీతి అవగాహన సూచీ (సీపీఐ) ప్రకారం భారత్ 180 దేశాలలో 96వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా తీసకుంటే దేశంలో వరసగా రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, యూపీ, తెలంగాణలున్నాయి. ఏపీ 13వ స్థానంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అవినీతిని పరిశీలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికంగా అవినీతి జరిగిందని తేలింది. 67శాతం మంది లంచాలిచ్చే పనులు చేసుకున్నామని, 27శాతం మంది పలుమార్లు లంచాలిచ్చామని సర్వేలో చెప్పారు. అంటే 94శాతం మందికి లంచాలతోనే పనులయ్యాయన్నమాట! ఇందులో అధికారుల అవినీతికంటే రాజకీయ అవినీతిదే అగ్రస్థానం అని వేరే చెప్పక్కరలేదు.

అవినీతి నిర్మూలనకు దేశంలో అనేక చట్టాలున్నాయి. అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు, సమాచార హక్కు చట్లం, ప్రజా వేగుల చట్టం, లోక్ పాల్, లోకాయుక్త చట్టం వంటివెన్నో ఉన్నాయి. కానీ అవినీతి నిర్మూలన లేదా నియంత్రణ మాత్రం జరగకపోగా, పెరుగుతూ ఉన్నది. పాలకుల్లో ప్రధానంగా ఆర్థిక నియంత్రణ లేకుండా పోతోంది. దుబారా ఖార్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేతలు తమ రక్షణకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. జీత భత్యాలు కూడా విపరీతమే. మరోవైపు బంధుప్రీతి, అవినీతి, లెక్కకు మించిన ఆదాయాలు, ఎన్నికల్లో ఖర్చు చేయడం, తిరిగి సంపాదించుకునే పనిలో ఉండటం వంటివెన్నో కారణాలున్నాయి. ఒక్కసారి అధికారం అందితే చాలు తరతరాలు బతికేంతగా సంపాదించడమే పనిగా రాజకీయ నేతలు పని చేస్తున్నారు.

ఇక ఓట్ల కోసం అలవిగాని హామీలివ్వడం, వాటిని అమలు చేయడం ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. వాటిని అమలు చేసే క్రమంలో మళ్ళీ అవినీతే చోటు చేసుకుటున్నది. అవినీతి చుట్టూ రాజకీయం, రాజకీయం చుట్టూతా అవినీతే పెనవేసుకుని కనిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుబరా చేయడం, దుర్వినియోగం చేయడం మాములైపోయింది. అధికారంలో ఉండగా అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించడం, నియంతృత్వంగా ప్రజాధనాన్ని మంచినీళ్ల కంటే అధ్వాన్నంగా ఖర్చు పెట్టడం చేస్తున్నారు. ఒక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాలకు లెక్కలేకుండా పోతోంది. అధికారంలో ఉండగా చేసిన తప్పులన్నీ, అధికారం పోయాక వెలుగు చూస్తున్నాయి. కాకపోతే, వారికి తగిన శిక్షలే పడటం లేదు. రాజకీయ అవినీతి కేసులేవీ నిలవడం లేదు. దొందూ దొందే అన్నట్లు, తోడు తొంగల్లాగా అధికార, విపక్షాలు ఒకరినొకరు సహకరించుకుంటూ, కాపాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు.

రాజకీయ అవినీతిని పూర్తిగా అరికట్టడం కష్టమైనప్పటికీ, ఎంతో కొంత తగ్గించడానికి, నియంత్రించడానికి చేసిన చట్టాలే వారికి చుట్టాలైపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని పద్ధతుల్లో అవినీతిని అరికట్ట వచ్చు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచాలి. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి, అధికారుల జవాబుదారీతనాన్ని పెంచాలి. అవినీతి నిరోధక చట్టాలను కఠినంగా రూపొందించి అమలు చేయాలి. అవినీతిపరులకు కఠినమైన శిక్షలు పడితే మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటారు. లోక్‌పాల్, లోకాయుక్త వంటివ స్వతంత్ర సంస్థలను సమర్థవంతంగా పనిచేయనివ్వాలి. అవినీతి నిర్మూలనలో ప్రజలు, పౌర సమాజ సంస్థలు భాగస్వామ్యాన్ని పెంచాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్, ఆన్‌లైన్ చేయడం వల్ల కూడా అవినీతిని అరికట్టవచ్చు. ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా నైతిక విలువలను పెంపొందించాలి.

అయితే, తాజా గణాంకాలింకా అందుబాటులోకి రానప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వాలను అభినందించడం కాదు కానీ, గత ప్రభుత్వాల హయాంలో అవినీతి అధికంగా జరిగినట్లుగా సర్వే సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో గత 12 ఏళ్ళుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. కాబట్టి గత, ప్రస్తుత అవినీతికి ఆ కూటమి తప్పకుండా బాధ్యత వహించాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తే, 2023 నవంబర్ వరకు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో 2014లో చంద్రబాబు, 2019లో జగన్, తాజాగా మళ్ళీ చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కొద్ది అటు ఇటుగా మారుతున్నప్పటికీ, దాదాపుగా రెండు కూటమిలు, రెండు మూడూ పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ప్రభుత్వ, రాజకీయ అవినీతికి ఆ పార్టీలు, వాటిని నడుపుతున్న నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అంటే ఆ పార్టీలు లేదా ఆ పార్టీలను నడిపే నాయకులే అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాలను అవినీతి మయం చేశారు. చేస్తున్నారు. అంతేగాక దేశాన్ని, రాష్ట్రాలను దోచుకున్నారనే నిజం మింగుపడటం కష్టమే. అయితే ఒకవైపు అవినీతి, మరోవైపు దోపిడీ, ఇంకోవైపు అప్పులు చేసి దివాళా తీయించడం లాంటి అన్నింటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ కంటే కూడా అటు ప్రపంచం ముందు దేశాన్ని, దేశం ముందు రాష్ట్రాల పరువును అవినీతి మయంగా తీసేసిన మన పార్టీలు, మన నాయకులను బోనెక్కించాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకోవాలి. అంతకంటే ముందు వారికి ప్రజాక్షేత్రంలోనేగాక, చట్ట పరిధిలో కూడా శిక్షలు పడేలా చేయాలి. అందుకు తగిన చట్టాలతోపాటు, అవినీతి నిర్మూలనకు నడుం కట్టే నవ యువ నాయకత్వం రావాల్సి ఉంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News