Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల నిరూపణల్లో జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ అజెండా నుంచి నెమ్మదిగా తప్పుకోవడం రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు అధికార కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రావడానికి ముందు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, అవినీతి నిరూపణలపై స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

బీఆర్ఎస్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ కార్ రేసు, ధరణి వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు నెమ్మదిగా అజెండా నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇది రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలు చేయడం ఒక ఎత్తు. వాటిని నిరూపించడం మరో ఎత్తు. అయితే, అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తాత్సారమే అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగేలా సమగ్ర విచారణ, అనుమానాలను నివ్రుతి జరగలేదన్న అభిప్రాయం ఉంది. “నిప్పులేనిదే పొగరాదు” అన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. అధికారంలో ఉన్నవారు పారదర్శకంగా స్పందించకపోతే అనుమానాలు మరింత పెరుగుతాయి.

నాదర్‌గుల్ ప్రాంతంలో భూములపై నెలకొన్న వివాదం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి రైతులను దూరం చేయడం, ప్రైవేట్ కంపెనీల జోక్యం పెరగడం వంటి అంశాలు తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ భూములు ప్రభుత్వానివా? ప్రైవేట్‌వా? రైతుల హక్కులు ఎమయ్యాయి? ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? జవాబు దొరకని పరిస్థితుల్లో రైతులు భూపోరాటానికి దిగారు. వారు కేవలం నిరసనలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష చర్యలకు దిగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

రైతులు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు, బౌన్సర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు పరిస్థితి అదుపుతప్పి, రైతులు గేట్లు దాటి లోపలికి వెళ్లడం, బౌన్సర్లను తరిమికొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది కేవలం భూమి వివాదం మాత్రమే కాదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న సంకేతం కూడా.

ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ తో పాటు వామపక్ష పార్టీలు మద్దతు తెలపడం రాజకీయ రంగును తీసుకువచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి కూడా ప్రతిపక్షంపై విమర్శలు చేయడం రైతుల్లో అసహనాన్ని పెంచింది.

రైతులు సమస్య రాజకీయం కావడం కంటే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? భూముల యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలి. స్వతంత్ర విచారణ జరపాలి. రైతుల హక్కులను రక్షించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇవి చేయకపోతే ప్రజల్లో అవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం కంటే, పాలనలో పారదర్శకత చూపించడం అత్యవసరం. నాదర్‌గుల్ వంటి సంఘటనలు కేవలం స్థానిక సమస్యలు కావు. అవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పరీక్షించే సూచికలు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం అవసరం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News